
tdp party
TDP : ఆంధ్రప్రదేశ్ లో జగన్ ముఖ్యమంత్రి అయినా వెంటనే ప్రవేశ పెట్టిన పధకం వాలంటీర్ల వ్యవస్థ, గ్రామాల్లో ప్రభుత్వ పధకాలు ప్రతి ఒక్కరికి అందాలనే ఆలోచనతో ప్రతి 50 ఇళ్లకు ఒక వాలంటీర్ లెక్కన జగన్ ఈ పధకాన్ని ప్రవేశ పెట్టి వాళ్ళకి నెల నెల ఐదు వేల వరకు గౌరవ వేతనం ఇస్తున్నాడు. జగన్ ప్రవేశ పెట్టిన ఈ పథకాన్ని అందరి కంటే ఎక్కవుగా టీడీపీ నేతలే విమర్శిస్తున్నారు. వారు వైసీపీ కార్యకర్తలని.. ఎన్నికల కోసం.. వారిని వాడుకుంటున్నారని వైసీపీకి ఓటు వేసేలా బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపిస్తున్నారు.
ఈ విధంగా విమర్శలు చేస్తున్న టీడీపీ నేతలు, టీడీపీ గెలిస్తే మాత్రం వాలంటీర్లకు జీతాలు పెంచుతామని చెప్పటం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశం అయ్యింది. టీడీపీ కి చెందిన విజయవాడ ఎంపీ కేశినేని నాని ఈ ప్రకటన చేశాడు. అధికారంలోకి రాగానే వాలంటీర్ల జీతాలను పెంచుతామని ప్రభుత్వ ఉద్యోగులతో పాటు సమానంగా సౌకర్యాలను కల్పిస్తామని విజయవాడ ఎంపీ కేశినేని నాని ప్రకటించారు.
ఎదో విజయవాడ మేయర్ ఎన్నికలు జరుగుతున్నాయి కదా.. ఆ కోణంలో ఆయన ఆ ప్రకటన చేశాడు అనుకుంటే పొరపాటే, రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అంటూ చెప్పటం జరిగింది. సరే అధికారంలోకి రావటం, రాకపోవటం తర్వాతి విషయం, టీడీపీ వ్యతిరేకించే వాలంటీర్లకు ఆ పార్టీ అధికారంలోకి వస్తే జీతాలు పెంచుతామని నాని చెప్పటం హాట్ టాపిక్ అవుతుంది.
అయితే కేశినేని నాని ఈ ప్రకటన చేయటం వెనుక గట్టి ఆలోచనే ఉన్నట్లు తెలుస్తుంది. గత కొద్దీ రోజులుగా వాలంటీర్లు తమకు జీతాలు సరిపోవటం లేదని, వాటిని పెంచాలని ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే, అయితే జగన్ మాత్రం జీతాలు పెంచే ఆలోచన లేదని, మీరు చేస్తుంది ఒక ప్రజా సేవ, మీకు ఇస్తుంది గౌరవ వేతనం తప్పితే, జీతం కాదు. కాబట్టి చేస్తున్న సేవకు సన్మానాలు లాంటివి చేస్తాం కానీ వేతనం పెంచే ప్రసక్తి లేదని తేల్చి చెప్పాడు. దీనితో వాలంటీర్లు కు జగన్ పట్ల కొంచం వ్యతిరేకత వచ్చింది.
దానిని గమనించిన నాని తమ పార్టీ అధికారంలోకి వస్తే జీతాలు పెంచుతామని చెప్పటం ద్వారా కనీసం వాలంటీర్ల లో ఒక పది శాతం మంది టీడీపీకి అనుకూలంగా వ్యవహరిస్తే చాలు అనేది నాని ఆలోచన అని తెలుస్తుంది. వాలంటీర్లు అంటేనే వైసీపీ నేతలు అనేది అందరికి తెలిసిన విషయాం. అలాంటి వాళ్ళే టీడీపీ కి ఓట్లు వేయమని తమకు అప్పగించిన 50 ఇళ్లల్లో చెపితే ఆ ప్రభావం తీవ్రంగానే ఉంటుంది. అందుకే నాని జీతాలు పెంపు అనే మాటను వదిలాడు అని తెలుస్తుంది.
Petrol : భారత్లో పెట్రోల్ వినియోగంపై తాజాగా వెలువడిన గణాంకాలు ఆసక్తికర చర్చకు దారితీశాయి. దేశంలో ఒక్కో వ్యక్తి ప్రాతిపదికన…
PM Modi : ప్రధానమంత్రి Narendra Modi ఇటీవల చేసిన “స్మార్ట్ స్పెండింగ్” పిలుపు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. బంగారం…
Farmers Good News : కేంద్ర ప్రభుత్వం రైతులు మరియు మౌలిక సదుపాయాల అభివృద్ధిపై కీలక నిర్ణయాలు తీసుకుంది. తాజాగా…
Donald Trump : అమెరికా మాజీ అధ్యక్షుడు Donald Trump చైనా పర్యటనకు సంబంధించిన వార్తలు ప్రస్తుతం అంతర్జాతీయ రాజకీయాల్లో…
Heart Health : ప్రస్తుతం గుండె జబ్బులు ప్రపంచవ్యాప్తంగా ప్రధాన ఆరోగ్య సమస్యగా మారుతున్నాయి. వయస్సుతో సంబంధం లేకుండా యువతలో…
Working Hours : ప్రస్తుతం చాలా మంది ఉద్యోగులు రోజుకు 8 నుంచి 12 గంటల వరకు కంప్యూటర్ ముందు…
AP Rajya Sabha : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి రాజ్యసభ ఎన్నికల హడావిడి మొదలైంది. రాష్ట్రంలో ఖాళీ కానున్న రాజ్యసభ…
Anushka Shetty : దక్షిణాది సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న Anushka Shetty మరోసారి వార్తల్లో…
Vijay and Trisha Marriage : తమిళ సినీ పరిశ్రమలో గత కొన్ని నెలలుగా హీరో Vijay, హీరోయిన్ Trisha…
Hair : జుట్టు రాలిపోవడం ప్రస్తుతం చాలామందిని వేధిస్తున్న ప్రధాన సమస్యల్లో ఒకటి. ఒత్తిడి, కాలుష్యం, పోషకాహార లోపం, హార్మోన్ల…
Rice Water : ఇటీవల కాలంలో జుట్టు సంరక్షణ కోసం సహజ పద్ధతులపై ఆసక్తి పెరుగుతోంది. ముఖ్యంగా బియ్యం నీటిని…
High-Protein Breakfast : ఉదయాన్నే తీసుకునే బ్రేక్ఫాస్ట్ మన ఆరోగ్యంపై చాలా ప్రభావం చూపుతుంది. చాలామంది ఉదయం అల్పాహారాన్ని స్కిప్…
This website uses cookies.