Categories: andhra pradeshNews

Good News : సొంతిళ్లు లేని వారికి గుడ్ న్యూస్ .. కొత్త ఇళ్ల పై ప్రభుత్వం సన్నాహాలు.. పూర్తి వివరాలివే ..!

Advertisement
Published by
Advertisement

Good News  : ఆంధ్రప్రదేశ్‌లో సొంతిల్లు లేని పేద కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. త్వరలోనే ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన గ్రామీణ 2.0 పథకం కింద అర్హులైన లబ్ధిదారులకు ఇళ్లను మంజూరు చేయనుంది. ఏప్రిల్ నెలలో ఈ పథకం అమలుకు శ్రీకారం చుట్టనున్నట్లు అధికారులు వెల్లడించారు. గత ఏడాది డిసెంబర్ వరకు దరఖాస్తులు స్వీకరించగా రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది తమ గృహావసరాల కోసం అప్లై చేసుకున్నారు. దాదాపు 10.42 లక్షల మంది ఈ పథకం కింద లబ్ధి పొందేందుకు దరఖాస్తులు సమర్పించగా, ప్రస్తుతం అధికార యంత్రాంగం వాటి పరిశీలనలో నిమగ్నమైంది. క్షేత్రస్థాయిలో సర్వేలు నిర్వహిస్తూ నిజమైన అర్హులను గుర్తించే ప్రక్రియ కొనసాగుతోంది. ఏప్రిల్‌లో తుది లబ్ధిదారుల జాబితాను విడుదల చేసి మంజూరు పత్రాలు అందజేయనున్నారు.

Advertisement

Good News : సొంతిళ్లు లేని వారికి గుడ్ న్యూస్ .. కొత్త ఇళ్ల పై ప్రభుత్వం సన్నాహాలు.. పూర్తి వివరాలివే ..!

Pradhan Mantri Awas Yojana Gramin 2.0 : దరఖాస్తుల పరిశీలన పూర్తి దశలో

పథకం కింద వచ్చిన మొత్తం 10.42 లక్షల దరఖాస్తుల్లో 8.29 లక్షల మంది తమకు స్థలం ఉన్నప్పటికీ ఇల్లు నిర్మించేందుకు ఆర్థిక సాయం కోరారు. మరో 2.13 లక్షల మంది స్థలం మరియు ఇల్లు రెండింటికీ దరఖాస్తు చేసుకున్నారు. వర్గాల వారీగా పరిశీలిస్తే 1.43 లక్షల మంది ఎస్టీలు, 2.16 లక్షల మంది ఎస్సీలు, 4,965 మంది దివ్యాంగులు, 6.92 లక్షల మంది ఇతర వర్గాలకు చెందినవారు ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ దరఖాస్తులను సమగ్రంగా పరిశీలించి ఆమోదం కోసం కేంద్రానికి పంపించింది. మార్చి 3వ తేదీ వరకు కేంద్ర ప్రభుత్వం ఈ అప్లికేషన్లను పరిశీలించనుంది. ఇప్పటికే సుమారు 60 వేల దరఖాస్తులను కేంద్రం తిరస్కరించినట్లు సమాచారం. వీరిని అనర్హులుగా గుర్తించారు. కేంద్ర ఆమోదం వచ్చిన వెంటనే మిగతా అర్హుల జాబితా ఖరారు చేసి మంజూరు పత్రాలు అందజేయనున్నారు.

Advertisement

Pradhan Mantri Awas Yojana Gramin 2.0 : స్థలం లేనివారికి మూడు సెంట్లు.. అత్యంత పేదలకు తొలి ప్రాధాన్యం

ఈ పథకం ప్రత్యేకత ఏమిటంటే, స్థలం లేని నిరుపేదలకు ప్రభుత్వం మూడు సెంట్ల స్థలం కేటాయించనుంది. ఆ స్థలంలో ఇల్లు నిర్మించుకునేందుకు అవసరమైన ఆర్థిక సాయం కూడా అందించబడుతుంది. స్థలం ఉన్నా ఇల్లు లేని వారికి విడతల వారీగా నిధులు జమ చేస్తారు. ఇళ్ల కేటాయింపులో అత్యంత పేదలకు మొదటి ప్రాధాన్యత ఇవ్వనున్నారు. ముఖ్యంగా వితంతువులు, ఎస్టీలు, ఎస్సీలు, బీసీలు మరియు దివ్యాంగులకు ప్రాధాన్యత కల్పిస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది. అనంతరం ఇతర అర్హులైన వారికి అవకాశమిస్తారు. జిల్లాల వారీగా చూస్తే, అల్లూరి సీతారామరాజు జిల్లాలో అత్యధికంగా 77,353 దరఖాస్తులు వచ్చాయి. తరువాత శ్రీకాకుళం జిల్లాలో 75,117, అన్నమయ్య జిల్లాలో 68,508 అప్లికేషన్లు నమోదయ్యాయి. అత్యల్పంగా విశాఖపట్నం జిల్లాలో 7,433 దరఖాస్తులు మాత్రమే వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఈ పథకం అమలు ద్వారా రాష్ట్రంలో లక్షలాది పేద కుటుంబాల గృహ స్వప్నం సాకారం కానుంది. ప్రభుత్వం వేగంగా చర్యలు తీసుకుంటుండటంతో త్వరలోనే లబ్ధిదారులకు సొంతింటి ఆనందం దక్కనుంది.

Advertisement
Suma Ch

Suma is experienced in Digital Media field. Iam worked in various Telugu media houses for about 10 years. lam worked as a Vaartha DailyNewspaper , Hashtagu, Siri Daily News Paper , MeSpandana .com, Telugu24 .in and present TheTelugunews.com As a News Content Writer, I wrote various articles on Breaking News , Local news live reporting, special stories. Iam is also expert in News Analyzing Contact Details: lathasuma895@gmail.com

Recent Posts

Ys Jagan : కూటమి కి షాక్ ఇస్తూ పాదయాత్ర 2.0 పై జగన్ బిగ్ బిగ్ బిగ్ నిర్ణయం..!

Ys Jagan : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఒకటే హాట్ టాపిక్ నడుస్తోంది. అదే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్…

2 hours ago

Tamilnadu Election 2026 : తమిళనాడు లో గెలవబోయేది ఎవరు .. సంచలనం సృష్టిస్తున్న కొత్త సర్వే

Tamilnadu Election 2026 : తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంతో అక్కడ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. రాష్ట్రంలో అధికారాన్ని…

3 hours ago

Kalvakuntla Kavitha : తండ్రిపై కవిత REVENGE PLAN అద్దిరిపోయింది..!

Kalvakuntla Kavitha : తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు ఒకటే చర్చ నడుస్తోంది. అదే మాజీ ఎంపీ కవిత తీసుకోబోతున్న కొత్త…

4 hours ago

Ys Jagan : ఏ క్షణమైనా జగన్ అరస్ట్ ? బిగ్ స్కెచ్ తో సిద్ధమైన మోడీ..?

Ys Jagan : ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఇప్పుడు ఒక రేంజ్‌లో హీటెక్కిపోయాయి. ముఖ్యంగా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి అరెస్ట్…

5 hours ago

India Vs Pakistan : 1000KGs రాకాసి బాం**బు సిద్ధం చేసిన భారత్ .. పాక్ లో ఆ ప్రాంతమే టార్గెట్..!

India Vs Pakistan : ప్రస్తుత ప్రపంచంలో శాంతి మంత్రాల కంటే శక్తియుక్తమైన ఆయుధాలకే విలువ ఎక్కువైపోయింది. అంతర్జాతీయ చట్టాలు…

7 hours ago

India : రెండవ అతిపెద్ద దేశం గా అవతరించిన భారత్.. అమెరికా , జపాన్ షాక్..!

India  : భారతదేశం అణుశక్తి రంగంలో ఒక అద్భుతమైన మైలురాయిని అధిగమించి ప్రపంచ దేశాలను ఆశ్చర్యపరిచింది. తమిళనాడులోని కల్పాకంలో ఉన్న…

8 hours ago

Samantha : నా లైఫ్ కూడా సావిత్రిలా అయిపోయేది .. సమంత షాకింగ్ కామెంట్స్ ..!

Samantha : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత రుత్ ప్రభు ప్రేమ గురించి షాకింగ్‌ కామెంట్‌ చేసింది. లెజెండరీ నటి…

10 hours ago

Monalisa : మహాకుంభమేళ ‘వైరల్ గర్ల్’ .. మోనాలిసా ప్రేమ పెళ్లి పై బిగ్ ట్విస్ట్ .. !

Monalisa : ప్రయాగ్‌రాజ్‌లో జరిగిన మహాకుంభమేళాలో తన తేనె కళ్లతో ఆకట్టుకుని ఒక్క రోజులోనే సోషల్ మీడియాలో స్టార్‌గా మారిన…

11 hours ago

Gold and Silver Rate April 10th 2026 : మార్కెట్‌లో సీన్ రివర్స్.. పసిడి ప్రియులకు శుభవార్త, భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు

Gold and Silver Rate April 10th 2026 : పసిడి ప్రియులకు, ముఖ్యంగా పెళ్లిళ్ల సీజన్‌లో బంగారం కొనుగోలు…

13 hours ago

Viral Video :  విషాదంగా మారిన సెల్ఫీ సరదా .. ముగ్గురు టీనేజ్ బాలికల మృతి ..!

Viral Video :  అల్లూరి సీతారామరాజు జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. సెలవులను సరదాగా గడపాలని వెళ్లిన నాలుగు స్నేహితురాళ్లలో…

13 hours ago

Dacoit Movie Review : అడివి శేష్.. డెకాయిట్ మూవీ రివ్యూ అండ్ రేటింగ్..!

Dacoit Movie Review : టాలీవుడ్‌లో మినిమం గ్యారెంటీ హీరోగా, విభిన్నమైన కాన్సెప్ట్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన నటుడు…

14 hours ago

Karthika Deepam 2 April 10th 2026 Episode : కార్తీక్ చేతిలో తాళి పెట్టిన జ్యోత్స్న.. పెళ్లి రోజు భార్య దీపకు ఊహించని షాక్!

Karthika Deepam 2 April 10th 2026 Episode : స్టార్ మా ఛానెల్‌లో ప్రసారం అవుతున్న 'కార్తీక దీపం…

15 hours ago