Video Call : ప్రస్తుత కాలంలో దారుణాలు ఎక్కువైపోయాయి. ప్రేమ కోసం తమ సొంత వాళ్లని చంపుకుంటున్నారు. ఇటీవల వరంగల్లో ప్రీతి మరణించింది. అలాగే హైదరాబాదులో ప్రేమ కోసం ఓ యువకుడు తన సొంత ఫ్రెండ్ని చంపేసుకున్నాడు. ఇప్పుడు ఓ యువకుడు గర్ల్ ఫ్రెండ్ తో వీడియో కాల్ లో ఉండి తండ్రిని దాడి చేశాడు. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లాలో జరిగింది. 21 ఏళ్ల కూలి పనిగా చేస్తున్న భరత్ తన ప్రియురాలితో వీడియో కాల్ లో మాట్లాడుతున్నప్పుడు తన తండ్రి ఢిల్లీ బాబుపై దారుణంగా దాడి చేశాడు.
భరత్ కు ఆ ప్రాంతంలోని 39 ఏళ్ల మహిళతో వివాహేతర సంబంధం ఉంది. దీంతో అతని తండ్రి అది మానుకోవాలని హెచ్చరించాడు. ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు కూడా చేశాడు. ఈ వ్యవహారంపై పోలీసులు భరత్ కు కౌన్సిలింగ్ ఇప్పించారు. దీంతో ఆగ్రహించిన భరత్ త్వరలోనే తన తండ్రిని కొడతానని బహిరంగంగా చెప్పాడు. అనుకున్నట్టే భరత్ తను ప్రియురాలితో ఫోన్ మాట్లాడుతుండగా తండ్రి అడ్డుపడ్డాడు, వద్దని వారించిన వినిపించుకోలేదు. దీంతో కోపం తెచ్చుకున్న భరత్ తన తండ్రిని మెటల్ రాడ్డుతో తలపై గట్టిగా కొట్టాడు.
దీంతో తండ్రి తల పగిలి తీవ్ర రక్తస్రావం అయింది. ఇదంతా 39 ఏళ్ల ప్రియురాలితో వీడియో కాల్ లో ఉండగా జరిగింది. గాయం కారణంగా తండ్రికి చాలా రక్తం పోయింది. దీంతో ఇరుగుపొరుగు వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. తన తండ్రి పై దాడి చేసిన యువకుడి పై పోలీసులకు ఫిర్యాదు ఇచ్చారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని ఆ యువకుడిని కష్టడీలో తీసుకున్నారు. ఏంటో ప్రస్తుతం కాలం ఎంత నీచంగా తయారయ్యిందంటే మాటల్లో చెప్పలేం. సభ్య సమాజం తలదించుకునేలా చేస్తున్నారు. ఒకరిని చూసి మరొకరు ఇలా చెడు మార్గాలలో వెళుతూ దారుణంగా తయారవుతున్నారు.
Bigg Boss 8 Telugu : బుల్లితెర బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ కార్యక్రమం సక్సెస్ ఫుల్గా సాగుతుంది.…
Tasty Energy Bars : రోజంతా ఎంతో ఎనర్జిటిక్ గా ఉండాలి అంటే దానికి తగ్గ ఆహారం తీసుకోవాలి. అయితే…
Horoscope : హిందూమతంలో వారంలోని ఏడు రోజులు ఒక్కొక్క దేవుడికి అంకితం చేయబడింది. ఇక దీనిలో గురువారాన్ని దేవతలకు అధిపతి…
Diabetes : ప్రస్తుత కాలంలో మధుమేహం అనేది సాధారణ సమస్యగా మారింది. అయితే వృద్ధులు మాత్రమే కాదు యువత కూడా దీని…
Shani Dev : సెప్టెంబర్ చివరి వారంలో అత్యంత శక్తివంతమైన శేష మహాపురుష యోగం ఏర్పడుతుంది. అయితే ఈ యోగం…
TS ITI Admission 2024 : డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్, తెలంగాణ TS ITI 2024 రిజిస్ట్రేషన్…
Breakfast : మనం తీసుకునే ఆహారమే మన శరీరాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే మనం తీసుకునే అల్పాహారం.…
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
This website uses cookies.