Nara Lokesh : ఏ రాష్ట్రంలో అయినా సరే.. ఒక రాజకీయ నేత పాదయాత్ర చేస్తానంటే మరో పార్టీ ఊరుకోదు. అదే అధికార పార్టీ అయితే.. ప్రతిపక్ష పార్టీని అస్సలు ముందుకు సాగనీయదు. ప్రతిపక్ష పార్టీలు పాదయాత్రలు గట్రా చేస్తే ప్రజలంతా ఆ పార్టీ వైపునకు తిరిగితే అప్పుడు పరిస్థితి ఏంటి.. అందుకే.. ప్రతిపక్ష పార్టీలను అడ్డుకోవడమే అధికార పార్టీ పని. అదే ఏపీలోనూ జరుగుతోంది. ఓవైపు టీడీపీ నేత నారా లోకేశ్ పాదయాత్ర అంటూ సన్నాహాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈనెల 27 నుంచి పాదయాత్రకు సిద్ధం కూడా అవుతున్నారు. పాదయాత్ర కోసం కావాల్సిన పర్మిషన్స్ అన్నీ తీసుకుంటున్నారు. తాజాగా డీజీపీకి టీడీపీ నేత వర్ల రామయ్య.. పాదయాత్రకు అనుమతి కోరుతూ లేఖ కూడా రాశారు. దానిపై స్పందించిన డీజీపీ తిరిగి ఆయనకు లేఖ పంపారు.
అసలు పాదయాత్రకు సంబంధించిన వివరాలు అన్నీ పంపించాలంటూ కోరారు. దానికి సంబంధించిన పూర్తి సమాచారం కావాలన్నారు. దీంతో వెంటనే దానికి కౌంటర్ గా మరో లేఖను రాసింది టీడీపీ. అందులో ఇదివరకు జరిగిన పాదయాత్రలను ప్రస్తావించింది. అప్పట్లో గాంధీ చేసిన యాత్ర నుంచి మొన్న సీఎం జగన్ చేసిన పాదయాత్ర వరకు అన్నింటినీ అందులో పొందుపరిచింది. అప్పట్లో జగన్ కూడా పాదయాత్ర సందర్భంగా ఎలాంటి అనుమతి తీసుకోలేదని.. ఇప్పుడు లోకేశ్ పాదయాత్ర కోసం డీజీపీ కోరిన వివరాలు అవసరం లేదు అంటూ టీడీపీ కౌంటర్ ఇచ్చింది. అయితే.. లోకేశ్ పాదయాత్రలో ఎవరు ఉంటున్నారు.. ఏ నేత పాల్గొంటారు అనేది ప్రస్తుతానికి తెలియదు. కానీ.. ఇంకా యాత్ర కోసం పర్మిషన్ల దగ్గరే టీడీపీ ఆగిపోయింది.
పాదయాత్ర రూట్ మ్యాప్ కావాలని డీజీపీ కోరారు. యాత్రలో ఎవరు పాల్గొంటున్నారు. ఎంతమంది పాల్గొంటున్నారు. వాడే వాహనాలు ఏంటి.. వాటి నెంబర్లు ఏంటి.. ఎన్ని వాహనాలు.. ఇలా అన్ని రకాల ప్రశ్నలను డీజీపీ సంధించారట. దీనిపై టీడీపీ కౌంటర్ గా మరో లేఖ కూడా పంపించింది. అప్పట్లో డీజీపీ అడగని వివరాలు.. ఇప్పటి డీజీపీకి ఎందుకు అంటూ టీడీపీ కౌంటర్ వేసింది. యాత్ర కుప్పంలో ప్రారంభం అయి.. 125 అసెంబ్లీ నియోజకవర్గాల మీదుగా ఇచ్చాపురం వరకు చేరుతుందని ఆ లేఖలో పేర్కొన్నారు. మరి.. చివరకు నారా లోకేశ్ యాత్రకు పర్మిషన్ వస్తుందా? రాదా? అనేది తెలియాలంటే ఇంకొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.
Shani Dev : సెప్టెంబర్ చివరి వారంలో అత్యంత శక్తివంతమైన శేష మహాపురుష యోగం ఏర్పడుతుంది. అయితే ఈ యోగం…
TS ITI Admission 2024 : డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్, తెలంగాణ TS ITI 2024 రిజిస్ట్రేషన్…
Breakfast : మనం తీసుకునే ఆహారమే మన శరీరాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే మనం తీసుకునే అల్పాహారం.…
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
CISF Fireman Recruitment : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్మెన్ల నియామక…
Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ…
7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్నెస్ అలవెన్స్ (డీఏ)ని ప్రభుత్వం పెంచబోతోంది. ప్రభుత్వం త్వరలో…
This website uses cookies.