YSRCP : ప్రతిపక్షాలు బలపడేలా ఊతమిస్తున్న ఆ వైసీపీ ఎమ్మెల్యేలు? తల పట్టుకున్న వైఎస్ జగన్?

Advertisement
Published by
Advertisement

ఏపీలో అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తి చేసుకున్న వైసీపీకి ఇప్పుడు ప్రత్యర్ధులు, విపక్షాల నుంచి కాక సొంత పార్టీ ఎమ్మెల్యేల నుంచే ముప్పు ఎదురవుతోంది. ముఖ్యంగా ఏపీలో బలపడేందుకు విపక్షాలు చేస్తున్న ప్రయత్నాలకు సొంత పార్టీ ఎమ్మెల్యేలే ఊతమిస్తున్నారు. కొందరు తమ చర్యలతో, మరికొందరు తమ వ్యాఖ్యలతో సొంత పార్టీని ఇరుకునపెడుతున్నారు. దీంతో వీరిని నియంత్రించలేక అధినేత వైఎస్ జగన్ తలపట్టుకుంటున్నారు. రెండేళ్ల క్రితం భారీ విజయంతో అధికారం చేపట్టిన వైసీపీని ఇరుకున పెట్టేందుకు విపక్షాలకు పెద్దగా అవకాశాలు దొరకలేదు. దీంతో అంది వచ్చిన ఒకటీ అరా సమస్యలతో ప్రభుత్వాన్ని ఇబ్బందిపెట్టాయి. తాజాగా ఆ అవసరం లేకుండా వైసీపీ ఎమ్మెల్యేలే విపక్షాలకు అస్త్రాలు ఇస్తున్నారు. సొంత పార్టీ బలహీనతలు తెలిసి కూడా విపక్షాలకు అవకాశమిచ్చేలా వైసీపీ ఎమ్మెల్యేలు ప్రవర్తిస్తున్నారు. దీంతో వీరిని నియంత్రించడం సీఎం జగన్ కు, పార్టీ అధిష్టాన పెద్దలకు కష్టంగా మారుతోంది. ఏపీలో బలపడేందుకు విపక్ష బీజేపీ రెండేళ్లుగా చేయని ప్రయత్నం లేదు. పార్టీ అధ్యక్షుడి మార్పు దగ్గరి నుంచి, ఆలయాల్లో విగ్రహాల ధ్వంసాన్ని రాజకీయం చేయడం వరకూ బీజేపీ ఏదో ఒక ప్రయత్నం చేస్తూనే ఉంది. తాజాగా బీజేపీకి మరో రెండు అంశాలు కలిసివచ్చాయి. దీంతో బీజేపీ నేతలు వాటిని అందిపుచ్చుకోవడమే కాకుండా ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు ఓ రేంజ్ లో పావులు కదుపుతున్నారు.

Advertisement

ysrcp mlas versus cm ys jagan

భలే ఛాన్సులే..

బీజేపీ రాష్ట్రంలో బలపడేందుకు ఏం కోరుకుంటుందో అదే జరుగుతోంది. కడప జిల్లా ప్రొద్దుటూరులో వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి స్ధానికుల కోరికపై టిప్పుసుల్తాన్ విగ్రహ ఏర్పాటుకు శంఖుస్దాపన చేశారు. అంతటితో ఆగకుండా టిప్పుసుల్తాన్ స్వాతంత్ర సమరయోధుడని కీర్తించారు. దీంతో బీజేపీ భగ్గుమంది. ఇప్పటికీ ఛలో ప్రొద్దుటూరు పేరిట బీజేపీ ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. మరోవైపు గోవధపై తాజాగా కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి చేసిన వ్యాఖ్యలు కూడా చిచ్చురేపాయి. కాలం చెల్లిన గోవధ చట్టాన్ని రద్దు చేయాలని చెన్నకేశవరెడ్డి కోరడంపై బీజేపీ నేతలు మండిపడుతున్నారు. చెన్నకేశవరెడ్డికి వ్యతిరేకంగా రోజూ ఆందోళనలు చేపడుతున్నారు. వైసీపీ ఎమ్మెల్యేలు బీజేపీ అజెండాకు కలిసొచ్చేలా టిప్పు సుల్తాన్ విగ్రహం, గోవధ చట్టాలపై ఇలా వ్యాఖ్యలు చేస్తుండటంతో అధినేత వైఎస్ జగన్ ఇరుకునపడుతున్నారు. గతేడాది ఆలయాల్లో విధ్వంసాలపై వైసీపీ సర్కార్ ను టార్గెట్ చేసిన బీజేపీ నేతలు ఈసారి టిప్పుసుల్తాన్, గోవధ అంశాల్ని వాడుకుంటూ ప్రభుత్వాన్ని నిత్యం టార్గెట్ చేస్తున్నారు. దీంతో ఇటు సొంత పార్టీ ఎమ్మెల్యేల్ని నియంత్రించలేక, అటు బీజేపీ నేతలపై ఎదురుదాడి చేయలేక వైఎస్ జగన్ ఇబ్బంది పడుతున్నారు. భవిష్యత్తులో వీరిని నియంత్రించకపోతే బీజేపీయే ప్రధాన ప్రత్యర్ధిగా మారడానికి చేజేతులా అవకాశం ఇచ్చినట్లవుతుందని విశ్లేషకులు సైతం చెబుతున్నారు.

