ys sharmila : ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోదరి.. మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూతురు అయిన వైఎస్ షర్మిల పార్టీ పెట్టడం దాదాపుగా కన్ఫర్మ్ అయ్యింది. తెలంగాణ రాష్ట్రంలో ఆమె పార్టీ పెట్టబోతున్నట్లుగా ఇప్పటికే దాదాపుగా క్లారిటీ వచ్చింది. గత ఆరు నెలలుగా ఆమె బ్యాక్ గ్రౌండ్ వర్క్ చేసుకుంటూనే ఉన్నారు. ఆమె ఒక్క రోజు రెండు రోజుల్లో ఈ నిర్ణయం తీసుకోలేదు. ఎన్నో విషయాల గురించి ఆలోచించి, వందల మందితో సంప్రదింపులు జరిపి పలు రాష్ట్రాల్లో పరిస్థితులను పరిశీలించి తెలంగాణలో తన బలం ఏంటీ అనేది సర్వే చేయించుకుని ఇంకా రాజన్న అభిమానులు ఉన్నారా అనేది తెలుసుకున్న తర్వాతే షర్మిల రంగంలోకి దిగాలనే నిర్ణయాన్ని తీసుకున్నారు అనేది ప్రతి ఒక్కరి మాట.
ఇప్పుడు తెలంగాణలో ఎక్కడ చూసినా కూడా షర్మిల పార్టీ పెట్టబోతుంది కదా ఆమె పార్టీ వల్ల ఎవరికి ఎంత నష్టం అన్నట్లుగా చర్చ జరుగుతోంది. ఎక్కువగా కాంగ్రెస్ కు నష్టంగా చెబుతున్నారు. ఎందుకంటే కాంగ్రెస్ లో ఇంకా కూడా రాజన్న అభిమానులు ఉన్నారు. జగన్ పార్టీ పెట్టిన సమయంలో కొందరు ఆయనతో వెళ్లేందుకు ఆసక్తి చూపించలేదు. కాని ఇప్పుడు పరిస్థితులు వేరుగా ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ బలంగా లేదు. టీఆర్ఎస్ ముందు పిల్లిగంతులు వేస్తుంది. ఇలాంటి సమయంలో షర్మిల పెట్టబోతున్న రాజన్న కాంగ్రెస్ పార్టీలో ఖచ్చితంగా మంచి భవిష్యత్తు ఉంటుందని వారు నమ్ముతున్నారు. అందుకే షర్మిల వైపు దూకే అవకాశాలు ఉన్నాయి. ఇక బీజేపీకి కూడా టీఆర్ఎస్ వ్యతిరేకంగా ఉన్న ఓట్లతో కలిసి వస్తుంది అనుకుంటే ఇప్పుడు షర్మిల ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చే అవకాశం ఉంది అంటున్నారు.
వైఎస్ షర్మిల కొత్త పార్టీ విషయం సీఎం కేసీఆర్ కు ముందే తెలుసా అన్నట్లుగా ఆయన ఇటీవల వ్యాఖ్యలు చేశాడు. ప్రాంతీయ పార్టీలు ఎన్నో వస్తున్నాయి పోతున్నాయి. కనుక కొత్తగా వచ్చే పార్టీల గురించి పెద్దగా ఆలోచించాల్సిన అవసరమే లేదు అన్నట్లుగా కేసీఆర్ కామెంట్ లు విసిరాడు. ఇంకా షర్మిల పార్టీ ప్రకటించకుండానే కేసీఆర్ స్పందించడం అంటే ఖచ్చితంగా కాస్త ఆలోచనలో అయితే ఉన్నట్లే అన్నట్లుగా రాజకీయ వర్గాల వారు అంటున్నారు. అంటే షర్మిల పార్టీ విషయంలో కేసీఆర్ కూడా కాస్త కంగారు పడుతున్నాడేమో అనిపిస్తుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మొత్తంగా అధికార టీఆర్ఎస్ నుండి మొదలుకుని కాంగ్రెస్ బీజేపీలను కూడా రాజన్న కాంగ్రెస్ భయపెడుతుంది. షర్మిల పేరుతో పార్టీ వస్తే పెద్దగా భయం లేదు కాని రాష్ట్రంలో ఇంకా రాజశేఖర్ రెడ్డి కి సానుభూతిపరులు ఉన్నారు. కనుక ఆయన పేరుతో వస్తే ఖచ్చితంగా భయపాల్సిందే అనుకుంటున్నారు.
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
CISF Fireman Recruitment : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్మెన్ల నియామక…
Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ…
7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్నెస్ అలవెన్స్ (డీఏ)ని ప్రభుత్వం పెంచబోతోంది. ప్రభుత్వం త్వరలో…
Balineni Srinivas Reddy : గత కొద్ది రోజులుగా బాలినేని వైసీపీని వీడనున్నట్టు అనేక ప్రచారాలు జరిగాయి. ఎట్టకేలకి అది…
Jamili Elections : దేశవ్యాప్తంగా ఒకేసారి పార్లమెంట్ , అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేలా జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్ ఆమోదం…
Naga Manikanta : బుల్లితెర ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తున్న బిగ్ బాస్ ఇప్పుడు తెలుగులో సీజన్ 8 జరుపుకుంటుంది.తాజా సీజన్లోని…
This website uses cookies.