Ys jagan : ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన నిర్ణయాన్నిమార్చుకుంటే బాగుండని వైసీపీ నేతలు కోరుకుంటున్నారు. జగన్ తన నిర్ణయాన్ని మార్చుకుంటే తమ పంట పండినట్టే అని కొందరు వైసీపీ నేతలు భావిస్తున్నారు. జగన్ నిర్ణయానికి వైసీపీ నేతల పంట పండటానికి గల లింక్ ఎంటో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..ఇటీవల అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా సీఎం జగన్ రెండు సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. తాను తీసుకొచ్చిన రెండు బిల్లులను, ఒక తీర్మానాన్ని వెనక్కి తీసుకున్నారు.
అందులో అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లు, సీఆర్డీఏ రద్దు బిల్లులు కూడా ఉన్నాయి. ఇకపోతే ఆ తర్వాత రోజు ఏపీ శాసన మండలి రద్దు నిర్ణయాన్ని కూడా వెనక్కి తీసుకుంటూ మరో తీర్మానం చేశారు. జగన్ తన నిర్ణయాన్ని మార్చుకోవడంతో కొందరు వైసీపీ నేతల్లో మళ్లీ ఆశలు చిగురించాయి. జగన్ ఆ నిర్ణయాన్ని కూడా వెనక్కి తీసుకుంటే తమ పంట పండినట్టే అని భావిస్తున్నారు.ఆ నేతలు ఎవరంటే తాజాగా ఎమ్మెల్యే కోటాలో ఎమెల్సీలుగా ఎన్నికైన చిన్న గోవిందరెడ్డి, ఇషాక్ బాషా, పాల వలస విక్రాంత్ వర్మ..
వీరంతా ఎమ్మెల్యే కోటాలో శాసన మండలిలో అడుగుపెట్టారు. మరోవైపు 8 జిల్లాల్లో స్థానిక సంస్థల కోటా కింద మరో 11 మంది ఎమ్మెల్సీలు కూడా పెద్దల సభకు వచ్చారు. అయితే, ప్రస్తుతం వైసీపీ పార్టీకి మండలిలో కూడా కావాల్సిన మెజార్టీ ఉంది. ఇదే వైసీపీ నేతల్లో కొత్త ఆశలను చిగిరింపచేస్తోంది. రాబోయే కాలంలో కేబినెట్ విస్తరణలో భాగంగా ఎమ్మెల్సీలను కూడా తీసుకుంటే బాగుంటుందని వీరంతా ఆలోచిస్తున్నారు.
గతంలో మండలిని రద్దు చేసిన జగన్ ఎమ్మెల్సీ కోటాలో మంత్రులు అయిన వారిని రాజీనామా చేయించారు. వీరిలో సీనియర్ నేతలు పిల్లి సుభాష్, మోపిదేవి వెంకట రమణ ఉండగా… వీరిని ముఖ్యమంత్రి జగన్ రాజ్యసభకు పంపించినట్టు తెలిసింది. ఇప్పుడు మండలి మళ్లీ ఏర్పాటైంది. దీంతో మరోసారి కేబినెట్ విస్తరణలో ఎమ్మెల్సీలకు అవకాశం కల్పిస్తే బాగుంటుందని వారు గంపెడాశలతో ఎదరుచూస్తున్నారని తెలిసింది.
Bigg Boss 8 Telugu : బిగ్ బాస్ సీజన్ 8 లో రోజులు గడుస్తున్నా కొద్దీ టాస్కులు టఫ్…
Tirumala Laddu Prasadam : కలియువ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి ఏడు కొండల పుణ్యక్షేత్రానికి చాలా విశిష్తత ఉంది.…
Flipkart Big Billon Days Sale 2024 : ఫ్లిప్ కార్ట్ నుంచి బిగ్ బిలియన్ డేస్ సేల్ 2024…
Balineni Srinivasa Reddy : ఏపీలో ప్రస్తుతం పరిస్థితులు ఎంతగా మారుతున్నాయో మనం చూస్తూ ఉన్నాం. వైసీపీ పార్టీ నాయకులు…
Pushpa 2 : సుకుమార్- అల్లు అర్జున్ ప్రధాన పాత్రలలో రూపొందిన పుష్ప చిత్రం ఎంత పెద్ద హిట్ అయిందో…
Chandrababu : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఒక్కో హామీని నెరవేరుస్తున్నారు. సూపర్ సిక్స్ హామీల్లో కూటమి పార్టీ…
Ram Charan : డైరెక్టర్ శంకర్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబోలో తెరకెక్కుతున్న మూవీ గేమ్ ఛేంజర్.…
TDP Alliance ఆంధ్రప్రదేశ్లోని కూటమి (టీడీపీ, జనసేన, బీజేపీ) ప్రభుత్వం వంద రోజులు పూర్తి చేసుకుంది. ఈ నెల 20…
This website uses cookies.