Advertisement
Advertisement

Recent Posts

TVK Vijay : పవన్ కళ్యాణ్ తో పాటు ఎవ్వరూ రాజకీయాల్లో చెయ్యని ప్రయోగం చేస్తున TVK విజయ్..!

TVK Vijay : తమిళనాడు రాజకీయాల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా దళపతి విజయ్ గురించే చర్చ జరుగుతోంది. తన సినీ…

7 minutes ago

మోడీ సమరశంఖం  పూరించాడు … మహా యుద్ధం కి రెడీ అయిన భారత్ .. అజిత్ దోవల్ చేతిలో THE RED FILE

Modi  : భారతదేశ రక్షణ రంగంలో ప్రస్తుతం అత్యంత కీలకమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఢిల్లీలోని ప్రధానమంత్రి కార్యాలయం గత…

2 hours ago

Telangana Chicken shops : తెలంగాణలో చికెన్ సెంటర్ల బంద్ సక్సెస్ : దిగివచ్చిన పౌల్ట్రీ కంపెనీలు.. భారీగా తగ్గిన ధరలు

Telangana Chicken shops : తెలంగాణ Telangana రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన చికెన్ సెంటర్ల బంద్ ఎట్టకేలకు ముగిసింది.…

3 hours ago

Chandrababu : ఎన్నడూ లేనంత కోపం తో ఊగిపోయిన CM చంద్రబాబు..!

Chandrababu  : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సాధారణంగా చాలా సంయమనంతో వ్యవహరిస్తుంటారు. కానీ తాజాగా పల్నాడు జిల్లాలో…

5 hours ago

Ration Card : రేషన్ కార్డు దారులకు అలర్ట్: ఇంధన కొరత వేళ కేంద్రం గుడ్ న్యూస్.. వెంటనే ఇలా చేయండి..!

How To Do Ration Card e-KYC Online : ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న భౌగోళిక రాజకీయ పరిణామాలు, ముఖ్యంగా మిడిల్…

6 hours ago

Telangana Rythu Bharosa Latest Updates : రైతు భరోసా అమలులో రేవంత్ సర్కార్ కీలక మార్పులు.. కొత్తగా వారికీ వర్తింపు, నిధుల జమ ముహూర్తం ఫిక్స్

Telangana Rythu Bharosa Latest Updates : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతాంగానికి శుభవార్త అందించింది. అన్నదాతలకు అండగా నిలిచేందుకు…

8 hours ago

Gold Silver Rate 2nd April 2026 : పసిడి ప్రియులకు షాక్.. ట్రంప్ ప్రకటనలతో ఆకాశాన్ని తాకిన బంగారం, వెండి ధరలు.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే?

Gold Silver Rate 2nd April 2026 : బంగారం కొనుగోలు చేయాలని ప్లాన్ చేసుకుంటున్న వారికి మార్కెట్ మళ్లీ…

9 hours ago

Karthika Deepam 2 April 2nd 2026 Episode : దీప చావుకు జ్యోత్స్న ముహూర్తం.. డీఎన్ఏ రిపోర్ట్స్ చూసి కార్తీక్ షాక్!

Karthika Deepam 2 April 2nd 2026 Episode : స్టార్ మా ఛానల్ లో ప్రసారం అవుతున్న 'కార్తీక…

10 hours ago

Ration Cards : తెలంగాణలో 1.40 లక్షల రేషన్ కార్డుల రద్దు: దేశవ్యాప్తంగా 41.41 లక్షల కార్డులకు ఎసరు.. కేంద్ర మంత్రి ప్రకటన!

Ration Cards  : ప్రజా పంపిణీ వ్యవస్థను పకడ్బందీగా అమలు చేసి, అర్హులైన పేదలకు మాత్రమే ప్రభుత్వ పథకాలు అందాలన్న…

10 hours ago

Non Veg Summer : ఎండాకాలం మొదలైంది నాన్ వెజ్ తినేముందు ఈ న్యూస్ ఒక్కసారి చదవండి

Non Veg Summer : వేసవి కాలం వచ్చిందంటే చాలు భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తుంటాడు. బయట అడుగు పెట్టాలంటేనే…

11 hours ago

Chanakyaniti : పొరపాటున కూడా వీరికి మీ పాదాలుతగలకూడదు .. సర్వనాశనం ఐపోతారు జాగ్రత్త.. ఆచార్య చాణక్యుడి

Chanakya Niti : భారతీయ చరిత్రలో ఆచార్య చాణక్యుడికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఆయన చెప్పిన నీతులు, సూత్రాలు…

12 hours ago

LPG Price Hike 2026 : మళ్లీ షాకిచ్చిన గ్యాస్ ధరలు.. సిలిండర్‌పై భారీ పెంపు.. హైదరాబాద్‌లో కొత్త రేట్లు ఇవే!

LPG Price Hike 2026 : కొత్త ఆర్థిక సంవత్సరం (2026-27) ప్రారంభమైన ఏప్రిల్ 1వ తేదీనే చమురు కంపెనీలు…

21 hours ago