7th Pay Commission
8th Pay Commission : ఏడో వేతన సంఘం తెలుసు కదా. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు, జీతాల పెంపు, డీఏ పెంపు, డీఆర్, ఇతరత్రా ప్రయోజనాలు అన్నీ ఏడో వేతన సంఘం సిఫారసుల మేరకు కేంద్రం అమలు చేస్తుంటుంది. ఏడో వేతన సంఘం ఏర్పడకముందు ఆరో వేతన సంఘం ఉండేది. దాని ప్రకారం.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులను జీతాలు ఉండేవి. ప్రస్తుతం ఉన్న ఏడో వేతన సంఘాన్ని ఆపేసి.. ఎనిమిదో వేతన సంఘాన్ని కేంద్రం తీసుకురానున్నదట. నిజానికి.. ఇది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల నుంచి వస్తున్న డిమాండే.
will 7th pay commission replaced as 8th pay commission
చాలాకాలంగా ఎనిమిదో వేతన సంఘాన్ని ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఆ దిశగా కేంద్రం కూడా ఆలోచిస్తుందని అనుకున్నారు. ఇటీవల ప్రవేశ పెట్టిన బడ్జెట్ లోనూ అదే చెబుతారని అనుకున్నారు కానీ.. అలాంటి ప్రకటన ఏదీ కేంద్రం నుంచి బడ్జెట్ లో రాలేదు. దీంతో ఇప్పట్లో 8వ వేతన సంఘం ఉండదేమో అని అనుకున్నారు. మామూలుగా ప్రతి 10 ఏళ్లకు ఒకసారి కమిషన్ ను మారుస్తుంటారు. ఐదో పే కమిషన్ తర్వాత ఆరో పే కమిషన్.. ఇప్పుడు ఏడో కమిషన్. 2014 లో ఏడో వేతన సంఘం ఏర్పాటు అయింది. ఇంకో సంవత్సరం అయితే 10 ఏళ్లు పూర్తవుతుంది.
will 7th pay commission replaced as 8th pay commission
2024 లోపు ఏడో వేతన సంఘాన్ని ఆపేసి.. ఎనిమిదో వేతన సంఘాన్ని ఏర్పాటు చేయాలి. అందుకే.. వచ్చే ఏడాదిలోగా ఏడో పే కమిషన్ ను ఆపేసి.. ఎనిమిదో వేతన సంఘాన్ని తీసుకొస్తారని తెలుస్తోంది. ఎలాగూ వచ్చే సంవత్సరం ఎన్నికలు కూడా ఉన్న నేపథ్యంలో 2024 మొదట్లోనే ఎన్నికలకు ముందే కేంద్రం 8వ వేతన సంఘాన్ని ఏర్పాటు చేయనున్నట్టు తెలుస్తోంది. తద్వారా లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు కేంద్రానికి మద్దతు ఇచ్చే అవకాశం ఉంది. 8వ వేతన సంఘం ఏర్పాటు అయితే.. ఉద్యోగుల జీతాలు పెంచడం, బేసిక్ వేతనాన్ని పెంచడం, ఫిట్ మెంట్ పెంపు, ఇతర అలవెన్సులు, డీఏల పెంపుపై ఈ సంఘం కేంద్రానికి సిఫారసులు చేయనుంది.
Nara Lokesh : అమరావతి మహిళపై కొమ్మినేని చేసిన వ్యాఖ్యలు చినికి చినికి గాలివానలా మొదలైన ఘటన, ఇప్పుడు పెద్ద…
Indiramma Housing Scheme : తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణ దిశగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో ప్రభుత్వం శరవేగంగా అడుగులు…
Ambati Rambabu : ప్రముఖ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్ట్ ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా…
TGSRTC : తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా టీఎస్ఆర్టీసీ బస్సుల బస్ పాస్ ఛార్జీలను భారీగా పెంచింది. కొత్త ధరలు జూన్ 9…
Chandrababu : తెలుగుదేశం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పుడు తన పార్టీ ఎమ్మెల్యేల పనితీరుపై దృష్టి సారించారు. ప్రజల…
Ranapala Plant Benefits : ఈ రోజుల్లో అనారోగ్య సమస్యల పడుతున్న వారి సంఖ్య పెరిగిపోతుంది. అందుకని కొంతమంది ఔషధ…
Honey Moon : మధ్యప్రదేశ్ కి చెందిన రాజా రఘువంశీ, సోనమ్ జంట మే 11న వివాహం చేసుకుని మే…
Mudragada Padmanabham : సీనియర్ నాయకుడు ముద్రగడ పద్మనాభం తన కుటుంబానికి సంబంధించిన అంశాలను బహిరంగంగా పంచుకున్నారు. తాజాగా విడుదల…
This website uses cookies.