telangana congress leaders voice about ys sharmila
ys sharmila : ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోదరి.. మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూతురు అయిన వైఎస్ షర్మిల పార్టీ పెట్టడం దాదాపుగా కన్ఫర్మ్ అయ్యింది. తెలంగాణ రాష్ట్రంలో ఆమె పార్టీ పెట్టబోతున్నట్లుగా ఇప్పటికే దాదాపుగా క్లారిటీ వచ్చింది. గత ఆరు నెలలుగా ఆమె బ్యాక్ గ్రౌండ్ వర్క్ చేసుకుంటూనే ఉన్నారు. ఆమె ఒక్క రోజు రెండు రోజుల్లో ఈ నిర్ణయం తీసుకోలేదు. ఎన్నో విషయాల గురించి ఆలోచించి, వందల మందితో సంప్రదింపులు జరిపి పలు రాష్ట్రాల్లో పరిస్థితులను పరిశీలించి తెలంగాణలో తన బలం ఏంటీ అనేది సర్వే చేయించుకుని ఇంకా రాజన్న అభిమానులు ఉన్నారా అనేది తెలుసుకున్న తర్వాతే షర్మిల రంగంలోకి దిగాలనే నిర్ణయాన్ని తీసుకున్నారు అనేది ప్రతి ఒక్కరి మాట.
Telangana political partys tension about ys sharmila rajanna congress party
ఇప్పుడు తెలంగాణలో ఎక్కడ చూసినా కూడా షర్మిల పార్టీ పెట్టబోతుంది కదా ఆమె పార్టీ వల్ల ఎవరికి ఎంత నష్టం అన్నట్లుగా చర్చ జరుగుతోంది. ఎక్కువగా కాంగ్రెస్ కు నష్టంగా చెబుతున్నారు. ఎందుకంటే కాంగ్రెస్ లో ఇంకా కూడా రాజన్న అభిమానులు ఉన్నారు. జగన్ పార్టీ పెట్టిన సమయంలో కొందరు ఆయనతో వెళ్లేందుకు ఆసక్తి చూపించలేదు. కాని ఇప్పుడు పరిస్థితులు వేరుగా ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ బలంగా లేదు. టీఆర్ఎస్ ముందు పిల్లిగంతులు వేస్తుంది. ఇలాంటి సమయంలో షర్మిల పెట్టబోతున్న రాజన్న కాంగ్రెస్ పార్టీలో ఖచ్చితంగా మంచి భవిష్యత్తు ఉంటుందని వారు నమ్ముతున్నారు. అందుకే షర్మిల వైపు దూకే అవకాశాలు ఉన్నాయి. ఇక బీజేపీకి కూడా టీఆర్ఎస్ వ్యతిరేకంగా ఉన్న ఓట్లతో కలిసి వస్తుంది అనుకుంటే ఇప్పుడు షర్మిల ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చే అవకాశం ఉంది అంటున్నారు.
వైఎస్ షర్మిల కొత్త పార్టీ విషయం సీఎం కేసీఆర్ కు ముందే తెలుసా అన్నట్లుగా ఆయన ఇటీవల వ్యాఖ్యలు చేశాడు. ప్రాంతీయ పార్టీలు ఎన్నో వస్తున్నాయి పోతున్నాయి. కనుక కొత్తగా వచ్చే పార్టీల గురించి పెద్దగా ఆలోచించాల్సిన అవసరమే లేదు అన్నట్లుగా కేసీఆర్ కామెంట్ లు విసిరాడు. ఇంకా షర్మిల పార్టీ ప్రకటించకుండానే కేసీఆర్ స్పందించడం అంటే ఖచ్చితంగా కాస్త ఆలోచనలో అయితే ఉన్నట్లే అన్నట్లుగా రాజకీయ వర్గాల వారు అంటున్నారు. అంటే షర్మిల పార్టీ విషయంలో కేసీఆర్ కూడా కాస్త కంగారు పడుతున్నాడేమో అనిపిస్తుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మొత్తంగా అధికార టీఆర్ఎస్ నుండి మొదలుకుని కాంగ్రెస్ బీజేపీలను కూడా రాజన్న కాంగ్రెస్ భయపెడుతుంది. షర్మిల పేరుతో పార్టీ వస్తే పెద్దగా భయం లేదు కాని రాష్ట్రంలో ఇంకా రాజశేఖర్ రెడ్డి కి సానుభూతిపరులు ఉన్నారు. కనుక ఆయన పేరుతో వస్తే ఖచ్చితంగా భయపాల్సిందే అనుకుంటున్నారు.
Ram Mohan Naidu : ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తీవ్ర…
High Court : గుజరాత్ హైకోర్టులో తాజాగా చోటుచేసుకున్న ఒక సంఘటన తీవ్ర విమర్శలకు గురవుతోంది. ఈనెల 20న హైకోర్టు…
Turmerick Milk : శా కాలం ప్రారంభమైందంటే ఇక వ్యాధులు కూడా ప్రారంభమైతాయి. కాలంలో వచ్చే వ్యాధులన్నీ కూడా అంటూ…
AP : తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్న వేళ, కేంద్రం తాజాగా జనగణనతో పాటు కులగణనకు గ్రీన్…
YS Jagan : పల్నాడు జిల్లాలో జరిగిన సింగయ్య మృతి కేసు రాజకీయంగా, న్యాయపరంగా పెద్ద చర్చకు దారితీస్తోంది. మాజీ…
Mother : సమాజంలో మానవీయత, తల్లిదండ్రుల పట్ల గౌరవం క్రమంగా తగ్గిపోతున్నాయన్న దానికి ఇదొక ఉదాహరణ. ఎంతో కష్టపడి, కన్న…
Samantha Sreeleela : అల్లు అర్జున్ నటించిన పుష్ప ఫ్రాంచైజీలో ఐటెం సాంగ్స్తో మెప్పించిన అందాల ముద్దుగుమ్మలు ఒకే ఫ్రేములో…
Manchu Manoj : మోహన్ బాబు నిర్మాణంలో మంచు విష్ణు Manchu Vishnu నటించిన సినిమా కన్నప్ప kannappa Movie…
This website uses cookies.