YSRCP : ప్రతిపక్షాలు బలపడేలా ఊతమిస్తున్న ఆ వైసీపీ ఎమ్మెల్యేలు? తల పట్టుకున్న వైఎస్ జగన్?

Advertisement
Advertisement

ఏపీలో అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తి చేసుకున్న వైసీపీకి ఇప్పుడు ప్రత్యర్ధులు, విపక్షాల నుంచి కాక సొంత పార్టీ ఎమ్మెల్యేల నుంచే ముప్పు ఎదురవుతోంది. ముఖ్యంగా ఏపీలో బలపడేందుకు విపక్షాలు చేస్తున్న ప్రయత్నాలకు సొంత పార్టీ ఎమ్మెల్యేలే ఊతమిస్తున్నారు. కొందరు తమ చర్యలతో, మరికొందరు తమ వ్యాఖ్యలతో సొంత పార్టీని ఇరుకునపెడుతున్నారు. దీంతో వీరిని నియంత్రించలేక అధినేత వైఎస్ జగన్ తలపట్టుకుంటున్నారు. రెండేళ్ల క్రితం భారీ విజయంతో అధికారం చేపట్టిన వైసీపీని ఇరుకున పెట్టేందుకు విపక్షాలకు పెద్దగా అవకాశాలు దొరకలేదు. దీంతో అంది వచ్చిన ఒకటీ అరా సమస్యలతో ప్రభుత్వాన్ని ఇబ్బందిపెట్టాయి. తాజాగా ఆ అవసరం లేకుండా వైసీపీ ఎమ్మెల్యేలే విపక్షాలకు అస్త్రాలు ఇస్తున్నారు. సొంత పార్టీ బలహీనతలు తెలిసి కూడా విపక్షాలకు అవకాశమిచ్చేలా వైసీపీ ఎమ్మెల్యేలు ప్రవర్తిస్తున్నారు. దీంతో వీరిని నియంత్రించడం సీఎం జగన్ కు, పార్టీ అధిష్టాన పెద్దలకు కష్టంగా మారుతోంది. ఏపీలో బలపడేందుకు విపక్ష బీజేపీ రెండేళ్లుగా చేయని ప్రయత్నం లేదు. పార్టీ అధ్యక్షుడి మార్పు దగ్గరి నుంచి, ఆలయాల్లో విగ్రహాల ధ్వంసాన్ని రాజకీయం చేయడం వరకూ బీజేపీ ఏదో ఒక ప్రయత్నం చేస్తూనే ఉంది. తాజాగా బీజేపీకి మరో రెండు అంశాలు కలిసివచ్చాయి. దీంతో బీజేపీ నేతలు వాటిని అందిపుచ్చుకోవడమే కాకుండా ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు ఓ రేంజ్ లో పావులు కదుపుతున్నారు.

Advertisement

ysrcp mlas versus cm ys jagan

భలే ఛాన్సులే..

బీజేపీ రాష్ట్రంలో బలపడేందుకు ఏం కోరుకుంటుందో అదే జరుగుతోంది. కడప జిల్లా ప్రొద్దుటూరులో వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి స్ధానికుల కోరికపై టిప్పుసుల్తాన్ విగ్రహ ఏర్పాటుకు శంఖుస్దాపన చేశారు. అంతటితో ఆగకుండా టిప్పుసుల్తాన్ స్వాతంత్ర సమరయోధుడని కీర్తించారు. దీంతో బీజేపీ భగ్గుమంది. ఇప్పటికీ ఛలో ప్రొద్దుటూరు పేరిట బీజేపీ ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. మరోవైపు గోవధపై తాజాగా కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి చేసిన వ్యాఖ్యలు కూడా చిచ్చురేపాయి. కాలం చెల్లిన గోవధ చట్టాన్ని రద్దు చేయాలని చెన్నకేశవరెడ్డి కోరడంపై బీజేపీ నేతలు మండిపడుతున్నారు. చెన్నకేశవరెడ్డికి వ్యతిరేకంగా రోజూ ఆందోళనలు చేపడుతున్నారు. వైసీపీ ఎమ్మెల్యేలు బీజేపీ అజెండాకు కలిసొచ్చేలా టిప్పు సుల్తాన్ విగ్రహం, గోవధ చట్టాలపై ఇలా వ్యాఖ్యలు చేస్తుండటంతో అధినేత వైఎస్ జగన్ ఇరుకునపడుతున్నారు. గతేడాది ఆలయాల్లో విధ్వంసాలపై వైసీపీ సర్కార్ ను టార్గెట్ చేసిన బీజేపీ నేతలు ఈసారి టిప్పుసుల్తాన్, గోవధ అంశాల్ని వాడుకుంటూ ప్రభుత్వాన్ని నిత్యం టార్గెట్ చేస్తున్నారు. దీంతో ఇటు సొంత పార్టీ ఎమ్మెల్యేల్ని నియంత్రించలేక, అటు బీజేపీ నేతలపై ఎదురుదాడి చేయలేక వైఎస్ జగన్ ఇబ్బంది పడుతున్నారు. భవిష్యత్తులో వీరిని నియంత్రించకపోతే బీజేపీయే ప్రధాన ప్రత్యర్ధిగా మారడానికి చేజేతులా అవకాశం ఇచ్చినట్లవుతుందని విశ్లేషకులు సైతం చెబుతున్నారు.

