YSRCP MLAs ex mps : ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఆయన సొంత పార్టీ ఎమ్మెల్యేలు షాక్ ఇచ్చేందుకు సిద్దం అవుతున్నారా అంటే అవును అని కొందరు రాజకీయ వర్గాల వారు మరియు మీడియా వర్గాల వారు అంటున్నారు. వైకాపా కు చెందిన రెడ్డి వర్గం ఎమ్మెల్యేలు కొందరు బీజేపీ నాయకులతో టచ్ లో ఉన్నారని వచ్చే ఎన్నికల్లో జనసేన మరియు బీజేపీలు ఆదిపత్యం కనబర్చే అవకాశం ఉందని కొందరు బలంగా నమ్ముతున్నారు. ఆ కారణంగానే బీజేపీలో జాయిన్ అవ్వాలని వైకాపా ఎమ్మెల్యేలు కొందరు భావిస్తున్నారట. అందుకే ఇప్పటి నుండి సన్నిహితుల ద్వారా బీజేపీ నాయకులతో చర్చలు జరిపిస్తున్నట్లుగా తెలుస్తోంది. సిట్టింగ్ స్థానం ఇవ్వడంతో పాటు అధికారంలోకి వస్తే ప్రాధాన్యత ఇచ్చేలా ఒప్పందాలు కుదుర్చుకుంటున్నారట.
వైకాపాలో వర్గ పోరు కనిపిస్తుంది. జిల్లాల్లో రెండు మూడు వర్గాలు ఉన్న కారణంగా పెద్ద ఎత్తున నాయకులు అధినాయకత్వంపై అసంతృప్తితో ఉన్నారు. వర్గ పోరు విషయంలో చూసి చూడనట్లుగా ఉంటున్న కారణంగా పార్టీకి నష్టం జరుగుతుందని ఈ సందర్బంగా నాయకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఆ వర్గ పోరు కారణంగానే ఒక మాజీ ఎంపీ త్వరలోనే బీజేపీలో జాయిన్ అయ్యి వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీ నుండి పోటీ చేస్తానంటూ సన్నిహితులతో అంటున్నాడట. గత కొన్నాళ్లుగా ఆయన పార్టీకి కాస్త దూరం ఉంటూ వస్తున్నాడు. దాంతో ఆయన బీజేపీ కి దగ్గర అవుతున్నాడనే వార్తలు వస్తున్నాయి.
రెడ్డి వర్గంకు చెందిన కొందరు వైకాపా ఎమ్మెల్యేలు బీజేపీకి టచ్ లోకి వెళ్లారు అంటూ వస్తున్న వార్తలు ఆ పార్టీ నాయకులను కలవర పెడుతోంది. ప్రభుత్వం పరంగా వైఎస్ జగన్కు వచ్చే నష్టం ఏమీ లేదు. కాని అధికార పార్టీ నుండి ఎమ్మెల్యేలు వెళ్లారు అంటే ఖచ్చితంగా పరువు తక్కువ విషయం. అందుకే ఈ విషయమై కాస్త సీరియస్ గానే ఆలోచన చేయాలని ఈ సందర్బంగా పార్టీ నాయకులు సీఎం జగన్ దృష్టికి తీసుకు వెళ్లాలని భావిస్తున్నారట. అయినా ఇంటిలిజెన్స్ ను ఎక్కువగా ఉపయోగించుకునే వైఎస్ జగన్ కు ఆ ఎమ్మెల్యేల గురించి తెలియకుండా ఉంటుందా చెప్పండి.
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
CISF Fireman Recruitment : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్మెన్ల నియామక…
Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ…
7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్నెస్ అలవెన్స్ (డీఏ)ని ప్రభుత్వం పెంచబోతోంది. ప్రభుత్వం త్వరలో…
Balineni Srinivas Reddy : గత కొద్ది రోజులుగా బాలినేని వైసీపీని వీడనున్నట్టు అనేక ప్రచారాలు జరిగాయి. ఎట్టకేలకి అది…
Jamili Elections : దేశవ్యాప్తంగా ఒకేసారి పార్లమెంట్ , అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేలా జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్ ఆమోదం…
Naga Manikanta : బుల్లితెర ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తున్న బిగ్ బాస్ ఇప్పుడు తెలుగులో సీజన్ 8 జరుపుకుంటుంది.తాజా సీజన్లోని…
This website uses cookies.