Rythu Bandhu : రైతన్నలకు శుభవార్త... రైతుబంధు నిధులను విడుదల ప్రభుత్వం..!
Rythu Bandhu : తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తాము ఇచ్చిన హామీలను నెరవేర్చుకునే దిశగా అడుగులు వేస్తూ వస్తున్నారు. ఇక ఇప్పటికే ఇచ్చిన 6 హామీలలో 5 హామీలను అమలు చేశామని చెబుతున్నారు. అయితే దీనిలో మహాలక్ష్మి యోజనలో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం , అలాగే 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ , గృహ జ్యోతి పథకం కింద 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు , ఇల్లు లేని పేదలకు ఇళ్ల స్థలాలను అదేవిధంగా ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి 5 లక్షల ఆర్థిక సాయం అందజేస్తుంది. ఇక ఈ 5 లక్షల ఆర్థిక సహాయాన్ని ఇప్పుడు 10 లక్షలు చేసిన సంగతి కూడా తెలిసిం దే.
ఇది ఇలా ఉంటే గత ప్రభుత్వం రైతుబంధు యోజన ద్వారా ఎకరాకు 10వేల రూపాయలను రైతుల ఖాతాలలో వేసింది. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రైతుబంధు యోజన ద్వారా రైతులకు ఇవ్వాల్సిన రైతుబంధు ఇంకా పూర్తవలేదు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం చాలా రోజులుగా ఈ విధానాన్ని అమలు చేసేందుకు చూస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఈ రైతుబంధును వారం రోజుల్లో పూర్తి చేయనున్నట్లు సమాచారం. ఇక ఈ రైతు యోజన పథకంలో ముందుగా ఎకరంలోపు భూమి కలిగి ఉన్న రైతులకు ప్రభుత్వం రైతుబంధు డబ్బు వారి ఖాతాలో జమ చేయడం జరిగింది. అనంతరం 3 నుంచి 5 ఎకరాల లోపు ఉన్న రైతులకు రైతుబంధు అందించే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది కానీ ఇంకా చాలామందికి రైతుబంధు రాకపోవడంతో రైతులు ఇబ్బంది పడుతున్నారు అని చెప్పాలి.
ఈ నేపథ్యంలోనే చాలామంది రైతులు అధికారులకు మొరపెట్టుకున్నారు. అయితే ఎట్టకేలకు వారి నిరీక్షణ ముగిసింది అని చెప్పాలి. ఎందుకంటే తాజాగా 3 నుంచి 5 ఎకరాలు కలిగిన రైతులకు ఈరోజు మధ్యాహ్నం నుండి రైతుబంధు డబ్బులను రైతుల ఖాతాలో జమ చేయనున్నట్లు తెలుస్తోంది.ఈ విషయాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించడం జరిగింది. అయితే ఇటీవల జరిగిన క్యాబినెట్ సమావేశాలలో రాష్ట్రంలో దాదాపు 93 శాతానికి పైగా రైతులకు రైతుబంధు ఇవ్వాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే రైతుబంధును కాంగ్రెస్ ప్రభుత్వం విడతల వారీగా విడుదల చేస్తూ వస్తుంది.
Vastu Tips : వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో పెట్టే వస్తువులు అయినా,దేవుని విగ్రహాలైనా సరే వీటి విషయంలో చాలా…
Tripathi : ఇందిరమ్మ ఇండ్ల విషయంలో నల్గొండ జిల్లా స్థాయి మొదలుకొని గ్రామ స్థాయి వరకు అధికారులు,సిబ్బంది ఎలాంటి విమర్శలు,ఆరోపణలకు…
Vajresh Yadav : ఇందిరమ్మ రాజ్యంలోనే పేదల సొంతింటి కల నెరవేరుతుందని మేడ్చల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి తోటకూర…
Venkatesh : టాలీవుడ్ హీరో విక్టరీ వెంకటేష్ కోసం మరో వినోదభరితమైన సినిమా కథ సిద్ధమవుతోంది. ఇప్పటికే హ్యూమర్కి సిగ్నేచర్…
JC Prabhakar Reddy : అనంతపురం జిల్లా తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి మరోసారి…
Chandrababu : రాయలసీమలో సాగునీటి సమస్యలను పరిష్కరించేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీసుకుంటున్న చర్యలు చరిత్రాత్మకంగా నిలుస్తాయని నంద్యాల…
Samsung Galaxy S24 FE : ఫ్లిప్కార్ట్ లో జరుగుతున్న GOAT Sale జులై 17కి ముగియబోతోంది . ఈ…
Jabardast Naresh : తెలుగు రాష్ట్రాల్లో అత్యంత ప్రజాదరణ పొందిన కామెడీ షో “జబర్దస్త్” గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం…
This website uses cookies.