Advertisement
Advertisement

Recent Posts

Ys Jagan : వైఎస్‌ జగన్ ఎఫెక్ట్ గట్టిగా కొట్టింది , టీడీపీ రాజ్యసభ సభ్యుడి అనూహ్య మార్పు..?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు రాజ్యసభ సీట్ల చుట్టూ ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత…

27 minutes ago

Anchor Ravi : నా భార్య కాళ్ళు పట్టుకుంటా.. దారుణ నిజం బయటపెట్టిన యాంకర్ రవి

Anchor Ravi : బుల్లితెరపై తనదైన మాటకారి తనంతో ప్రేక్షకులను అలరించే యాంకర్ రవి తాజాగా తన వ్యక్తిగత విషయాల…

1 hour ago

Ambati Mounika : బిగ్ బ్రేకింగ్.. అంబటి కూతురు రాజకీయాల్లోకి , అతిపెద్ద పదవి ప్రకటించిన జగన్..!

Ambati Mounika : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాజీ మంత్రి అంబటి రాంబాబు అరెస్ట్ వ్యవహారం తీవ్ర దుమారం రేపుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు…

2 hours ago

Thanuja Emmanuel : బిగ్ బాస్ డబ్బులతో ఇమ్మాన్యుయేల్ చేసిన పనికి కంట్లో నీళ్ళతో దండం పెట్టేసిన తనూజ..!

Thanuja Emmanuel : జబర్దస్త్ హాస్యనటుడిగా అందరికీ సుపరిచితుడైన ఇమ్మానుయేల్ తాజాగా తన ఉదార స్వభావాన్ని చాటుకున్నారు. బిగ్ బాస్…

3 hours ago

Ys Jagan : జగన్ అరస్ట్ చేస్తారా..? .. బయటపడ్డ 400 కోట్ల స్కాం !

Ys Jagan : ఆంధ్రప్రదేశ్ Andhra pradesh రాజకీయాల్లో ఇప్పుడు లిక్కర్ స్కామ్ వ్యవహారం కొత్త మలుపులు తిరుగుతోంది. ఇప్పటివరకు…

4 hours ago

Dietary Guidelines : ఆరోగ్యం కోసం కొత్త రూల్స్! ‘డైటరీ గైడ్‌లైన్స్’ ఏం చెబుతున్నాయి? మనం రోజు తినే ఆహారంలో ఏం మార్చుకోవాలి?

Dietary Guidelines  : ఆరోగ్యమే మహాభాగ్యం. కానీ మనం తినే ఆహారమే మన ఆరోగ్యాన్ని నిర్ణయిస్తుంది. అందుకే ప్రతి ఐదేళ్లకు…

5 hours ago

Telangana Jobs : నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్..!

Telangana Jobs  : తెలంగాణ నిరుద్యోగులకు మరియు మాజీ రెవెన్యూ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం భారీ ఊరటనిస్తూ 'గ్రామ పాలనా…

6 hours ago

Tribal Protest : పవన్ కళ్యాణ్ సార్‌ మా గోడు వినండి.. ఉరి తాడు వేసుకొని పవన్ గిరిజనులు విజ్ఞప్తి.. వైర‌ల్ వీడియో !

Tribal Protest : ఆంధ్రప్రదేశ్ Andhra pradesh ఉప ముఖ్యమంత్రి, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ Pawan…

7 hours ago