
The Actual Number Of Seats To Be Won By YSRCP Is.!
ఏపీలో అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తి చేసుకున్న వైసీపీకి ఇప్పుడు ప్రత్యర్ధులు, విపక్షాల నుంచి కాక సొంత పార్టీ ఎమ్మెల్యేల నుంచే ముప్పు ఎదురవుతోంది. ముఖ్యంగా ఏపీలో బలపడేందుకు విపక్షాలు చేస్తున్న ప్రయత్నాలకు సొంత పార్టీ ఎమ్మెల్యేలే ఊతమిస్తున్నారు. కొందరు తమ చర్యలతో, మరికొందరు తమ వ్యాఖ్యలతో సొంత పార్టీని ఇరుకునపెడుతున్నారు. దీంతో వీరిని నియంత్రించలేక అధినేత వైఎస్ జగన్ తలపట్టుకుంటున్నారు. రెండేళ్ల క్రితం భారీ విజయంతో అధికారం చేపట్టిన వైసీపీని ఇరుకున పెట్టేందుకు విపక్షాలకు పెద్దగా అవకాశాలు దొరకలేదు. దీంతో అంది వచ్చిన ఒకటీ అరా సమస్యలతో ప్రభుత్వాన్ని ఇబ్బందిపెట్టాయి. తాజాగా ఆ అవసరం లేకుండా వైసీపీ ఎమ్మెల్యేలే విపక్షాలకు అస్త్రాలు ఇస్తున్నారు. సొంత పార్టీ బలహీనతలు తెలిసి కూడా విపక్షాలకు అవకాశమిచ్చేలా వైసీపీ ఎమ్మెల్యేలు ప్రవర్తిస్తున్నారు. దీంతో వీరిని నియంత్రించడం సీఎం జగన్ కు, పార్టీ అధిష్టాన పెద్దలకు కష్టంగా మారుతోంది. ఏపీలో బలపడేందుకు విపక్ష బీజేపీ రెండేళ్లుగా చేయని ప్రయత్నం లేదు. పార్టీ అధ్యక్షుడి మార్పు దగ్గరి నుంచి, ఆలయాల్లో విగ్రహాల ధ్వంసాన్ని రాజకీయం చేయడం వరకూ బీజేపీ ఏదో ఒక ప్రయత్నం చేస్తూనే ఉంది. తాజాగా బీజేపీకి మరో రెండు అంశాలు కలిసివచ్చాయి. దీంతో బీజేపీ నేతలు వాటిని అందిపుచ్చుకోవడమే కాకుండా ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు ఓ రేంజ్ లో పావులు కదుపుతున్నారు.
ysrcp mlas versus cm ys jagan
బీజేపీ రాష్ట్రంలో బలపడేందుకు ఏం కోరుకుంటుందో అదే జరుగుతోంది. కడప జిల్లా ప్రొద్దుటూరులో వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి స్ధానికుల కోరికపై టిప్పుసుల్తాన్ విగ్రహ ఏర్పాటుకు శంఖుస్దాపన చేశారు. అంతటితో ఆగకుండా టిప్పుసుల్తాన్ స్వాతంత్ర సమరయోధుడని కీర్తించారు. దీంతో బీజేపీ భగ్గుమంది. ఇప్పటికీ ఛలో ప్రొద్దుటూరు పేరిట బీజేపీ ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. మరోవైపు గోవధపై తాజాగా కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి చేసిన వ్యాఖ్యలు కూడా చిచ్చురేపాయి. కాలం చెల్లిన గోవధ చట్టాన్ని రద్దు చేయాలని చెన్నకేశవరెడ్డి కోరడంపై బీజేపీ నేతలు మండిపడుతున్నారు. చెన్నకేశవరెడ్డికి వ్యతిరేకంగా రోజూ ఆందోళనలు చేపడుతున్నారు. వైసీపీ ఎమ్మెల్యేలు బీజేపీ అజెండాకు