YS Jagan : ఏపీ సీఎం వైఎస్ జగన్ ఏపీలో తీసుకొచ్చిన ప్రభుత్వ పథకాలు మరే రాష్ట్రంలో లేవు. సీఎంగా ఆయన బాధ్యతలు తీసుకున్నాక ఏపీలో విద్య, వైద్యం మీద ఎక్కువ ఫోకస్ పెట్టారు. విద్య వ్యవస్థ ఎంత పటిష్టంగా ఉంటే ఆ రాష్ట్రం కూడా అంత బాగా డెవలప్ అవుతుందని నమ్మే వ్యక్తి వైఎస్ జగన్. అందుకే.. ఆయన విద్య మీద ఎక్కువ ఫోకస్ పెట్టి నాడు నేడు పేరుతో పలు విద్యకి సంబంధించిన పథకాలను తీసుకొచ్చారు. ఆ పథకాలు దేశవ్యాప్తంగానే కాదు.. ప్రపంచ గుర్తింపు పొందాయి.
విద్య వ్యవస్థను పూర్తిగా ప్రక్షాళన చేసి పేద విద్యార్థులకు కూడా బెస్ట్ ఎడ్యుకేషన్ విధంగా విద్యా వ్యవస్థను రూపొందించారు సీఎం జగన్. తాజాగా ఆయన మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. తాజాగా ఏపీ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. పేద విద్యార్థుల కోసం తీసుకున్న నిర్ణయం ఇది. విద్యా హక్కు చట్టం కింద ఏపీలో ఉన్న ప్రైవేట్ స్కూళ్లలో 25 శాతం సీట్లను పేద విద్యార్థులకు కేటాయించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దానికి సంబంధించిన జీవోను కూడా విడుదల చేసింది ప్రభుత్వం.
ప్రైవేట్, అన్ ఎయిడెడ్ స్కూళ్లలో విద్యా హక్కు చట్టం కింద 25 శాతం సీట్లు కేటాయించాలని జగన్ సర్కార్ జీవో జారీ చేసింది. దీనికి సంబంధించి మార్చి 6 నుంచి 18 వరకు స్కూల్స్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఆ తర్వాత పేద విద్యార్థులు తమకు నచ్చిన స్కూళ్లలో ఏప్రిల్ 7 వరకు రిజిస్ట్రేషన్ చసుకుంటారు. తొలి విడత కింద విద్యార్థుల ఎంపిక ప్రక్రియ ఏప్రిల్ 13న లాటరీ ద్వారా ఉంటుంది. రెండో విడత ఏప్రిల్ 25న లాటరీ ద్వారా విద్యార్థులను సెలెక్ట్ చేస్తారు. ఈ స్కూళ్లలో చదివే విద్యార్థులకు పట్టణ ప్రాంతాల విద్యార్థులకు రూ.8000, గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు రూ.6500, గిరిజన ప్రాంతాల విద్యార్థులకు రూ.5000 లను ప్రభుత్వం చెల్లిస్తుంది.
Raviteja : మాస్ మహరాజ్ రవితేజ హీరోగా తన కెరీర్ ఎండ్ అయ్యిందని ఫిక్స్ అయ్యాడా.. అదేంటి ఆయన వరుస…
Electric Vehicles : భారత ప్రభుత్వం PM ఎలక్ట్రిక్ డ్రైవ్ రివల్యూషన్ ఇన్ ఇన్నోవేటివ్ వెహికల్ ఎన్హాన్స్మెంట్ (PM E-డ్రైవ్)…
TGSRTC : తెలంగాణా ఆర్టీసీ సంస్థ నుంచి నోటిఫికేషన్ వచ్చింది. TGSRTC నుంచి ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, ట్యూటర్ పోస్టులకు…
Jr NTR : సినిమాలు రాజకీయాలు వేరైనా కొందరు సినీ ప్రముఖులు నిత్యం రాజకీయాల్లో ప్రత్యేక టాపిక్ గా ఉంటారు.…
Ganesh Nimajjanam : దేశవ్యాప్తంగా గణేష్ నవరాత్రోత్సవాలు అద్భుతంగా జరుగుతున్నాయి. వినాయకుడికి దేశవ్యాప్తంగా పూజలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. తెలంగాణాలో…
Revanth Reddy : పార్టీ మారిన తెలంగాణా బీ ఆర్ ఎస్ ఎమ్మెల్యేలపై అసెంబ్లీ స్పీకర్ నిర్ణయం కీకలం కానుంది.…
Shekar Basha : బిగ్బాస్ తెలుగు 8 సక్సెస్ ఫుల్గా రెండు వారాలు పూర్తి చేసుకుంది. 14 మంది కంటెస్టెంట్స్…
Liquor : ఏపీలో కొత్త మద్యం పాలసీపై కసరత్తు దాదాపు ముగిసింది అనే చెప్పాలి. 2019 కంటే ముందు రాష్ట్రంలో…
This website uses cookies.