Avinash Reddy: కడప ఎంపీ అవినాష్ రెడ్డి తల్లి ఆరోగ్యం బాగోలేదు అనే విషయం తెలుసు కదా. తన తల్లి ఆరోగ్యం బాగాలేకనే అవినాష్ రెడ్డి శుక్రవారం సీబీఐ విచారణకు కూడా హాజరు కాలేదు. దానిపై ప్రతిపక్షాలు చేయాల్సిన రాద్ధాంతం చేశాయి. తాజాగా అవినాష్ రెడ్డి తల్లి ఆరోగ్యంపై వైద్యులు కీలక ప్రకటన చేశారు. అవినాష్ తల్లి శ్రీలక్ష్మి కర్నూలులోని విశ్వభారతి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆమె పరిస్థితి కొంచెం ఆందోళనకరంగానే ఉన్నట్టు ఆసుపత్రి వర్గాలు చెబుతున్నాయి.
ఆమెకు నిర్వహించిన పరీక్షల్లో ట్రోపోనిన్ అనే వ్యాధి పాజిటివ్ వచ్చిందని తెలిపారు. అంటే.. అది గుండెపోటును తీసుకొచ్చే ప్రమాదం ఉంది. యాంజియోగ్రామ్ కూడా నిర్వహించగా.. ఆమెకు గుండెకు వెళ్లే రెండు రక్తనాళాలు బ్లాక్ అయినట్టు డాక్టర్లు గుర్తించారు. బీపీ కూడా లోగా ఉండటంతో.. ఆమెకు ఇప్పుడు ఎలాంటి ట్రీట్ మెంట్ అందించలేకపోతున్నారు వైద్యులు.ప్రస్తుతం అవినాష్ తల్లి ఐసీయూలోనే ఉన్నారు. మరికొన్ని రోజులు అవినాష్ తల్లిని ఆసుపత్రిలోనే ఉంచాలని డాక్టర్లు తెలిపారు. తల్లికి తోడుగా అవినాష్ అక్కడే ఉంటూ వైద్యులను అన్ని వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు.
తన తల్లికి అనారోగ్యం అని తెలియగానే తాను విచారణకు హాజరు కావడం లేదని సీబీఐకి తెలిపి హుటాహుటిన హైదరాబాద్ నుంచి కర్నూలుకు వెళ్లారు అవినాష్. ఈనేపథ్యంలో ఆమె ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్టు ఆసుపత్రి వైద్యులు తెలిపారు. అయితే.. ఈనెల 22న అవినాష్ ను సీబీఐ ఆఫీసులో విచారణకు హాజరుకావాలని అధికారులు తెలిపారు. మరోసారి నోటీసులు జారీ చేయడంతో తన తల్లి ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని అవినాష్ సీబీఐ విచారణకు వెళ్తారా? అనేది తెలియడం లేదు.
Breakfast : మనం తీసుకునే ఆహారమే మన శరీరాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే మనం తీసుకునే అల్పాహారం.…
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
CISF Fireman Recruitment : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్మెన్ల నియామక…
Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ…
7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్నెస్ అలవెన్స్ (డీఏ)ని ప్రభుత్వం పెంచబోతోంది. ప్రభుత్వం త్వరలో…
Balineni Srinivas Reddy : గత కొద్ది రోజులుగా బాలినేని వైసీపీని వీడనున్నట్టు అనేక ప్రచారాలు జరిగాయి. ఎట్టకేలకి అది…
Jamili Elections : దేశవ్యాప్తంగా ఒకేసారి పార్లమెంట్ , అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేలా జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్ ఆమోదం…
This website uses cookies.