Ys Bharati : 2019 సాధారణ ఎన్నికల్లో వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి అధిక మెజారిటీతో అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే వచ్చే ఎన్నికల్లోనూ వైసీపీ విజయ ఢంకా మోగిస్తుందని ఆ పార్టీ శ్రేణులు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ఈ క్రమంలోనే ప్రతిపక్ష టీడీపీని ఓడించాలనేది టార్గెట్ కాగా అందుకు సంబంధించిన కసరత్తును ఇప్పటి నుంచే స్టార్ట్ చేసినట్లు తెలుస్తోంది.
గత ఎన్నికల మాదిరి పరిస్థితులు ఇప్పుడు ఉండబోవు. ఈ సారి జగన్ ఒక్కడే రాష్ట్రవ్యాప్తంగా పర్యటించాల్సి ఉంటుంది. ప్రచార బాధ్యతలను తానొక్కడే మోయాల్సి ఉంటుంది. గతంలో అయితే వైసీపీ తరఫున విజయమ్మ , వైఎస్ షర్మిల ప్రచారం చేశారు. ఇక జగన్ నాలుగు వేల కిలోమీటర్ల పాదయాత్ర చేసి ప్రజల్లోకి వెళ్లారు. అయితే, ఈ సారి షర్మిల తెలంగాణలోనే ఉండబోతున్నది. విజయమ్మ సైతం ఆమెకు మద్దతుగా అక్కడికే వెళ్లొచ్చు.
ఒకవేళ ఏపీకి వచ్చినా ఒకటి రెండు సభల్లోనే పాల్గొనే చాన్సెస్ ఉంటాయి. ఈ క్రమంలోనే 175 నియోజకవర్గాల్లో జగన్ ఒక్కడే ప్రచారం చేయలేడు. కాబట్టి జగన్ తనకు మద్దతుగా వైఎస్ భారతిని రంగంలోకి దించబోతున్నారని తెలుస్తోంది. ఇప్పటి వరకు భారతి సాక్షి మీడియా సంస్థ చైర్ పర్సన్గా , ఇండస్ట్రియలిస్ట్గా, గృహిణిగా మాత్రమే బాధ్యతలు నిర్వర్తించింది. జగన్ సీఎం అయిన నాటి నుంచి తాడేపల్లిలో జగన్ బాగోగులు చూసుకుంటున్నది. ఈ క్రమంలోనే వచ్చే ఎన్నికల్లో ఆమెకు ప్రచార బాధ్యతలు అప్పగించాలని అధినేత యోచిస్తున్నట్లు సమాచారం.
రాష్ట్రవ్యాప్తంగా భారతి పర్యటించేలా ఏర్పాట్లు చేసి, ఆమె ద్వారా మహిళా ఓటర్లను అట్రాక్ట్ చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు వినికిడి. అయితే, భారతి ఇంత వరకు పబ్లిక్ మీటింగ్స్లో అయితే పాల్గొనలేదు. ఈ క్రమంలోనే పబ్లిక్ మీటింగ్స్లో ఎలా మాట్లాడాలనే విషయాలపై శిక్షణ తీసుకుంటున్నట్లు పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. మొత్తం మీద వచ్చే ఎన్నికల నాటికి వైఎస్ భారతి ఏపీ యాక్టివ్ పాలిటిక్స్లో ఉండబోతుందనే చర్చ ఇప్పటి నుంచి షురూ అవుతోంది.
Bay Leaf Water : ప్రస్తుత కాలంలో బిర్యానీ నుండి నాన్ వెజ్ వంటకాల వరకు బే ఆకులను ప్రతి…
Pitru Paksha : హిందూ సనాతన ధర్మంలో ఏడాదిలోని ఒక నిర్దిష్ట కాలాన్ని పూర్వికులకు అంకితం చేయబడింది. ఈ కాలాన్ని…
Canara Bank : కెనరా బ్యాంక్ 3,000 అప్రెంటిస్ ఖాళీల భర్తీ కోసం నోటిఫికేషన్ను విడుదల చేసింది. రిజిస్ట్రేషన్ ప్రక్రియ…
Anjeer Juice : అంజీర్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది అనే సంగతి అందరికీ తెలిసిందే. అయితే సాధారణంగా మనం అంజీర్…
Bigg Boss 8 Telugu : బిగ్ బాస్ సీజన్ 8 లో రోజులు గడుస్తున్నా కొద్దీ టాస్కులు టఫ్…
Tirumala Laddu Prasadam : కలియువ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి ఏడు కొండల పుణ్యక్షేత్రానికి చాలా విశిష్తత ఉంది.…
Flipkart Big Billon Days Sale 2024 : ఫ్లిప్ కార్ట్ నుంచి బిగ్ బిలియన్ డేస్ సేల్ 2024…
Balineni Srinivasa Reddy : ఏపీలో ప్రస్తుతం పరిస్థితులు ఎంతగా మారుతున్నాయో మనం చూస్తూ ఉన్నాం. వైసీపీ పార్టీ నాయకులు…
This website uses cookies.