chandrababu targets cm YS jagan via bjp
Chandrababu – YS Jagan : ఏపీలో త్వరలో ఎన్నికలు రాబోతున్నాయి. త్వరలో అంటే ఇంకా సంవత్సరం సమయం ఉంది. కానీ.. ఇప్పటి నుంచే ఎన్నికల హడావుడి మొదలైంది. ఏపీలోని ప్రధాన పార్టీలన్నీ ఎన్నికల కోసం సమాయత్తం అవుతున్నాయి. అధికార పార్టీ వైసీపీ ఇప్పటి నుంచే ఎన్నికల వ్యూహాలను రచిస్తోంది. టీడీపీ అధినేత చంద్రబాబు కూడా ఎన్నికల విషయంతో సీరియస్ గా ఉన్నారు. ఆయన ఇప్పుడు రూట్ మార్చారు. నిజానికి ఏ పార్టీ వస్తే ఆ పార్టీతో పొత్తు పెట్టుకోవాలని యోచిస్తున్నారు చంద్రబాబు.అనధికారికంగా జనసేన పార్టీలో ఇప్పటికే పొత్తు ఖరారు అయినట్టే. కానీ.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పొత్తుపై ఇంకా క్లారిటీ తెచ్చుకోవడం లేదు.
బీజేపీతోనూ పొత్త పెట్టుకోవాలని చంద్రబాబు తీవ్రంగా శ్రమిస్తున్నారు కానీ.. బీజేపీ మాత్రం చంద్రబాబుతో పొత్తు పెట్టుకునేందుకు ససేమిరా అంటోంది. దీంతో బీజేపీని టార్గెట్ చేశారు చంద్రబాబు. అందుకే మరోసారి ప్రత్యేక హోదా అంటూ కొత్త నినాదం తెర మీదికి తీసుకొచ్చారు. కేంద్రంతో సీఎం జగన్ లాలూచీ పడి ప్రత్యేక హోదాను మరిచారని అన్నారు.ఇప్పటి వరకు ఏపీ సీఎం జగన్ పై విమర్శనాస్త్రాలు సంధించిన చంద్రబాబు.. తాజాగా ఇందులో బీజేపీని కూడా ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అసలే ఎన్నికలు వచ్చే సంవత్సరం ఉంటాయా? లేక ముందస్తు ఎన్నికలు ఉంటాయా? అనేది సుస్పష్టం కాని వేళ.. చంద్రబాబు వెరైటీ రాజకీయాలు చేస్తున్నారు.
chandrababu targets cm YS jagan via bjp
నిజానికి.. టీడీపీ, జనసేన ఈ రెండు పార్టీలు కలిసి బీజేపీతో పొత్తు పెట్టుకోవాలని పవన్ కళ్యాణ్ ప్రతిపాదిస్తున్నారు. దీనిపై బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాతో కూడా ఇప్పటికే మంతనాలు జరిపారు. కానీ.. బీజేపీ నుంచి ఎలాంటి రెస్పాన్స్ రాలేదు. దీంతో బీజేపీతో పొత్తు కన్ఫమ్ అయినట్టేనా అనేదానిపై క్లారిటీ లేదు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేనతోనే పొత్తు ఉంటుందా? ముందస్తు ఎన్నికల సమాచారం నేపథ్యంలో చంద్రబాబు రాజకీయాలు చాలా ఆసక్తికరంగా మారాయి. చూద్దాం మరి ఇంకెన్ని రాజకీయ మలుపులు చోటు చేసుకుంటాయో?
Rashmika Mandanna : చాలా రోజుల తర్వాత విజయ్ దేవరకొండ మంచి హిట్ కొట్టాడు. కింగ్డమ్ చిత్రం విజయ్కి బూస్టప్ని…
Three MLAs : తెలంగాణ రాజకీయాల్లో అనర్హత వేటు కలకలం రేపుతోంది. బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించిన…
Hero Vida : భారత ఎలక్ట్రిక్ వాహన రంగంలో గణనీయమైన పురోగతి నమోదు అవుతోంది. దీనిలో భాగంగా హీరో మోటోకార్ప…
PM Kisan : పీఎం కిసాన్ రైతుల కోసం ఆగస్టు 2న 20వ విడత విడుదల అయింది. యూపీలోని వారణాసి…
Dharmasthala : కర్ణాటకలోని ధర్మస్థల మృతదేహాల మిస్టరీని ఛేదించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) రంగంలోకి దిగింది. నేత్రావతి నది…
Gudivada Amarnath : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ముఖ్యమంత్రి…
Annadata Sukhibhava : ఆంధ్రప్రదేశ్లో రైతన్నలకు శుభవార్త! ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లా దర్శి మండలం వీరాయపాలెంలో 'అన్నదాత…
Eyebrows Risk : ఈరోజుల్లో ప్రతి ఒక్కరు అందం కోసం బ్యూటీ పార్లర్ చుట్టూ అమ్మాయిలు తెగ తిరిగేస్తూ ఉంటారు.…
This website uses cookies.