YSRCP : ఈ విషయం జగన్ కి తెలిస్తే తట్టుకోగలడా ? వైసీపీ ఎమ్మెల్యే లు ఇలా చేస్తున్నారా ? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

YSRCP : ఈ విషయం జగన్ కి తెలిస్తే తట్టుకోగలడా ? వైసీపీ ఎమ్మెల్యే లు ఇలా చేస్తున్నారా ?

YSRCP MLAs ex mps : ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్ రెడ్డికి ఆయన సొంత పార్టీ ఎమ్మెల్యేలు షాక్ ఇచ్చేందుకు సిద్దం అవుతున్నారా అంటే అవును అని కొందరు రాజకీయ వర్గాల వారు మరియు మీడియా వర్గాల వారు అంటున్నారు. వైకాపా కు చెందిన రెడ్డి వర్గం ఎమ్మెల్యేలు కొందరు బీజేపీ నాయకులతో టచ్ లో ఉన్నారని వచ్చే ఎన్నికల్లో జనసేన మరియు బీజేపీలు ఆదిపత్యం కనబర్చే అవకాశం ఉందని కొందరు బలంగా నమ్ముతున్నారు. […]

 Authored By himanshi | The Telugu News | Updated on :3 February 2021,1:13 pm

YSRCP MLAs ex mps : ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్ రెడ్డికి ఆయన సొంత పార్టీ ఎమ్మెల్యేలు షాక్ ఇచ్చేందుకు సిద్దం అవుతున్నారా అంటే అవును అని కొందరు రాజకీయ వర్గాల వారు మరియు మీడియా వర్గాల వారు అంటున్నారు. వైకాపా కు చెందిన రెడ్డి వర్గం ఎమ్మెల్యేలు కొందరు బీజేపీ నాయకులతో టచ్ లో ఉన్నారని వచ్చే ఎన్నికల్లో జనసేన మరియు బీజేపీలు ఆదిపత్యం కనబర్చే అవకాశం ఉందని కొందరు బలంగా నమ్ముతున్నారు. ఆ కారణంగానే బీజేపీలో జాయిన్‌ అవ్వాలని వైకాపా ఎమ్మెల్యేలు కొందరు భావిస్తున్నారట. అందుకే ఇప్పటి నుండి సన్నిహితుల ద్వారా బీజేపీ నాయకులతో చర్చలు జరిపిస్తున్నట్లుగా తెలుస్తోంది. సిట్టింగ్‌ స్థానం ఇవ్వడంతో పాటు అధికారంలోకి వస్తే ప్రాధాన్యత ఇచ్చేలా ఒప్పందాలు కుదుర్చుకుంటున్నారట.

ఆ వైకాపా మాజీ ఎంపీ కూడా… : YSRCP

వైకాపాలో వర్గ పోరు కనిపిస్తుంది. జిల్లాల్లో రెండు మూడు వర్గాలు ఉన్న కారణంగా పెద్ద ఎత్తున నాయకులు అధినాయకత్వంపై అసంతృప్తితో ఉన్నారు. వర్గ పోరు విషయంలో చూసి చూడనట్లుగా ఉంటున్న కారణంగా పార్టీకి నష్టం జరుగుతుందని ఈ సందర్బంగా నాయకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఆ వర్గ పోరు కారణంగానే ఒక మాజీ ఎంపీ త్వరలోనే బీజేపీలో జాయిన్‌ అయ్యి వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీ నుండి పోటీ చేస్తానంటూ సన్నిహితులతో అంటున్నాడట. గత కొన్నాళ్లుగా ఆయన పార్టీకి కాస్త దూరం ఉంటూ వస్తున్నాడు. దాంతో ఆయన బీజేపీ కి దగ్గర అవుతున్నాడనే వార్తలు వస్తున్నాయి.

YSRCP MLAs ex mp and leaders are going to join in BJP

YSRCP MLAs ex mp and leaders are going to join in BJP

ఎమ్మెల్యేల విషయం వైఎస్‌ జగన్‌ కు తెలుసా..

రెడ్డి వర్గంకు చెందిన కొందరు వైకాపా ఎమ్మెల్యేలు బీజేపీకి టచ్‌ లోకి వెళ్లారు అంటూ వస్తున్న వార్తలు ఆ పార్టీ నాయకులను కలవర పెడుతోంది. ప్రభుత్వం పరంగా వైఎస్‌ జగన్‌కు వచ్చే నష్టం ఏమీ లేదు. కాని అధికార పార్టీ నుండి ఎమ్మెల్యేలు వెళ్లారు అంటే ఖచ్చితంగా పరువు తక్కువ విషయం. అందుకే ఈ విషయమై కాస్త సీరియస్ గానే ఆలోచన చేయాలని ఈ సందర్బంగా పార్టీ నాయకులు సీఎం జగన్‌ దృష్టికి తీసుకు వెళ్లాలని భావిస్తున్నారట. అయినా ఇంటిలిజెన్స్ ను ఎక్కువగా ఉపయోగించుకునే వైఎస్‌ జగన్‌ కు ఆ ఎమ్మెల్యేల గురించి తెలియకుండా ఉంటుందా చెప్పండి.

himanshi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది