Honey Moon : వీడిన హనీమూన్ జంట మిస్సింగ్ కేసు మిస్టరీ.. అసలు ట్విస్ట్ తెలిస్తే షాకే..!
Honey Moon : మధ్యప్రదేశ్ కి చెందిన రాజా రఘువంశీ, సోనమ్ జంట మే 11న వివాహం చేసుకుని మే 20న హనీమూన్ కోసం మేఘాలయకు వెళ్లారు. తూర్పు ఖాసీ హిల్స్ జిల్లాలో స్కూటీ అద్దెకు తీసుకుని పర్యటనకు వెళ్లిన ఈ జంట మే 23న కనిపించకుండా పోయింది. కుటుంబ సభ్యులు మేఘాలయ పోలీసులకు ఫిర్యాదు చేయగా, పోలీసులు మే 2న కొండ ప్రాంతంలో రాజా మృతదేహాన్ని కనుగొన్నారు. తొలుత సోనమ్ కూడా హత్యకు గురైందని అనుమానించారు. అయితే సంఘటనకు మలుపు తిప్పుతూ పోలీసులు ఉత్తరప్రదేశ్లో ఆమెను నలుగురు కిరాయి హంతకులతో పాటు అరెస్ట్ చేశారు.
Honey Moon : వీడిన హనీమూన్ జంట మిస్సింగ్ కేసు మిస్టరీ.. అసలు ట్విస్ట్ తెలిస్తే షాకే..!
మేఘాలయ డీజీపీ ఐ. నోంగ్గ్ వెల్లడించిన వివరాల ప్రకారం.. రాజా హత్య వెనుక ఉన్నది ఎవరో కాదు, అతని భార్య సోనమే. ఆమె ముందుగానే మధ్యప్రదేశ్కి చెందిన కిరాయి హంతకులతో రాజా హత్యకు ప్రణాళిక రచించినట్లు పోలీసులు గుర్తించారు. హనీమూన్ పేరుతో మేఘాలయకు తీసుకెళ్లడం, అక్కడ స్కూటీ అద్దెకు తీసుకుని కొండ ప్రాంతాలకు వెళ్లడం అంతా ముందస్తు ప్లాన్లో భాగమని వెల్లడించారు. సోనమ్పై నేరపూరిత కుట్ర, హత్యకు సహకరించిన నలుగురిపై కేసులు నమోదయ్యాయి.
ఈ కేసును సవాల్గా తీసుకున్న మేఘాలయ పోలీసులు కేవలం 7 రోజుల్లోనే సునిశిత దర్యాప్తు ద్వారా నిందితులను అదుపులోకి తీసుకుని మేజర్ బ్రేక్త్రూ సాధించారు. దీనిపై మేఘాలయ సీఎం కాన్రాడ్ సంగ్మా కూడా ట్విటర్ ద్వారా ప్రశంసలు తెలిపారు. రాజా హత్య కేసు ఇంకా కొన్ని కీలక మలుపులు తిరిగే అవకాశముందని పోలీసులు వెల్లడిస్తున్నారు. సోనమ్ ఈ దారుణానికి ఎందుకు ఒడిగట్టిందన్న విషయం ఇంకా అధికారికంగా బయటపడలేదు. త్వరలోనే నిందితులను మీడియా ముందు హాజరుపరిచే అవకాశం ఉందని తెలుస్తోంది.
Sravanthi Chokarapu : స్రవంతి చొక్కారపు..సినీ అభిమానులకు పెద్దగా పరిచయం అక్కర్లేని యాంకర్. ఇటీవల కాలంలో Social Media సోషల్…
BJP : ఏపీలో జరుగుతున్న తాజా రాజకీయ పరిణామాలపై ప్రముఖ రాజకీయ, సామాజిక విశ్లేషకుడు ప్రొఫెసర్ కంచె ఐలయ్య కీలక…
Sukumar Shah Rukh : పుష్ప ఫ్రాంచైజీతో భారీ హిట్స్ కొట్టిన సుకుమార్ త్వరలో ఏ హీరోతో సినిమా చేయబోతున్నాడనే…
Actress : అలనాటి అందాల నటి ఆమని గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. ‘జంబలకిడిపంబ’ అంటూ తొలి చిత్రంతోనే సంచలనం…
Farmers : తూర్పు గోదావరి జిల్లా రైతులు వరి పంటపై ఎక్కువగా ఆధారపడుతూ వస్తున్నారు. అయితే వరుసగా వచ్చిన ప్రకృతి…
Indian Students US : అమెరికాలో ఓ భారతీయ విద్యార్థిపై పోలీసులు చూపిన కిరాతక చర్యలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆగ్రహాన్ని…
RCB : ఆర్సీబీ మేనేజ్మెంట్లో ఇప్పుడు కొత్త టెన్షన్ మొదలైంది. ఐపీఎల్ 2025 ట్రోఫీ గెలిచిన తర్వాత ఆర్సీబీ విక్టరీ…
HoneyMoon : మేఘాలయలో జరిగిన రాజా రఘువంశీ హత్య కేసు దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. వివాహం జరిగిన నాలుగు రోజులకే…
This website uses cookies.