కలిసొచ్చేలా టిప్పు సుల్తాన్ విగ్రహం, గోవధ చట్టాలపై ఇలా వ్యాఖ్యలు చేస్తుండటంతో అధినేత వైఎస్ జగన్ ఇరుకునపడుతున్నారు. గతేడాది ఆలయాల్లో విధ్వంసాలపై వైసీపీ సర్కార్ ను టార్గెట్ చేసిన బీజేపీ నేతలు ఈసారి టిప్పుసుల్తాన్, గోవధ అంశాల్ని వాడుకుంటూ ప్రభుత్వాన్ని నిత్యం టార్గెట్ చేస్తున్నారు. దీంతో ఇటు సొంత పార్టీ ఎమ్మెల్యేల్ని నియంత్రించలేక, అటు బీజేపీ నేతలపై ఎదురుదాడి చేయలేక వైఎస్ జగన్ ఇబ్బంది పడుతున్నారు. భవిష్యత్తులో వీరిని నియంత్రించకపోతే బీజేపీయే ప్రధాన ప్రత్యర్ధిగా మారడానికి చేజేతులా అవకాశం ఇచ్చినట్లవుతుందని విశ్లేషకులు సైతం చెబుతున్నారు.
Indian Rupee : భారత రూపాయి విలువ డాలర్తో పోలిస్తే చరిత్రలోనే కనిష్ట స్థాయికి చేరుకోవడం దేశ ఆర్థిక రంగంలో…
Ration Card : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజా పంపిణీ వ్యవస్థలో (PDS) కీలక మార్పులకు శ్రీకారం చుడుతోంది. రేషన్ సరుకుల…
SRH vs RCB : ఐపీఎల్ 2026 సీజన్లో అత్యంత ఆసక్తికర మ్యాచ్లలో ఒకటైన Sunrisers Hyderabad (SRH) vs…
Tilak : భారతీయ సంస్కృతిలో నుదిటిపై బొట్టు లేదా తిలకం పెట్టుకోవడం అనేది వేల ఏళ్లుగా కొనసాగుతున్న సంప్రదాయం. ముఖ్యంగా…
Gods : హిందూ సంప్రదాయాల్లో దేవతల ఆరాధనకు ప్రత్యేకమైన నియమాలు, ఆచారాలు ఉన్నాయని పురాణాలు మరియు శాస్త్రాలు చెబుతున్నాయి. ఉదయం…
Lemon Ginger Tea : ప్రస్తుతం ఆరోగ్యంపై శ్రద్ధ పెరుగుతున్న నేపథ్యంలో చాలామంది సహజ పానీయాలవైపు మొగ్గు చూపుతున్నారు. అలాంటి…
EMI : దేశంలో ఈఎంఐలపై స్మార్ట్ఫోన్లు కొనుగోలు చేసే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ముఖ్యంగా ఖరీదైన మొబైల్ ఫోన్లను…
Peddi Movie : మెగా పవర్ స్టార్ Ram Charan నటిస్తున్న భారీ చిత్రం Peddi పై రోజురోజుకూ అంచనాలు…
TDP NDA : దేశ రాజకీయాల్లో ఎన్డీఏ కూటమి సమీకరణాలు వేగంగా మారుతున్న వేళ తెలుగు దేశం పార్టీకి మరో…
Bhuma Mounika : టాలీవుడ్ నటుడు Manchu Manoj తాజాగా చేసిన వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీశాయి.…
తెలంగాణ ప్రభుత్వం కొత్త పెన్షన్ల మంజూరుపై కీలక అడుగులు వేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది ఎదురుచూస్తున్న కొత్త పెన్షన్ పథకాల…
Heatwave : దేశవ్యాప్తంగా ఎండల తీవ్రత రోజు రోజుకు పెరుగుతోంది. ముఖ్యంగా ఉత్తర భారతదేశంతో పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో…
This website uses cookies.