YSR Cheyutha Scheme good news for ap womens
YSR Cheyutha Scheme : జగన్ సర్కార్ రాష్ట్రంలోని మహిళలకు శుభవార్త చెప్పింది. వైఎస్సార్ చేయూత పథకం కింద 45 ఏళ్ల వయస్సు నిండిన వారికి ఆర్థిక సాయం అందించేందుకు వైసీపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.2019 ఎన్నికల సమయంలో జగన్ ఇచ్చిన హామీలో భాగంగా మహిళలకు ఆర్థిక సాయం అందించాలని నిర్ణయించారు. అర్హులైన ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళలు 45 ఏళ్లు నిండిన వారు వైఎస్సార్ చేయూత పథకం కింద దరఖాస్తు చేసుకోవచ్చు.
ఏపీలో వైఎస్సార్సీపీ పార్టీ అధికారంలోకి వచ్చాక సంక్షేమ పథకాలను సమయానికి అమలు చేస్తున్నారు. టంచనుగా చెప్పిన టైంకు పడిపోతున్నాయి. సంక్షేమ పథకాలను సక్రమంగా అమలు చేసి రాబోయే ఎన్నికల్లో కూడా తమ పార్టీ అధికారంలోకి రావాలని సీఎం జగన్ భావిస్తున్నారు. ఈ క్రమంలోనే వైఎస్సార్ చేయూత పథకం ప్రారంభానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. 45ఏళ్లు నిండి అర్హులైన మహిళలు గ్రామ,వార్డు సచివాలయాల ద్వారా పేర్లు నమోదు చేసుకోవాలి. అనంతరం వారి నుంచి దరఖాస్తులను స్వీకరిస్తారు.సెప్టెంబర్ 5వ తేదీ వరకూ దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతుండగా..
YSR Cheyutha Scheme good news for ap womens
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సామాజిక వర్గాల్లో 45-60 ఏళ్ల మధ్య వయసు ఉండే అర్హుతలకు రాష్ట్రప్రభుత్వం ఈ పథకం పేరిట ఏడాదికి రూ.18750 చొప్పున 4 విడతల్లో రూ.75 వేలు అందజేయాలని నిర్ణయించింది.సెప్టెంబర్ 5 వరకు ఈ పథకానికి అర్హులు అయ్యేవారు తమ పేర్లు నమోదు చేసుకోవాలని ప్రభుత్వం కోరింది. సెప్టెంబర్ 8వ తేది లోపు సచివాలయ సిబ్బంది, ఎంపీడీవోల ఆధ్వర్యంలో దరఖాస్తుల పరిశీలన పూర్తి చేసి అర్హులను గుర్తిస్తారు.అదేవిధంగా కొత్తగా పేర్ల నమోదుకు కుల ధ్రువీకరణ,ఆదాయ ధ్రువీకరణ,ఆధార్ కార్డు తప్పనిసరిగా జతపరచాలి. ఈ ప్రక్రియ పూర్తయ్యాక 3వ విడతలో సెప్టెంబర్ మాసంలోనే లబ్ధిదారులకు రూ.18,750 చొప్పున ప్రభుత్వం వారి అకౌంట్లలో డబ్బును జమ చేస్తుందని తెలుస్తోంది.
Esha Gupta : బాలీవుడ్ బ్యూటీ ఇషా గుప్తా తాజాగా తన వ్యక్తిగత జీవితంపై ఓపెన్ అయ్యింది. గతంలో టీమిండియా…
Chandrababu : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాజీ సీఎం వైఎస్ జగన్పై తీవ్రంగా మండిపడ్డారు. పాలన ఎలా ఉండకూడదో తెలుసుకోవాలంటే…
Manchu Vishnu : టాలీవుడ్ లో భారీ అంచనాల మధ్య విడుదలకు సిద్ధమవుతున్న మంచు విష్ణు నటించిన పౌరాణిక చిత్రం…
రైలు ప్రయాణికులకు పిడుగులాంటి వార్త. జులై నెల నుంచి రైలు టికెట్ ఛార్జీలు పెరగనున్నాయి. చాలా సంవత్సరాల తర్వాత రైల్వే…
Team India :ఇండియన్ క్రికెట్ జట్టు టెస్ట్ ఫార్మాట్లో ఈ మధ్య నిరాశాజనక ప్రదర్శనతో అభిమానులను నిరాశకు గురి చేస్తుంది.…
RK Roja : ఏపీ రాజకీయ పరిణామాలపై మాజీ మంత్రి ఆర్కే రోజా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కూటమి ప్రభుత్వం…
Wife : ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ప్రయాగ్రాజ్ జిల్లాలో అనూహ్య ఘటన చోటుచేసుకుంది. నిషాద్ అనే వ్యక్తి తాజాగా సితార అనే…
Three Sisters : ముగ్గురు అక్కాచెల్లెళ్ళతో రొమాన్స్ చేసిన ఏకైక హీరో చిరంజీవి అని చెప్పొచ్చు. ఆ ముగ్గురితో కలిసి…
This website uses cookies.