
AP CM YS Jaganmohan reddy don't want pm narendra modi friendship
ys jagan : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిపాలనను గ్రామస్థాయి వరకు తీసుకెళ్లిన ఘనత ఖచ్చితంగా సీఎం జగన్ మోహన్ రెడ్డికి దక్కుతుంది. గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేసి, ప్రజల వద్దకే పాలనా అనే దానికి సరైన నిర్వచనం ఇచ్చాడు. అయితే సచివాలయాల విషయంలో సీఎం జగన్ అనుకున్నంత పని జరగటం లేదనే మాటలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే సచివాలయాలు ఉద్యోగుల మీద కొన్ని ఫిర్యాదులు వస్తున్నాయి. అలాంటి వాటికీ చెక్ పెట్టె విధంగా సీఎం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నాడు.
ఇకపై సచివాలయం ఉద్యోగులు బయోమెట్రిక్ విధానం తప్పనిసరిగా వాడాలని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. బయోమెట్రిక్ హాజరుని తప్పనిసరి చేస్తూ గతంలో ఉత్తర్వులిచ్చినా మిషన్ పనిచేయలేదని, ఆన్ డ్యూటీ అని, రకరకాల కారణాలు చెప్పి తప్పించుకున్నారు.అయితే బయోమెట్రిక్ వ్యవహారంపై కఠినంగా ఉండాలనుకున్న రాష్ట్ర ప్రభుత్వం ఏప్రిల్ 1నుంచి దాన్ని తప్పనిసరి చేసింది. ఇకపై సచివాలయాల్లో పనిచేసే ఉద్యోగులకు బయోమెట్రిక్ హాజరు లేకపోతే ఆ రోజుకి జీతం పడదు.
గతంలో సచివాలయం ఉద్యోగులు ఏమైనా పనులు ఉంటేనే సచివాలయానికి వెళ్లేవారు. పెద్దగా పనులు లేకపోతే ఇంటి నుండే మేనేజ్ చేసేవాళ్ళు, ఎప్పుడైనా సచివాలయం వెళ్ళినప్పుడు హాజరు పట్టి నింపేసేవారు. దీనిపై ఫిర్యాదులు రావటంతో ఎంపీడీవోలు, ఎమ్మార్వోలు తనిఖీలు చెప్పట్టారు. కాకపోతే చాలా సమయం ఈ తనిఖీలకే సరిపోవటంతో వాళ్ళు దీనిని పక్కన పెట్టారు. దీనితో సచివాలయం ఉద్యోగులు ఆడిందే ఆటగా మారిపోయింది. వీటన్నిటినీ దృష్టిలో ఉంచుకుని బయోమెట్రిక్ హాజరుని తప్పనిసరి చేశారు అధికారులు. దీంతోపాటు సాయంత్రం 3నుంచి 5 గంటల వరకు కచ్చితంగా సచివాలయంలోనే ఉండాలనే నిబంధన విధించారు. అంతే కాదు, ఆ సమయంలో ఫిర్యాదులివ్వడానికి వచ్చినవారు, ఉద్యోగులు లేని విషయాన్ని గమనించి ఫిర్యాదు చేస్తే, కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఇదే సమయంలో ప్రభుత్వ పనులన్నీ కూడా ఖచ్చితమైన సమయంలోనే పూర్తి చేయాలంటే నిబంధనను కూడా తీసుకోని వచ్చారు 20 రోజుల్లోపు ఆరోగ్యశ్రీ కార్డు, 10 రోజుల్లో రైస్ కార్డు, 21 రోజుల్లో పెన్షన్ కార్డు, 90 రోజుల్లో ఇంటి పట్టాలు.. దరఖాస్తు చేసుకున్నవారిలో అర్హులను ఎంపిక చేసి ఇవ్వాలి. తాజాగా ప్రభుత్వం తీసుకొచ్చిన నిబంధనలు వలన సచివాలయం ఉద్యోగులు కొన్ని రోజులు ఇబ్బంది పడిన కానీ అంతిమంగా సీఎం జగన్ ఏ లక్ష్యంతో సచివాలయాలు ఏర్పాటు చేశాడో, ఆ లక్ష్యాలు చేరుకోవటానికి ఖచ్చితంగా ఉపయోగపడుతాయి.
Cold Drink And Chips : వేసవి కాలం వచ్చిందంటే చాలు.. భానుడి ప్రతాపం నుండి తప్పించుకోవడానికి చాలా మంది…
Tea : చాలా మందికి ఉదయం కళ్లు తెరవగానే వేడివేడి టీ కప్పు చేతిలో ఉండాల్సిందే. ఆ టీ చుక్క…
ఐపీఎల్ 2026 సీజన్లో వరుస విజయాలతో దూసుకుపోతున్న సన్రైజర్స్ హైదరాబాద్ (SRH) విజయ పరంపరకు కోల్కతా నైట్రైడర్స్ (KKR) బ్రేక్…
GT vs PBKS : ఐపీఎల్ 2026లో భాగంగా అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరిగిన ఉత్కంఠభరిత పోరులో…
Suryakumar Yadav : భారత క్రికెట్ జట్టులో గత కొన్నేళ్లుగా టీ20 ఫార్మాట్ను శాసించిన పేరు సూర్యకుమార్ యాదవ్. 'మిస్టర్…
Pawan Anna పేదరికం మనిషిని ఎన్ని కష్టాలకైనా గురిచేస్తుంది. ఆకలి తీర్చుకోవడానికి, కన్నబిడ్డల భవిష్యత్తును తీర్చిదిద్దడానికి ఏడు సముద్రాలు దాటి…
Hardik Pandya : ఐపీఎల్ చరిత్రలో అత్యంత విజయవంతమైన జట్టుగా పేరుగాంచిన ముంబై ఇండియన్స్ (MI), ప్రస్తుత 2026 సీజన్లో…
Alcohol : మద్యం మత్తు మనిషిని ఎంతటి నీచానికైనా దిగజార్చుతుంది. విచక్షణ కోల్పోయేలా చేస్తుంది. తాజాగా ఉత్తరప్రదేశ్లో జరిగిన ఒక…
Alcohol : మద్యపానం ఆరోగ్యానికి హానికరమని మనందరికీ తెలుసు. అందుకే చాలామంది ఆరోగ్య స్పృహ ఉన్నవారు మత్తు పానీయాలకు ఆమడ…
Ys Jagan : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో 2024 ఎన్నికల ఫలితాలు పెను మార్పులు తీసుకువచ్చాయి. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి…
NTR vs Gummadi : నటరత్న ఎన్టీఆర్ మరియు సహజ నటుడు గుమ్మడి వెంకటేశ్వరరావుల మధ్య ఒకప్పుడు ఎంతో గాఢమైన…
Viral News : సమాజంలో నైతిక విలువలు నానాటికీ దిగజారిపోతున్నాయి. తోడబుట్టిన వారు కాకపోయినా, తోడల్లుడు అంటే ఒక అన్నలాంటి…
This website uses cookies.