
ysrcp mla became popular than ys jagan in andhra pradesh
YS Jagan : వైఎస్ జగన్ ఏపీ ముఖ్యమంత్రిగా ఉన్నందుకు కొన్ని విషయాల్లో సీరియస్ గా ఉండాలి. చూసీ చూడనట్టు వ్యవహరిస్తే కష్టం. ఎందుకంటే.. ఆయన కొన్ని అంశాల్లో చూసీచూడనట్టు వదిలేస్తున్నారట. దాని వల్ల ముఖ్యమంత్రి పీఠానికే కలంకం వచ్చే అవకాశం ఉంది. నిజానికి.. ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ సూపర్బ్. ఆయన తీసుకొచ్చిన పథకాలు కూడా అద్భుతం. సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయి. అయితే.. కొన్ని చిన్న చిన్న విషయాల్లో మాత్రం వైఎస్ జగన్ ఎందుకో వెనుకబడిపోతున్నారు.. అనే వార్తలు ప్రస్తుతం జోరుగా వినిపిస్తున్నాయి.
ysrcp mla became popular than ys jagan in andhra pradesh
ముఖ్యంగా కరోనా విషయంలో ప్రస్తుతం ఏపీ చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. రోజుకు వేల సంఖ్యలో కరోనా కేసులు నమోదు అవుతున్నాయి. వందల సంఖ్యలో కరోనా మరణాలు సంభవిస్తున్నాయి. ఏపీలో సరైన వైద్య సౌకర్యాలు లేక చాలామంది కరోనా ట్రీట్ మెంట్ కోసం ఏపీ నుంచి హైదరాబాద్ కు తరలి వస్తున్నారు. హైదరాబాద్ లో మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రులు ఉండటంతో చాలామంది కరోనా ట్రీట్ మెంట్ కోసం అంతదూరం నుంచి హైదరాబాద్ కు వచ్చి ట్రీట్ మెంట్ తీసుకుంటున్నారు.
అయితే.. మొన్నటి వరకు పెద్దగా సమస్య లేదు కానీ.. తాజాగా సరిహద్దు వద్ద తెలంగాణ పోలీసులు చేస్తున్న అత్యుత్సాహంతో ఏపీ ప్రజలు తీవ్రంగా ఇబ్బందులకు గురవుతున్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకు వస్తున్న అంబులెన్స్ లను తెలంగాణ పోలీసులు ఆపేస్తున్నారు. హైదరాబాద్ లో చికిత్స కోసం వెళ్లే ఏపీ కరోనా రోగులను సరిహద్దు వద్దే తెలంగాణ పోలీసులు ఆపేస్తుండటంతో ప్రస్తుతం ఏపీ మొత్తం తెలంగాణ మీద కోపంతో రగులుతోంది.
ఇంకో మూడేళ్ల వరకు ఏపీకి కూడా హైదరాబాద్ రాజధానిగా ఉన్న విషయం తెలిసి కూడా ఏపీ ప్రజలపై తెలంగాణ పోలీసులు ఇలా ప్రవర్తించడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతోంది. అయితే.. తెలంగాణలో ఉన్న అన్ని ఆసుపత్రులు కరోనా రోగులతో నిండిపోవడం, ఆక్సిజన్ల కొరత, బెడ్స్ కొరత, వెంటిలేటర్ల కొరత కూడా తెలంగాణలో తీవ్రంగా ఉండటంతో వేరే రాష్ట్రాల నుంచి తెలంగాణకు వచ్చే కరోనా రోగులను ప్రభుత్వం సరిహద్దు వద్దే ఆపేస్తోంది.. అని కొందరు వాదిస్తున్నారు.
ysrcp mla became popular than ys jagan in andhra pradesh
ఏది ఏమైనా తెలంగాణ పోలీసుల విషయంలో ఏపీ ప్రభుత్వం సీరియస్ గా ఉందని తెలుస్తున్నా.. సీఎం జగన్ మాత్రం ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వంతో అస్సలు మాట్లాడటం లేదు. ఇప్పటి వరకు అటువంటి ప్రయత్నాలనే సీఎం జగన్ చేయకపోవడంతో… ఏపీ ప్రజలు వైఎస్ జగన్ పై కోపంతో ఉన్నారట. అయితే.. జగ్గయ్యపేట ఎమ్మెల్యే సామినేని ఉదయభాను మాత్రం.. తెలంగాణ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. కరోనా రోగులపై ఇంత కక్ష కడుతారా? వాళ్లను తెలంగాణలోకి రానీయకుండా.. ఎలా అడ్డుకుంటారంటూ ప్రశ్నించారు. కేవలం జగ్గయ్యపేట ఎమ్మెల్యే తప్పితే.. మరే నాయకుడు కానీ.. మరే ఇతర వైసీపీ ఎమ్మెల్యే కానీ.. మంత్రి కానీ.. ముఖ్యమంత్రి కానీ.. ఈ విషయంపై స్పందించకపోవడం సర్వత్రా ఆందోళన కలిగిస్తోంది.
Blue Berries | ఆకర్షణీయమైన నీలిరంగు, చక్కని రుచితో మనసును దోచుకునే బ్లూబెర్రీస్ కేవలం రుచికరమైనవి మాత్రమే కాదు, ఆరోగ్యానికి…
Remedies | శని గ్రహం జ్యోతిష్యశాస్త్రంలో అత్యంత శక్తివంతమైన గ్రహాల్లో ఒకటి. ప్రతి రెండున్నర సంవత్సరాలకు ఒకసారి శని గ్రహం…
Rukmini Vasanth | కన్నడ, తెలుగు, తమిళ భాషల్లో క్రేజ్ పెంచుకుంటున్న నటి రుక్మిణి వసంత్ తన పేరుతో జరుగుతున్న మోసాలపై…
Moringa Powder | తెలుగు వారి వంటింట్లో మునగ పేరు తెలియనివారు ఉండరంటే అతిశయోక్తి కాదు. మునగకాయలతో పులుసులు, కూరలు,…
Sesame Seeds | స్త్రీల ఆరోగ్యం పురుషులతో పోలిస్తే ఎక్కువ సవాళ్లను ఎదుర్కొంటుంది. హార్మోన్ల అసమతుల్యత, రక్తహీనత, ఎముకల బలహీనత,…
Heart Attacks | భారతదేశంలో గుండె సంబంధిత వ్యాధులు వేగంగా పెరుగుతున్నాయి. అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్, ఒత్తిడి, అసమతుల్య ఆహారం, వ్యాయామం…
Triphala Powder | ఆయుర్వేదం ప్రకారం ప్రతి ఋతువుకి అనుకూలంగా ఆహార నియమాలు, మూలికా చిట్కాలు ఉంటాయి. అందులో త్రిఫల చూర్ణం…
Mole | జ్యోతిషశాస్త్రం మన శరీరంలోని చిన్నచిన్న లక్షణాలకూ ప్రత్యేక అర్థం ఇస్తుంది. అందులో ఒకటి పుట్టుమచ్చలు (Moles). పుట్టుమచ్చ…
This website uses cookies.