Honey Moon : వీడిన హనీమూన్‌ జంట మిస్సింగ్‌ కేసు మిస్టరీ.. అసలు ట్విస్ట్ తెలిస్తే షాకే..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Honey Moon : వీడిన హనీమూన్‌ జంట మిస్సింగ్‌ కేసు మిస్టరీ.. అసలు ట్విస్ట్ తెలిస్తే షాకే..!

 Authored By ramu | The Telugu News | Updated on :9 June 2025,2:00 pm

ప్రధానాంశాలు:

  •  Honey Moon : వీడిన హనీమూన్‌ జంట మిస్సింగ్‌ కేసు మిస్టరీ.. అసలు ట్విస్ట్ తెలిస్తే షాకే..!

Honey Moon : మధ్యప్రదేశ్‌ కి చెందిన రాజా రఘువంశీ, సోనమ్ జంట మే 11న వివాహం చేసుకుని మే 20న హనీమూన్ కోసం మేఘాలయకు వెళ్లారు. తూర్పు ఖాసీ హిల్స్ జిల్లాలో స్కూటీ అద్దెకు తీసుకుని పర్యటనకు వెళ్లిన ఈ జంట మే 23న కనిపించకుండా పోయింది. కుటుంబ సభ్యులు మేఘాలయ పోలీసులకు ఫిర్యాదు చేయగా, పోలీసులు మే 2న కొండ ప్రాంతంలో రాజా మృతదేహాన్ని కనుగొన్నారు. తొలుత సోనమ్ కూడా హత్యకు గురైందని అనుమానించారు. అయితే సంఘటనకు మలుపు తిప్పుతూ పోలీసులు ఉత్తరప్రదేశ్‌లో ఆమెను నలుగురు కిరాయి హంతకులతో పాటు అరెస్ట్ చేశారు.

Honey Moon వీడిన హనీమూన్‌ జంట మిస్సింగ్‌ కేసు మిస్టరీ అసలు ట్విస్ట్ తెలిస్తే షాకే

Honey Moon : వీడిన హనీమూన్‌ జంట మిస్సింగ్‌ కేసు మిస్టరీ.. అసలు ట్విస్ట్ తెలిస్తే షాకే..!

Honey Moon : మొత్తం ఆమె చేసింది.. హనీమూన్ జంట మిస్సింగ్ కేసులో షాకింగ్ ట్విస్ట్

మేఘాలయ డీజీపీ ఐ. నోంగ్‌గ్ వెల్లడించిన వివరాల ప్రకారం.. రాజా హత్య వెనుక ఉన్నది ఎవరో కాదు, అతని భార్య సోనమే. ఆమె ముందుగానే మధ్యప్రదేశ్‌కి చెందిన కిరాయి హంతకులతో రాజా హత్యకు ప్రణాళిక రచించినట్లు పోలీసులు గుర్తించారు. హనీమూన్ పేరుతో మేఘాలయకు తీసుకెళ్లడం, అక్కడ స్కూటీ అద్దెకు తీసుకుని కొండ ప్రాంతాలకు వెళ్లడం అంతా ముందస్తు ప్లాన్‌లో భాగమని వెల్లడించారు. సోనమ్‌పై నేరపూరిత కుట్ర, హత్యకు సహకరించిన నలుగురిపై కేసులు నమోదయ్యాయి.

ఈ కేసును సవాల్‌గా తీసుకున్న మేఘాలయ పోలీసులు కేవలం 7 రోజుల్లోనే సునిశిత దర్యాప్తు ద్వారా నిందితులను అదుపులోకి తీసుకుని మేజర్ బ్రేక్‌త్రూ సాధించారు. దీనిపై మేఘాలయ సీఎం కాన్రాడ్ సంగ్మా కూడా ట్విటర్‌ ద్వారా ప్రశంసలు తెలిపారు. రాజా హత్య కేసు ఇంకా కొన్ని కీలక మలుపులు తిరిగే అవకాశముందని పోలీసులు వెల్లడిస్తున్నారు. సోనమ్ ఈ దారుణానికి ఎందుకు ఒడిగట్టిందన్న విషయం ఇంకా అధికారికంగా బయటపడలేదు. త్వరలోనే నిందితులను మీడియా ముందు హాజరుపరిచే అవకాశం ఉందని తెలుస్తోంది.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది