doctors important announcement on avinash reddy mother health
Avinash Reddy: కడప ఎంపీ అవినాష్ రెడ్డి తల్లి ఆరోగ్యం బాగోలేదు అనే విషయం తెలుసు కదా. తన తల్లి ఆరోగ్యం బాగాలేకనే అవినాష్ రెడ్డి శుక్రవారం సీబీఐ విచారణకు కూడా హాజరు కాలేదు. దానిపై ప్రతిపక్షాలు చేయాల్సిన రాద్ధాంతం చేశాయి. తాజాగా అవినాష్ రెడ్డి తల్లి ఆరోగ్యంపై వైద్యులు కీలక ప్రకటన చేశారు. అవినాష్ తల్లి శ్రీలక్ష్మి కర్నూలులోని విశ్వభారతి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆమె పరిస్థితి కొంచెం ఆందోళనకరంగానే ఉన్నట్టు ఆసుపత్రి వర్గాలు చెబుతున్నాయి.
ఆమెకు నిర్వహించిన పరీక్షల్లో ట్రోపోనిన్ అనే వ్యాధి పాజిటివ్ వచ్చిందని తెలిపారు. అంటే.. అది గుండెపోటును తీసుకొచ్చే ప్రమాదం ఉంది. యాంజియోగ్రామ్ కూడా నిర్వహించగా.. ఆమెకు గుండెకు వెళ్లే రెండు రక్తనాళాలు బ్లాక్ అయినట్టు డాక్టర్లు గుర్తించారు. బీపీ కూడా లోగా ఉండటంతో.. ఆమెకు ఇప్పుడు ఎలాంటి ట్రీట్ మెంట్ అందించలేకపోతున్నారు వైద్యులు.ప్రస్తుతం అవినాష్ తల్లి ఐసీయూలోనే ఉన్నారు. మరికొన్ని రోజులు అవినాష్ తల్లిని ఆసుపత్రిలోనే ఉంచాలని డాక్టర్లు తెలిపారు. తల్లికి తోడుగా అవినాష్ అక్కడే ఉంటూ వైద్యులను అన్ని వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు.
doctors important announcement on avinash reddy mother health
తన తల్లికి అనారోగ్యం అని తెలియగానే తాను విచారణకు హాజరు కావడం లేదని సీబీఐకి తెలిపి హుటాహుటిన హైదరాబాద్ నుంచి కర్నూలుకు వెళ్లారు అవినాష్. ఈనేపథ్యంలో ఆమె ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్టు ఆసుపత్రి వైద్యులు తెలిపారు. అయితే.. ఈనెల 22న అవినాష్ ను సీబీఐ ఆఫీసులో విచారణకు హాజరుకావాలని అధికారులు తెలిపారు. మరోసారి నోటీసులు జారీ చేయడంతో తన తల్లి ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని అవినాష్ సీబీఐ విచారణకు వెళ్తారా? అనేది తెలియడం లేదు.
Sand Mafia : రాజానగరం నియోజకవర్గంలో మట్టి మాఫియా రెచ్చిపోతోంది. అక్కడికి దగ్గరలో ఉన్న కలవచర్ల గ్రామంలో పోలవరం ఎడమ…
Viral Video : మాములుగా పందేలు అనగానే కోడిపందేలు , ఏండ్ల పందేలు, గుర్రపు పందేలు చూస్తుంటాం..కానీ తాజాగా ఓ…
Rashmika Mandanna : చాలా రోజుల తర్వాత విజయ్ దేవరకొండ మంచి హిట్ కొట్టాడు. కింగ్డమ్ చిత్రం విజయ్కి బూస్టప్ని…
Three MLAs : తెలంగాణ రాజకీయాల్లో అనర్హత వేటు కలకలం రేపుతోంది. బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించిన…
Hero Vida : భారత ఎలక్ట్రిక్ వాహన రంగంలో గణనీయమైన పురోగతి నమోదు అవుతోంది. దీనిలో భాగంగా హీరో మోటోకార్ప…
PM Kisan : పీఎం కిసాన్ రైతుల కోసం ఆగస్టు 2న 20వ విడత విడుదల అయింది. యూపీలోని వారణాసి…
Dharmasthala : కర్ణాటకలోని ధర్మస్థల మృతదేహాల మిస్టరీని ఛేదించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) రంగంలోకి దిగింది. నేత్రావతి నది…
Gudivada Amarnath : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ముఖ్యమంత్రి…
This website uses cookies.