Categories: politicsTelangana

కేసీఆర్ కుటుంబానికి సీబీఐ తో చెక్ పెట్టబోతున్నారా.. ?

తెలంగాణలో అధికారం చెలాయిస్తున్న కేసీఆర్ మరియు అతని కుటుంబ సభ్యుల మీద బీజేపీ నేతలు ఈ మధ్య కాలంలో తీవ్రమైన విమర్శలు చేస్తున్నారు. ముఖ్యంగా బండి సంజయ్ లాంటి నేతలు కేసీఆర్ ను టార్గెట్ చేస్తూ ఆయన ఆస్తుల మీద సీబీఐ కి వెళ్తామని బెదిరింపులకు దిగిన సంగతి అందరికి తెలుసు.

తమ దగ్గర ఆధారాలు అన్నీ ఉన్నాయని.. కోర్టులో పిటిషన్లు వేస్తామని బీజేపీ నేతలు చెప్పేవారు. కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు చేస్తామనేవారు. కేసీఆర్ కు జైలు మాత్రమే మిగిలిందని హెచ్చరించేవారు. అయితే గ్రేటర్ ఎన్నికల తర్వాత.. కేసీఆర్ సైలెంట్ కావడంతో బండి సంజయ్ నోట.. కేసీఆర్ జైలు అనే మాటలు రావడం కూడా తగ్గిపోయింది. ఇప్పుడు బీజేపీ వ్యవహారాల ఇన్చాజ్ తరుణ్ చుగ్ నేరుగా… కవితకు హెచ్చరికలు జారీ చేశారు.

సింగరేణి బెల్ట్‌లో పర్యటించిన తరుణ్ చుగ్.. అక్కడ కార్మిక యూనియన్లలో పట్టు పెంచుకున్న కవితను టార్గెట్ చేశారు. యూనియన్‌ లీడర్‌గా ఎమ్మెల్సీ కవిత అంతా తన చేతిలో పెట్టుకున్నారని.. ఎమ్మెల్సీ కవితకు తానిచ్చే మెసేజ్‌ ఒకటేనని.. దోపిడీ దొంగల్ని బీజేపీ ఎప్పుడూ వదిలిపెట్టలేదనేదేనని ఆయన చెప్పుకొచ్చారు. వదిలి పెట్టకుండా ఎలా పట్టుకుంటారంటే.. టీఆర్ఎస్‌ ప్రభుత్వ అవినీతిపై కేంద్ర హోంశాఖ, సీబీఐకి ఫిర్యాదు చేస్తామని ప్రకటించారు.

నిజానికి గత కొద్దీ కాలంగా తెరాస నేతలెవరూ బయటకు వచ్చి మాట్లాడిన సందర్భాలు కానీ, బీజేపీ మీద విమర్శలు చేసిన సందర్భాలు కానీ చాలా తక్కువ అనే చెప్పాలి. దీనితో బీజేపీ నేతలు కూడా పెద్దగా కేసీఆర్ గురించి కానీ, తెరాస పార్టీ గురించి ఈ మధ్య విమర్శలు చేయటం తగ్గించారు. ఇలాంటి దశలో తరుణ్ చుగ్ నేరుగా కవిత మీద విమర్శలు చేయటం చర్చనీయాంశం అయ్యింది.

అయితే బీజేపీ నేతల మాటలకూ తెరాస నేతలు కౌంటర్లు ఇస్తున్న కానీ వాటిలో పెద్దగా పస లేదనే చెప్పాలి. ఇక్కడ విశేషం ఏమిటంటే కవితను టార్గెట్ చేసి విమర్శలు చేసిన తరుణ్ చుగ్ మీద కాకుండా రొటీన్ విమర్శలు చేస్తున్న బండి సంజయ్ మీద ప్రభుత్వ విప్ సుమన్ విరుచుకుపడ్డారు. కేసీఆర్‌పై మాట్లాడే ముందు నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు. గ్రేటర్ ఎన్నికల తర్వాత కొంచం మౌనంగా ఉంటున్న బీజేపీ పార్టీ మరోసారి సీబీఐ మంత్ర జపం చేస్తుంది…

Recent Posts

TSRTC : రాఖీ సందర్బంగా ఏకంగా 30 % చార్జీలను పెంచిన TSRTC

TSRTC : రాఖీ పండుగ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్‌టీసీ) ప్రత్యేక బస్సుల్లో ఛార్జీలను 30%…

27 minutes ago

Rakhi Festival : రక్షాబంధన్ స్పెషల్.. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రకటించిన రాష్ట్రాలు!

Rakhi Festival :  రాఖీ పండగ సందర్భంగా మహిళలకు గిఫ్ట్ ల rain పడుతోంది. రక్షాబంధన్ పర్వదినాన్ని పురస్కరించుకుని, దేశంలోని…

2 hours ago

Holidays : విద్యార్ధుల‌కి గుడ్ న్యూస్.. ఏకంగా 5 రోజులు సెల‌వు..!

Holidays : ఇప్పటి స్కూల్ జీవితాన్ని చూస్తే చిన్నారుల మీద ఒత్తిడి ఏ స్థాయిలో ఉందో స్పష్టంగా అర్థమవుతోంది. చదువు…

3 hours ago

Best Phones : రూ.15 వేల లోపు ఫోన్ కోసం చూస్తున్నారా.. ఈ ఫోన్స్ బెస్ట్ చాయిస్

Best Phones : భారత మార్కెట్‌లో బడ్జెట్‌ సెగ్మెంట్‌కు భారీ డిమాండ్‌ ఉండటంతో, అనేక స్మార్ట్‌ఫోన్‌ బ్రాండ్లు అత్యుత్తమ ఫీచర్లతో…

4 hours ago

Rakhi Gift : ప్రధాని మోడీ రాఖీ గిఫ్ట్ – వంట గ్యాస్ సిలిండర్ ధర తగ్గింపు..!?

Rakhi Gift : రాఖీ పండుగ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ మహిళలకు ప్రత్యేక కానుక ప్రకటించడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది.…

5 hours ago

India : అమెరికా కు భారీ షాక్ ఇచ్చిన భారత్

India  : అమెరికా విధించిన భారీ సుంకాలకు ప్రతిగా భారత్ ఒక కీలకమైన, వ్యూహాత్మక నిర్ణయం తీసుకుంది. అమెరికా నుండి…

6 hours ago

Nara Lokesh : 2029 సీఎం అభ్యర్థిగా నారా లోకేష్..?

Nara Lokesh  : ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం-జనసేన-బీజేపీ సంకీర్ణ కూటమి అధికారంలోకి వచ్చి రెండు నెలలు దాటిన తర్వాత, కూటమిలో ఇబ్బందికర…

7 hours ago

Guvvala Balaraju : బిజెపిలోకి మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు : రాంచందర్ రావు

Guvvala Balaraju : తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. బీఆర్ఎస్ పార్టీని వీడిన అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే…

8 hours ago