
yellow media again started attack on janasena and pawan kalyan
TDP vs Pawan Kalyan : ఏపీలో ప్రస్తుతం రాజకీయాలకు జనసేన కేరాఫ్ అడ్రస్ గా మారుతోంది. ఎందుకంటే అధికార వైసీపీ పార్టీని ప్రతి క్షణం, ప్రతి సందర్భంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విమర్శిస్తూనే ఉంటారు. ఎలాగూ వైసీపీ ప్రభుత్వంపై పవన్ కళ్యాణ్ దుమ్మెత్తిపోస్తున్నారు కాబట్టి అది టీడీపీకి ప్లస్ అవుతుందని భావించింది. రాజకీయంగా తమకు ప్లస్ అవుతుందని భావించారు. అందుకే వైసీపీ ప్రభుత్వంపై కేవలం పవన్ కళ్యాణ్ మాత్రమే ఫోకస్ అయ్యారు. టీడీపీ కాస్త సైలెంట్ అయినట్టు కనిపించింది. మరోవైపు పవన్ కళ్యాణ్, చంద్రబాబు భేటీ కావడంతో ఇక టీడీపీ,
జనసేన పొత్తు కన్ఫమ్ అయినట్టే అని అంతా అనుకున్నారు. నిజానికి బీజేపీతో పవన్ కళ్యాణ్ పొత్తు పెట్టుకున్నారు. కానీ.. బీజేపీ నుంచి తను అనుకున్న సహకారం పవన్ కు ఎప్పుడూ లభించలేదు. అందుకే చంద్రబాబుతో కలిసి పవన్ కళ్యాణ్ నడవాలని అనుకున్నట్టు అందరూ అనుకున్నారు. కానీ.. ఇంతలోనే టీడీపీకి షాకిచ్చేలా ఏకంగా ప్రధాని నరేంద్ర మోదీనే చేశారు. ప్రధాని నరేంద్ర మోదీతో పవన్ కళ్యాణ్ భేటీ అవడంతో టీడీపీకి షాక్ అయినంత పని అయింది. ఇటీవల ఏపీలో పర్యటించిన ప్రధాని మోదీ.. పవన్ కళ్యాణ్ తో భేటీ కావడంతో ఏపీ రాజకీయాలు ఒక్కసారిగా మారిపోయారు.
yellow media again started attack on janasena and pawan kalyan
జనసేనకు ఒక్కసారిగా క్రేజ్ వచ్చేసింది. దీంతో ఎల్లో మీడియా పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేసింది. ఇదంతా తెర వెనుక నుంచి టీడీపీ నడిపిస్తున్న మైండ్ గేమ్ అని అర్థం అయింది. జనసేనానిపై టీడీపీ.. ఎల్లో మీడియా ద్వారా టార్గెట్ చేసిందా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇంకా పవన్ కళ్యాణ్ బీజేపీతో కలిసి నడుస్తా అని క్లారిటీ కూడా ఇవ్వలేదు. ఇంతలోనే పవన్ పై తీవ్రస్థాయిలో దాడికి ఎల్లో మీడియా తెగబడటంతో ఏపీ రాజకీయాలు ఒక్కసారిగా యూ టర్న్ తీసుకున్నట్టు అర్థం అవుతోంది. చూద్దాం మరి భవిష్యత్తులో పవన్ నిర్ణయం ఎటువైపు ఉంటుందో?
Ys Jagan : వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెన్నైలో ఒక పెళ్లి వేడుకకు వెళ్తే అది కాస్తా ఇప్పుడు…
Ram Charan Upasana Twins Names : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరియు ఉపాసన దంపతులకు సంబంధించి…
Johnny Master : చిక్రీ సాంగ్లో హుక్ స్టెప్ ఐడియా నాది కాదు.. అసలు విషయం బయటపెట్టిన జానీ మాస్టర్…
Telangana Municipal Results 2026 : తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో ప్రతి ఓటు ఎంత విలువైందో చాటిచెప్పే ఆసక్తికర…
AP Govt Good news to New Pensions : ఆంధ్రప్రదేశ్లో పింఛన్ల అంశంపై శాసనమండలి వేదికగా ప్రభుత్వం మరియు…
Telangana Municipal Polls 2026 : తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో అధికార కాంగ్రెస్ పార్టీ తన రాజకీయ ఆధిపత్యాన్ని…
Rajya Sabha : ఆంధ్రప్రదేశ్లో ఖాళీ అవుతున్న నాలుగు రాజ్యసభ స్థానాల భర్తీకి సమయం దగ్గరపడుతుండటంతో, అధికార కూటమిలో అభ్యర్థుల…
Fruits : ఆరోగ్యకరమైన ఆహారం అంటే చాలా మంది ముందుగా గుర్తుచేసుకునేది పండ్లే. విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉండే…
This website uses cookies.