
Ys Jagan : బ్రేకింగ్ హుటాహుటిన అసెంబ్లీకి బయలుదేరిన జగన్..!
Ys Jagan : తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ Andhpra pradesh రాజకీయాల్లో ఒక పెను తుపానును సృష్టించింది. ముఖ్యంగా సిబిఐ సిట్ వేసిన ఛార్జ్ షీట్లో జంతువుల కొవ్వు కలవలేదని తేలడంతో, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఒక్కసారిగా ఉత్సాహం పెరిగింది. ఇప్పటివరకు తమపై వచ్చిన ఆరోపణలన్నీ అబద్ధాలని నిరూపించే అవకాశం దొరికిందని భావించిన జగన్, ఈ విషయాన్ని అసెంబ్లీ వేదికగా గట్టిగా నిలదీయాలని నిర్ణయించుకున్నారు. అందుకే ఆయన తాజా పరిణామాల నేపథ్యంలో హుటాహుటిన అసెంబ్లీకి బయలుదేరారు. ఎప్పుడూ లేని విధంగా ఈసారి లడ్డూ అంశంపై ప్రభుత్వం దగ్గర ఉన్న లూప్ హోల్స్ ని పట్టుకుని, వారిని ఇరుకున పెట్టాలనే పక్కా వ్యూహంతో జగన్ అడుగులు వేస్తున్నారు. కేవలం మీడియా సమావేశాలకే పరిమితం కాకుండా, నేరుగా సభలోనే దీనిపై తేల్చుకోవాలని ఆయన సిద్ధమయ్యారు.
Ys Jagan : బ్రేకింగ్ హుటాహుటిన అసెంబ్లీకి బయలుదేరిన జగన్..!
గత కొన్ని నెలలుగా లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందంటూ కూటమి ప్రభుత్వం చేసిన ప్రచారం భక్తులలో తీవ్ర ఆందోళన కలిగించింది. అయితే సిబిఐ విచారణలో అలాంటిదేమీ లేదని, కేవలం నాణ్యత లోపాలు మాత్రమే ఉన్నాయని తేలడంతో సీన్ మొత్తం రివర్స్ అయింది. ఈ పాయింట్నే జగన్ తన ప్రధాన అస్త్రంగా మార్చుకోబోతున్నారు. అసెంబ్లీలో ఈ విషయంపై చర్చ జరగాలని, ప్రభుత్వం చేసిన తప్పుడు ప్రచారం వల్ల తిరుమల ప్రతిష్ట ఎంత దెబ్బతిన్నదో ప్రజలకు వివరించాలని ఆయన పట్టుబడుతున్నారు. ముఖ్యంగా ఇండపూర్ డెయిరీ మరియు హెరిటేజ్ సంస్థల మధ్య ఉన్న లింకులపై కూడా ఆయన అసెంబ్లీలో ప్రశ్నలు కురిపించే అవకాశం ఉంది. ఈ మలుపుతో కూటమి ప్రభుత్వం డిఫెన్స్లో పడగా, జగన్ మాత్రం తన వాదనను బలంగా వినిపించేందుకు ఏమాత్రం ఆలస్యం చేయకుండా అసెంబ్లీ వైపు అడుగులు వేశారు.
రాజకీయంగా చూస్తే ఈ పరిణామం జగన్ కి ఒక పెద్ద ఊరటనిచ్చింది. లడ్డూ విషయంలో తమకు క్లీన్ చిట్ వచ్చిందని, ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే తమను బద్నాం చేసిందని ఆయన వాదిస్తున్నారు. అసంబ్లీ లోపల జరిగే చర్చ ద్వారా ఈ విషయాన్ని రాష్ట్ర ప్రజలందరికీ అర్థమయ్యేలా చెప్పాలని ఆయన అనుకుంటున్నారు. ప్రభుత్వం వేసిన ఏకసభ్య కమిషన్ కూడా కేవలం కాలయాపన కోసమేనని, సిబిఐ ఇచ్చిన నివేదికను పక్కదారి పట్టించడానికే ఇదంతా చేస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మండిపడుతున్నారు. అందుకే జగన్ స్వయంగా రంగంలోకి దిగి, అసెంబ్లీలో ఈ చర్చకు నేతృత్వం వహించాలని భావించి హుటాహుటిన బయలుదేరడం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ పోరాటంలో గెలిచి తమపై ఉన్న మచ్చను తుడిచేసుకోవాలని జగన్ గట్టి పట్టుదలతో ఉన్నారు.
Good News : ఆంధ్రప్రదేశ్లో సొంతిల్లు లేని పేద కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. త్వరలోనే ప్రధాన్ మంత్రి…
State Bank of India : దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా…
Holi Holidays : వసంతకాల రాగానికి సంకేతం ఇచ్చే రంగుల పండుగ హోలీ 2026లో మరోసారి రమ్యంగా జరగనుంది. విద్యార్థులు,…
ICC T20 World Cup 2026 : ఐసీసీ టీ20 వరల్డ్కప్ 2026 సూపర్ 8 దశలో టీమిండియా ఆశలకు…
Sreshte Organic Farming Success Story ప్రస్తుత రోజుల్లో సాఫ్ట్వేర్ ఉద్యోగం IT Job సాధించడం, కార్పొరేట్ రంగంలో స్థిరపడటం…
Samsung Galaxy S24 FE : ఫ్లిప్కార్ట్లో గెలాక్సీ S26 అల్ట్రా లాంచ్కు ముందు మార్కెట్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది.…
Gold and Silver Rates 24th Feb 2026 బంగారం కొనుగోలు చేయాలని భావిస్తున్న సామాన్యులకు, పసిడి ప్రియులకు మార్కెట్…
Brahmamudi Feb 24th 2026 Episode : స్టార్ మా ఛానెల్లో అత్యధిక టీఆర్పీ రేటింగ్తో దూసుకుపోతున్న 'బ్రహ్మముడి' Brahmamudi…
Karthika Deepam 2 Today Episode Feb 24th 2026 స్టార్ మాలో ప్రసారం అవుతున్న 'కార్తీక దీపం 2'…
Empty stomach : ఉదయం నిద్ర లేవగానే ఏదో ఒకటి నోట్లో వేసుకుని కాలేజీ, ఆఫీసుల చేరుకోవడం యువతలో సాధారణ…
Garlic Tea : మనలో చాలామందికి ఉదయం కప్పు వేడి టీ లేదా పాలు లేకుండా రోజు ప్రారంభం కావడం…
Camel Statue : ఇంటి అలంకరణలో భాగంగా మనం వివిధ రకాల బొమ్మలు, విగ్రహాలు ఏర్పాటు చేస్తుంటాము. అయితే వాస్తు…
This website uses cookies.