Akhila Priya
పాపం అఖిలప్రియ. ఇప్పుడు ఏం చేయలేని పరిస్థితి. అడ్డంగా బుక్కయిపోయింది. తన తల్లిదండ్రులు లేకున్నా.. రాజకీయాల్లో వాళ్ల బ్యాక్ గ్రౌండ్ ను ఉపయోగించుకొని మంత్రి స్థాయికి ఎదిగింది కానీ.. 2019 ఎన్నికల్లో టీడీపీ ఓడిపోయాక.. ఆమెను పట్టించుకునే వారే లేరు. పోనీ.. తన పార్టీలో ఉన్న నేత సమస్యల్లో ఉంటే చంద్రబాబబు అయినా పట్టించుకోవాలి కదా. కానీ.. పరిస్థితులు మొత్తం తారుమారయ్యాయి.
Why tdp neglecting akhila priya
భూమా కుటుంబం అంటేనే చంద్రబాబుకు నమ్మిన బంటులు. మధ్యలో వేరే పార్టీలోకి వెళ్లినా.. తిరిగి సొంత గూటికే చేరుకున్నారు. కానీ.. భూమా శోభా నాగిరెడ్డి చనిపోవడంతో పరిస్థితులన్నీ తలకిందులయ్యాయి. ఆమె మరణం తర్వాత వైసీపీ నుంచి భూమా నాగిరెడ్డి టీడీపీలో చేరారు. అప్పుడు చంద్రబాబు చాలామందిని వైసీపీ నుంచి లాగారు. పదవి ఆశలు చూపించారు.
దీంతో భూమా నాగిరెడ్డి కూడా టీడీపీ వైపు మొగ్గు చూపించారు. టీడీపీలో ఉన్న సమయంలోనే భూమా నాగిరెడ్డి కూడా చనిపోయారు. దీంతో భూమా ఫ్యామిలీయే లేకుండా పోయింది. భూమా కూతురు అఖిల ప్రియ రంగంలోకి దిగింది. సానుభూతి కోసం అఖిలప్రియకు చంద్రబాబు మంత్రి పదవి ఇచ్చారు.
కట్ చేస్తే 2019 ఎన్నికల్లో టీడీపీ ఘోరంగా ఓడిపోయింది. దీంతో భూమా ఫ్యామిలీకి కూడా కష్టాలు తప్పలేదు. అఖిలప్రియకు కష్టాలు ప్రారంభం అయ్యాయి. ఆస్తుల గొడవలు, కిడ్నాప్ కేసులు ఆమెను వెంటాడుతున్నాయి. ఇటీవలే బోయిన్ పల్లి కిడ్నాప్ కేసులో ఆమె అరెస్ట్ అయింది.
కానీ.. ఆమె అరెస్ట్ పై టీడీపీ కనీసం స్పందించలేదు. చంద్రబాబు కిక్కుమనలేదు. ఆమెను పట్టించుకోవడమే మానేశారు. తమ పార్టీ నేత, మాజీ మంత్రి ఇలాంటి ఇబ్బందుల్లో ఉంటే కనీసం పట్టించుకునే నాథుడే లేడా టీడీపీలో. ఇదేనా టీడీపీ నేతలకు ఇచ్చే గౌరవం, ప్రాధాన్యత.. అంటూ కొందరు టీడీపీ నేతలు కూడా ఫైర్ అవుతున్నారట.
చంద్రబాబు ప్రవర్తిస్తున్న తీరు చూస్తుంటే అఖిలప్రియ టీడీపీకి దూరం అయినట్టేనని.. చంద్రబాబు అఖిలప్రియను దూరం పెట్టేశారని.. ఇక.. టీడీపీకి, ఆమెకు కాలం చెల్లిపోయిందని కొందరు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా.. పార్టీ కోసం పనిచేసిన వాళ్లను ఇలా చంద్రబాబు కష్టకాలంలో పట్టించుకోకపోవడం.. అది పార్టీకే తీరని నష్టమని.. అది భవిష్యత్తులో పార్టీని దెబ్బతీస్తుందని అంటున్నారు. చూద్దాం మరి చంద్రబాబు భవిష్యత్తులో ఇంకేం చేస్తారో?
Arattai app |ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది వినియోగదారులు ఉపయోగిస్తున్న వాట్సాప్కి భారత్ నుండి గట్టి పోటీగా ఓ స్వదేశీ మెసేజింగ్…
RRB | సర్కారు ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న యువతకు శుభవార్త! భారతీయ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు (RRB) తాజాగా పెద్ద…
Farmers | ఆంధ్రప్రదేశ్ రైతులకు ఒక కీలకమైన హెచ్చరిక. ఈ-క్రాప్ బుకింగ్కు సెప్టెంబర్ 30 (రేపు) చివరి తేదీగా వ్యవసాయ…
Modi | ప్రధాని నరేంద్ర మోదీ తన షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ 16న ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వస్తున్నారు. ఈ సందర్భంగా…
Telangana | తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన ప్రక్రియ అధికారికంగా ప్రారంభమైంది. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (SEC)…
Prize Money | ఆసియా కప్ 2025 ఫైనల్లో ప్రతిష్టాత్మక భారత్ vs పాకిస్తాన్ తలపడడం క్రికెట్ ప్రపంచాన్నే ఉత్కంఠకు…
Chia Seeds | ఆధునిక జీవనశైలిలో జీర్ణవ్యవస్థ సంబంధిత సమస్యలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఆహారపు అలవాట్లు, ఒత్తిడి, ఫైబర్ లేకపోవడం,…
TEA | ఒత్తిడి, జ్ఞాపకశక్తి లోపం, మానసిక అలసట.. ఇవన్నీ ఆధునిక జీవితశైలిలో సాధారణమయ్యాయి. ఈ తరుణంలో మెదడు ఆరోగ్యాన్ని…
This website uses cookies.