
#image_title
AP Governor : టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ అక్రమమని ఇప్పటికీ టీడీపీ నేతలు ఖండిస్తున్నారు. కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే చంద్రబాబును అరెస్ట్ చేశారని వైసీపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో దుమ్మెత్తిపోస్తున్న విషయం తెలిసిందే. ఈనేపథ్యంలో టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడుతో సహా టీడీపీ కీలక నేతల బృందం ఏపీ గవర్నర్ ను కలిశారు. నిజానికి చంద్రబాబును 17ఏ సెక్షన్ కింద గవర్నర్ ను సంప్రదించుకుండా సీఐడీ అధికారులు ఏకపక్షంగా అరెస్ట్ చేశారని టీడీపీ నేతలు వాదిస్తున్నారు. ఈనేపథ్యంలో చంద్రబాబు అరెస్ట్ పై ఏపీ గవర్నర్ ను కలిశారు టీడీపీ నేతలు. గవర్నర్ ను కలిసి 50 పేజీల రిపోర్ట్ ను అందించారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫస్ట్ రోజు నుంచి ఏదైతే అమరావతిలో కాన్ఫరెన్స్ హాల్ పగులగొట్టినప్పటి నుంచి చంద్రబాబును అరెస్ట్ చేసినంత వరకు ప్రతి విషయాన్ని స్పష్టంగా గవర్నర్ కు అందజేశారు.
అన్ని విషయాల మీద పరిశీలన చేసి వాస్తవాలన్నీ కూడా తెలుసుకొని కేంద్ర ప్రభుత్వానికి పంపించాలని గవర్నర్ దృష్టిలో పెట్టాం. నాకు ఎంత వరకు అధికారం ఉందో, ఏ విధంగా చేయగలనో.. తప్పనిసరిగా చేస్తానని గవర్నర్ హామీ ఇచ్చారని అచ్చెన్నాయుడు చెప్పారు. రాజ్యాంగ సంస్థలు అన్నింటిపైనా నాశనం చేసి ఈ రాష్ట్రంలో పూర్తిగా రాజ్యాంగం లేకుండా పాలన సాగిస్తున్నారన్నారు. నా మీద కేసు పెట్టినప్పటి నుంచి చంద్రబాబు వరకు కొన్ని వందల మంది మీద సీఐడీని ఉపయోగించి కేసులు పెట్టారన్నారు. ఒక్క కేసులో అయినా సరే.. ఒక చిన్న ఆధారం కూడా సంపాదించలేకపోయారని అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీల మీద దాడులు చేశారు. దేవాలయాల మీద దాడులు చేశారు. అమరావతిని నాశనం చేశారు. అన్ని విషయాలను గవర్నర్ దృష్టికి తీసుకెళ్లామన్నారు.
ఒక్క రూపాయి అంటే ఒక్క రూపాయి అవినీతి జరిగిందని నిరూపించలేకపోయారు. చంద్రబాబును దారుణంగా అరెస్ట్ చేసి రాజమండ్రి జైలులో బంధించారు. నిరంతరం ప్రజల్లో ఉండి పోరాటం చేసే నాయకుడిని ఒక ఉగ్రవాదిలా అరెస్ట్ చేసి దారుణంగా వ్యవహరించారు. ఎందుకు అరెస్ట్ చేశారు.. చేసిన తప్పేంటి.. ఏదైనా ఆధారాలు ఉన్నాయా అని అడిగితే.. ముందు అరెస్ట్ చేస్తున్నాం.. దర్యాప్తు చేసి ఆధారాలు చెబుతాం అన్నారు. అరెస్ట్ చేసి 40 రోజులు అయింది.. ఇప్పటి వరకు ఒక్క ఆధారం కూడా చూపించలేకపోయారు. గవర్నర్ కి వాస్తవాలు చెప్పాం. మా నాయకుడిపై మూడు కేసులు పెట్టారు. స్కిల్ డెవలప్ మెంట్ కేసు, ఇన్నర్ రింగ్ రోడ్, ఫైబర్ నెట్ కేసును చంద్రబాబు మీద పెట్టారు అన్నారు.
Indian Rupee : భారత రూపాయి విలువ డాలర్తో పోలిస్తే చరిత్రలోనే కనిష్ట స్థాయికి చేరుకోవడం దేశ ఆర్థిక రంగంలో…
Ration Card : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజా పంపిణీ వ్యవస్థలో (PDS) కీలక మార్పులకు శ్రీకారం చుడుతోంది. రేషన్ సరుకుల…
SRH vs RCB : ఐపీఎల్ 2026 సీజన్లో అత్యంత ఆసక్తికర మ్యాచ్లలో ఒకటైన Sunrisers Hyderabad (SRH) vs…
Tilak : భారతీయ సంస్కృతిలో నుదిటిపై బొట్టు లేదా తిలకం పెట్టుకోవడం అనేది వేల ఏళ్లుగా కొనసాగుతున్న సంప్రదాయం. ముఖ్యంగా…
Gods : హిందూ సంప్రదాయాల్లో దేవతల ఆరాధనకు ప్రత్యేకమైన నియమాలు, ఆచారాలు ఉన్నాయని పురాణాలు మరియు శాస్త్రాలు చెబుతున్నాయి. ఉదయం…
Lemon Ginger Tea : ప్రస్తుతం ఆరోగ్యంపై శ్రద్ధ పెరుగుతున్న నేపథ్యంలో చాలామంది సహజ పానీయాలవైపు మొగ్గు చూపుతున్నారు. అలాంటి…
EMI : దేశంలో ఈఎంఐలపై స్మార్ట్ఫోన్లు కొనుగోలు చేసే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ముఖ్యంగా ఖరీదైన మొబైల్ ఫోన్లను…
Peddi Movie : మెగా పవర్ స్టార్ Ram Charan నటిస్తున్న భారీ చిత్రం Peddi పై రోజురోజుకూ అంచనాలు…
TDP NDA : దేశ రాజకీయాల్లో ఎన్డీఏ కూటమి సమీకరణాలు వేగంగా మారుతున్న వేళ తెలుగు దేశం పార్టీకి మరో…
Bhuma Mounika : టాలీవుడ్ నటుడు Manchu Manoj తాజాగా చేసిన వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీశాయి.…
తెలంగాణ ప్రభుత్వం కొత్త పెన్షన్ల మంజూరుపై కీలక అడుగులు వేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది ఎదురుచూస్తున్న కొత్త పెన్షన్ పథకాల…
Heatwave : దేశవ్యాప్తంగా ఎండల తీవ్రత రోజు రోజుకు పెరుగుతోంది. ముఖ్యంగా ఉత్తర భారతదేశంతో పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో…
This website uses cookies.