Father : గుంతలపై వినూత్న నిరసన.. నీటితో నిండిన గుంతలో పడుకుని ఆందోళన చేసిన తండ్రి
Father : ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్ నగరంలో ఓ తండ్రి వినూత్నంగా నిరసన తెలుపుతూ దేశవ్యాప్తంగా దృష్టిని ఆకర్షించారు. ఆనంద్ సౌత్ రోడ్ ప్రాంతంలో స్కూల్కి వెళ్లే మార్గంలో తన కూతురు నీటితో నిండిన గుంతలో పడిపోవడంతో, ఆగ్రహించిన తండ్రి గుంతలో చాప, దిండు వేసుకుని పడుకుని నిరసన చేపట్టారు. ఈ వ్యక్తి “భారత్ మాతా కీ జై” అంటూ నినాదాలు చేస్తూ, రోడ్డుపై ఉన్న భారీ నీటి గుంతలో పడుకుని నిరసన వ్యక్తం చేశారు.
Father : గుంతలపై వినూత్న నిరసన.. నీటితో నిండిన గుంతలో పడుకుని ఆందోళన చేసిన తండ్రి
Father : కూతురు పడిపోవడంతో..
ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ స్థానిక పాలక వ్యవస్థపై తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. స్థానికుల కథనం ప్రకారం, నెలల తరబడి ఈ రోడ్డు ఇదే విధంగా ఉన్నప్పటికీ, ఏ తరహా మరమ్మత్తు పనులు చేపట్టలేదని మండిపడుతున్నారు. వార్డు కౌన్సిలర్, ఎమ్మెల్యే, మంత్రులతో పాటు అధికారులను ఎన్నోసార్లు సంప్రదించినప్పటికీ ప్రయోజనం లేదని పేర్కొన్నారు.
“ఈ రోడ్డు చాలా ప్రమాదకరంగా మారింది. పిల్లలు స్కూల్కి వెళ్లే మార్గంలో జారిపడే ప్రమాదం ఉంది. నా కూతురు ఈరోజు పడిపోయింది, రేపు ఇంకెవరో పడవచ్చు. అయినా అధికారులు స్పందించడంలేదు. అందుకే గుంతలో పడుకుని నిరసన తెలియజేస్తున్నా,” అని ఆ తండ్రి మీడియాతో మాట్లాడారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను @mr_mayank అనే యూజర్ ట్విట్టర్లో షేర్ చేయగా, “Gems of Uttar Pradesh ” అంటూ వ్యాఖ్యానించారు. ఈ వీడియో లక్షల సంఖ్యలో వీక్షణలు సంపాదిస్తూ సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
