cm jagan : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ Ys Jagan బుధవారం భోగాపురం విమానాశ్రయం శంకుస్థాపన కార్యక్రమంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ శంకుస్థాపన కార్యక్రమం అనంతరం సవరవల్లిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం జగన్ మాట్లాడుతూ మూలపేటలో పోర్టు శంకుస్థాపన చేయడం జరిగింది. భోగాపురం విమానాశ్రయం ఉత్తరాంధ్రకు కేంద్ర బిందువుగా మారుతుందని పేర్కొన్నారు. ఈ రెండు ప్రాజెక్టులు ఉత్తరాంధ్ర అభివృద్ధిలో కీలకము కానున్నయని స్పష్టం చేశారు. అదేవిధంగా ఆదాన్ని డేటా సెంటర్ ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ముఖచిత్రమే మారబోతుందని పేర్కొన్నారు.
నేడు విమానాశ్రయం శంకుస్థాపన చేయటం కొందరు జీర్ణించుకోలేకపోతున్నారు. గతంలో కొంతమంది ఎన్నికలకు నాలుగైదు నెలల ముందు హడావిడిగా టెంకాయలు కొట్టారు. మేమే శంకుస్థాపనలు చేశామని గొప్పలు చెప్పుకుంటున్నారు. సుప్రీంకోర్టు ఎన్జీటీలలో కేసులు వేసి అడ్డుపడ్డారు. కాని భగవంతుడు దయవల్ల అన్ని అడ్డంకులు దాటుకుని నేడు విమానాశ్రయానికి శంకుస్థాపన చేయడం జరిగింది. రైతన్నల వల్లే ఈ ప్రాజెక్టు వచ్చింది. మెడికల్ టూరిజం, ఐటీ, ఇండస్ట్రీస్ కి కేంద్ర బిందువుగా భోగాపురం విమానాశ్రయం మారనుందని సీఎం జగన్ స్పష్టం చేశారు. 2026లో మళ్లీ విమానాశ్రయాన్ని ప్రారంభించడానికి వస్తానని జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఎవరు ఎన్ని కుట్రలు చేసినా ప్రజల ఆశీస్సులు భగవంతుని దీవెన ఉన్నంతకాలం… ముందుకు పోతానని పేర్కొన్నారు. 24 నుంచి 30 నెలలలోనే ఈ విమానాశ్రయం పూర్తి చేయడం జరుగుతుందని జగన్ పేర్కొన్నారు. ప్రపంచంలో ఎక్కడో లేని రీతిలో రెండు రెండు రన్ వేలు… అందుబాటులోకి ఉండనున్నట్లు పేర్కొన్నారు. భోగాపురం విమానాశ్రయం శంకుస్థాపన కార్యక్రమంలో సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారాయి.
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
CISF Fireman Recruitment : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్మెన్ల నియామక…
Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ…
7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్నెస్ అలవెన్స్ (డీఏ)ని ప్రభుత్వం పెంచబోతోంది. ప్రభుత్వం త్వరలో…
Balineni Srinivas Reddy : గత కొద్ది రోజులుగా బాలినేని వైసీపీని వీడనున్నట్టు అనేక ప్రచారాలు జరిగాయి. ఎట్టకేలకి అది…
Jamili Elections : దేశవ్యాప్తంగా ఒకేసారి పార్లమెంట్ , అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేలా జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్ ఆమోదం…
Naga Manikanta : బుల్లితెర ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తున్న బిగ్ బాస్ ఇప్పుడు తెలుగులో సీజన్ 8 జరుపుకుంటుంది.తాజా సీజన్లోని…
This website uses cookies.