Ahmedabad Plane Crash : కుటుంబాన్ని మొత్తం.. 10 మందిని బలిగొన్న అహ్మదాబాద్ విమాన ప్రమాదం..!
Ahmedabad Plane Crash : గుజరాత్లోని అహ్మదాబాద్లో చోటు చేసుకున్న ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో రాజస్థాన్కు చెందిన పది మంది వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో వృత్తిరీత్యా లండన్లో స్థిరపడేందుకు వెళుతున్న ఒక వైద్యుల కుటుంబం కూడా ఉండటం అందరినీ కలచివేస్తోంది. ఈ దుర్ఘటనతో ఆ కుటుంబ సభ్యులు, బంధువుల ఇళ్లలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
Ahmedabad Plane Crash : కుటుంబాన్ని మొత్తం.. 10 మందిని బలిగొన్న అహ్మదాబాద్ విమాన ప్రమాదం..!
వివరాల్లోకి వెళితే, డాక్టర్ ప్రతీక్ జోషి, ఆయన భార్య డాక్టర్ కోమి వ్యాస్ తమ ముగ్గురు పిల్లలు మిరాయ, నకుల్, ప్రద్యుత్లతో కలిసి లండన్లో కొత్త జీవితాన్ని ప్రారంభించాలని ప్రయాణమయ్యారు. వృత్తిపరమైన ఉన్నతి కోసం, పిల్లల భవిష్యత్తు కోసం వారు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ ఘోర ప్రమాదంలో డాక్టర్ ప్రతీక్ జోషి, డాక్టర్ కోమి వ్యాస్లతో పాటు వారి ముగ్గురు పిల్లలూ సంఘటనా స్థలంలోనే మరణించినట్లు అధికారులు ధృవీకరించారు.
ఈ విమాన ప్రమాదంలో వీరి కుటుంబంతో పాటు రాజస్థాన్కు చెందిన మరో ఐదుగురు కూడా మృతి చెందారని సమాచారం. ఉన్నతమైన భవిష్యత్తు కోసం కన్న కలలు కళ్ల ముందే ఆవిరైపోవడం, కుటుంబం మొత్తం ఈ ప్రమాదంలో బలికావడం తీవ్ర ఆవేదనకు గురిచేస్తోంది. ఈ విమాన ప్రమాదానికి గల కారణాలపై అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనపై పలువురు ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
Kadiyam Srihari : పార్టీ ఫిరాయింపుల అంశం తెలంగాణ రాజకీయాల్లో మరోసారి తీవ్ర చర్చకు దారితీసింది. ఇటీవలి ఎన్నికల అనంతరం…
Chandrababu : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజలలో మమేకమయ్యే విషయంలో అన్ని హద్దులనూ చెరిపివేస్తున్నారు. గతంలో ఎన్నడూ…
Anitha : హోంమంత్రి అనితా వంగలపూడి తాజాగా జగన్ అరెస్ట్ అంశంపై స్పష్టతనిచ్చారు, రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై కీలక వ్యాఖ్యలు…
Old Women : సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు మండల కేంద్రంలో ఓ వృద్ధురాలి స్థితి ఇప్పుడు అందరికీ కన్నీళ్లు తెప్పిస్తోంది.…
Kalpika Ganesh Father : నటి కల్పిక గురించి ఆమె తండ్రి సంఘవార్ గణేష్ పోలీసులకు సంచలన విషయాలు వెల్లడించారు.…
Viral Video : రాజన్న సిరిసిల్ల జిల్లాలో Rajanna Sircilla ఓ అద్భుతమైన దృశ్యం ప్రజల దృష్టిని ఆకర్షిస్తోంది. పెద్దబోనాల…
Nara Lokesh : ఆంధ్రప్రదేశ్ కు పెట్టుబడులు రాకుండా చేయాలని వైసీపీ కుట్రలు పన్నుతోందని రాష్ట్ర ఐటీ, విద్య శాఖ…
Cricketer : ప్రసిద్ధ కొరియోగ్రాఫర్, సోషల్ మీడియా ఇన్ఫ్ల్యూయెన్సర్ అయిన ధనశ్రీ వర్మతో భారత క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్ విడాకులు…
This website uses cookies.