ఏపీలో ప్రస్తుతం కర్ఫ్యూ కొనసాగుతోంది. ఏపీలో కరోనా కేసులు విపరీతంగా నమోదు అవుతున్నాయి. నిజానికి రాత్రి పూట కర్ఫ్యూను ఏపీ ప్రభుత్వం విధించినా.. కరోనా కేసులు తగ్గుముఖం పట్టకపోగా… రోజుకు వేల సంఖ్యలో కరోనా కేసులు నమోదు అవుతున్నాయి. అలాగే.. వందల సంఖ్యలో మరణాలు చోటు చేసుకుంటున్నాయి. దీంతో కరోనా నియంత్రణ కోసం మధ్యాహ్నం 12 నుంచి ఉదయం 6 వరకు కర్ఫ్యూను విధించింది ఏపీ ప్రభుత్వం. అంటే ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12 వరకు మాత్రమే షాపులను తెరుచుకోవాలి. నిత్యావసర సరుకుల కోసం బయటికి వెళ్లాలి. మధ్యాహ్నం 12 నుంచి తెల్లారి ఉదయం 6 వరకు ఏపీ వ్యాప్తంగా కర్ఫ్యూ ఉంటుంది. దీంతో పోలీసులు కూడా కట్టుదిట్టమైన చర్యలను తీసుకుంటున్నారు. మధ్యాహ్నం 12 దాటితే ఎవరైనా బయట కనిపిస్తే వెంటనే వారికి ఫైన్ వేయడమో.. లేక బడితె పూజ చేయడమో చేస్తున్నారు.
ఏది ఏమైనా ఎవరో ఒకరు చిన్న చిన్న కారణాలతో బయట తిరుగుతూనే ఉన్నారు. ఏదో ఒక కారణం చెప్పి తప్పించుకొని బయట రోడ్ల మీద తిరుగుతున్నారు జనాలు. దీంతో పోలీసులు తమ లాఠీలకు పని చెప్పాల్సి వస్తోంది. కేవలం ఎమర్జెన్సీ వాహనాలకు, ఇతర వైద్య సేవలకు వెళ్లే వాళ్లు, మీడియాకు, కూరగాయలు, ఇతర ట్రాన్స్ పోర్ట్ వాహనాలకు మాత్రమే పర్మిషన్ ఉంది. అయినప్పటికీ.. కొందరు కావాలని బయటికి వస్తున్నారు. పోలీసుల చేతుల్లో తన్నులు తింటున్నారు.
తాజాగా.. చిత్తూరు జిల్లాలో ఓ విచిత్ర ఘటన చోటు చేసుకున్నది. చిత్తూరు జిల్లా పలమనేరులో సీఐ జయరామయ్య నేతృత్వంలో పోలీసులు కర్ఫ్యూను అమలు చేస్తున్నారు. కర్ఫ్యూ సమయంలో ఎవరు బయట కనిపించినా.. ఫైన్ వేస్తున్నారు. అయితే.. ఓ యువకుడు కూడా బయట కనిపించడంతో.. ఓ కానిస్టేబుల్ ఆ యువకుడిని తీసుకొని.. సీఐ జయరామయ్య దగ్గరికి తీసుకొచ్చాడు.
తీరా చూస్తే.. ఆయువకుడు ఎవరో కాదు.. సీఐ జయరామయ్య కొడుకు. సారీ సార్.. మీ కొడుకు అని తెలియక తీసుకొచ్చా.. అని కానిస్టేబుల్ ఏదో చెప్పబోగా… చట్టం ముందు అందరూ సమానులే. కర్ఫ్యూ సమయంలో ఎవ్వరూ బయటికి రాకూడదు. ఫైన్ కట్టు అంటూ 125 రూపాయల ఫైన్ కట్టించుకున్నాడు ఆ సీఐ. ఇంకోసారి బయట తిరిగినే కఠిన చర్యలు తీసుకుంటాం.. అంటూ సొంత కొడుకునే హెచ్చరించి మరీ పంపించాడు ఆ సీఐ. సీఐ చేసిన పనికి అక్కడి స్థానికులు తెగ మెచ్చుకుంటున్నారు. పోలీస్ అంటే ఇలా ఉండాలి అంటూ ఆయన్ను పొగడ్తల్లో ముంచెత్తుతున్నారు.
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
CISF Fireman Recruitment : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్మెన్ల నియామక…
Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ…
7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్నెస్ అలవెన్స్ (డీఏ)ని ప్రభుత్వం పెంచబోతోంది. ప్రభుత్వం త్వరలో…
Balineni Srinivas Reddy : గత కొద్ది రోజులుగా బాలినేని వైసీపీని వీడనున్నట్టు అనేక ప్రచారాలు జరిగాయి. ఎట్టకేలకి అది…
Jamili Elections : దేశవ్యాప్తంగా ఒకేసారి పార్లమెంట్ , అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేలా జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్ ఆమోదం…
Naga Manikanta : బుల్లితెర ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తున్న బిగ్ బాస్ ఇప్పుడు తెలుగులో సీజన్ 8 జరుపుకుంటుంది.తాజా సీజన్లోని…
This website uses cookies.