Honey Moon : వీడిన హనీమూన్ జంట మిస్సింగ్ కేసు మిస్టరీ.. అసలు ట్విస్ట్ తెలిస్తే షాకే..!
Honey Moon : మధ్యప్రదేశ్ కి చెందిన రాజా రఘువంశీ, సోనమ్ జంట మే 11న వివాహం చేసుకుని మే 20న హనీమూన్ కోసం మేఘాలయకు వెళ్లారు. తూర్పు ఖాసీ హిల్స్ జిల్లాలో స్కూటీ అద్దెకు తీసుకుని పర్యటనకు వెళ్లిన ఈ జంట మే 23న కనిపించకుండా పోయింది. కుటుంబ సభ్యులు మేఘాలయ పోలీసులకు ఫిర్యాదు చేయగా, పోలీసులు మే 2న కొండ ప్రాంతంలో రాజా మృతదేహాన్ని కనుగొన్నారు. తొలుత సోనమ్ కూడా హత్యకు గురైందని అనుమానించారు. అయితే సంఘటనకు మలుపు తిప్పుతూ పోలీసులు ఉత్తరప్రదేశ్లో ఆమెను నలుగురు కిరాయి హంతకులతో పాటు అరెస్ట్ చేశారు.
Honey Moon : వీడిన హనీమూన్ జంట మిస్సింగ్ కేసు మిస్టరీ.. అసలు ట్విస్ట్ తెలిస్తే షాకే..!
మేఘాలయ డీజీపీ ఐ. నోంగ్గ్ వెల్లడించిన వివరాల ప్రకారం.. రాజా హత్య వెనుక ఉన్నది ఎవరో కాదు, అతని భార్య సోనమే. ఆమె ముందుగానే మధ్యప్రదేశ్కి చెందిన కిరాయి హంతకులతో రాజా హత్యకు ప్రణాళిక రచించినట్లు పోలీసులు గుర్తించారు. హనీమూన్ పేరుతో మేఘాలయకు తీసుకెళ్లడం, అక్కడ స్కూటీ అద్దెకు తీసుకుని కొండ ప్రాంతాలకు వెళ్లడం అంతా ముందస్తు ప్లాన్లో భాగమని వెల్లడించారు. సోనమ్పై నేరపూరిత కుట్ర, హత్యకు సహకరించిన నలుగురిపై కేసులు నమోదయ్యాయి.
ఈ కేసును సవాల్గా తీసుకున్న మేఘాలయ పోలీసులు కేవలం 7 రోజుల్లోనే సునిశిత దర్యాప్తు ద్వారా నిందితులను అదుపులోకి తీసుకుని మేజర్ బ్రేక్త్రూ సాధించారు. దీనిపై మేఘాలయ సీఎం కాన్రాడ్ సంగ్మా కూడా ట్విటర్ ద్వారా ప్రశంసలు తెలిపారు. రాజా హత్య కేసు ఇంకా కొన్ని కీలక మలుపులు తిరిగే అవకాశముందని పోలీసులు వెల్లడిస్తున్నారు. సోనమ్ ఈ దారుణానికి ఎందుకు ఒడిగట్టిందన్న విషయం ఇంకా అధికారికంగా బయటపడలేదు. త్వరలోనే నిందితులను మీడియా ముందు హాజరుపరిచే అవకాశం ఉందని తెలుస్తోంది.
Nabha Natesh : 19 ఏళ్ల వయసులోనే హీరోయిన్గా వెండితెరపై అడుగుపెట్టిన అందాల ముద్దుగుమ్మ నభా నటేష్. వజ్రకాయ సినిమాలో…
Nara Lokesh : అమరావతి మహిళపై కొమ్మినేని చేసిన వ్యాఖ్యలు చినికి చినికి గాలివానలా మొదలైన ఘటన, ఇప్పుడు పెద్ద…
Indiramma Housing Scheme : తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణ దిశగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో ప్రభుత్వం శరవేగంగా అడుగులు…
Ambati Rambabu : ప్రముఖ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్ట్ ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా…
TGSRTC : తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా టీఎస్ఆర్టీసీ బస్సుల బస్ పాస్ ఛార్జీలను భారీగా పెంచింది. కొత్త ధరలు జూన్ 9…
Chandrababu : తెలుగుదేశం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పుడు తన పార్టీ ఎమ్మెల్యేల పనితీరుపై దృష్టి సారించారు. ప్రజల…
Ranapala Plant Benefits : ఈ రోజుల్లో అనారోగ్య సమస్యల పడుతున్న వారి సంఖ్య పెరిగిపోతుంది. అందుకని కొంతమంది ఔషధ…
Mudragada Padmanabham : సీనియర్ నాయకుడు ముద్రగడ పద్మనాభం తన కుటుంబానికి సంబంధించిన అంశాలను బహిరంగంగా పంచుకున్నారు. తాజాగా విడుదల…
This website uses cookies.