
kadiyam srihari talks about brs party after results
Kadiyam Srihari : తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గెలిచింది. ప్రభుత్వాన్ని కూడా ఏర్పాటు చేయబోతోంది. 119 సీట్లకు గాను 64 సీట్లను కాంగ్రెస్ గెలుచుకుంది. బీఆర్ఎస్ పార్టీ 39 సీట్లకే పరిమితం అయింది. అందులో స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యేగా కడియం శ్రీహరి గెలుపొందారు. ఇదివరకు ఆయన ఎమ్మెల్సీగా ఉన్నారు. ఆ తర్వాత స్టేషన్ ఘనపూర్ టికెట్ ను కేసీఆర్.. కడియంకు ఇచ్చారు. దీంతో కాంగ్రెస్ వేవ్ లోనూ ఘనపూర్ లో కడియం శ్రీహరి గెలిచి చూపించారు. ఎమ్మెల్యేగా గెలిచిన అనంతరం కడియం నియోజకవర్గ ప్రజలతో మాట్లాడారు. పార్టీ అధికారంలోకి రాలేదని ఎవ్వరూ భయపడాల్సిన అవసరం లేదు. మళ్లీ ఆరు నెలలు, సంవత్సరం, రెండు సంవత్సరాలు అని చెప్పలేం కానీ.. మళ్లీ ప్రభుత్వం మనదే. మన ముఖ్యమంత్రి కేసీఆరే.. కాంగ్రెస్ పార్టీకి బోటాబోటి మెజారిటీ వచ్చింది. దాన్ని కాపాడుకుంటారో లేదో మనం చూడాలి అని కడియం శ్రీహరి అన్నారు.
ప్రజలు మార్పు కోరుకున్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పును మనమంతా గౌరవించాలి. ప్రతిష్టమైన ప్రతిపక్ష పాత్ర పోషిస్తాం. అంతే కాకుండా.. తెలంగాణ ప్రజల హక్కులకు ఎక్కడా భంగం కలిగినా మేము ఊరుకోం అన్నారు కడియం శ్రీహరి. కడియం మాటలను బట్టి చూస్తే కాంగ్రెస్ పార్టీ ఎక్కువ రోజులు అధికారంలో ఉండదు అనిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీకి ఉన్నదే 64 మంది ఎమ్మెల్యేలు. అందులో కనీసం ఐదుగురు ఎమ్మెల్యేలు పార్టీ మారినా.. రాజీనామా చేసినా ప్రభుత్వం పడిపోతుంది. అంటే.. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఐదేళ్లలో ఎప్పుడైనా పడిపోయే చాన్స్ ఉంది. దాన్ని బీఆర్ఎస్ అవకాశంగా తీసుకుంటుందా? కడియం చెప్పిన మాటలు దానికే నిదర్శనంగా కనిపిస్తున్నాయా అనేది తెలియడం లేదు.
ప్రస్తుతం బీఆర్ఎస్ కు ఉన్న ఎమ్మెల్యేల సంఖ్య 39. మ్యాజిక్ ఫిగర్ రావాలంటే.. ఇంకా 21 మంది ఎమ్మెల్యేలు కావాలి. అందులో ఏడుగురు ఎంఐఎం ఎమ్మెల్యేలు ఉన్నారు. 21 లో 7 తీసేస్తే.. ఇంకా కావాల్సింది 14 మంది ఎమ్మెల్యేలు మాత్రమే. బీజేపీ చెందిన 8 మంది ఎమ్మెల్యేలు, ఒక్క సీపీఐ.. మొత్తం 9 మందిని తమ వైపు లాక్కున్నా ఇంకా ఐదుగురు ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ కు కావాలి. ఆ ఐదుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అయితే.. అటు కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోతుంది.. ఇటు బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే మ్యాజిక్ ఫిగర్ ను సాధిస్తుంది. కొంపదీసి బీఆర్ఎస్ పెద్దలు ఇలాంటి ప్లాన్స్ ఏమైనా వేస్తున్నారా అనే సందేహం కలుగుతోంది కడియం శ్రీహరి మాటలు వింటే. చూద్దాం ఏం జరుగుతుందో.
EMI : దేశంలో ఈఎంఐలపై స్మార్ట్ఫోన్లు కొనుగోలు చేసే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ముఖ్యంగా ఖరీదైన మొబైల్ ఫోన్లను…
Peddi Movie : మెగా పవర్ స్టార్ Ram Charan నటిస్తున్న భారీ చిత్రం Peddi పై రోజురోజుకూ అంచనాలు…
TDP NDA : దేశ రాజకీయాల్లో ఎన్డీఏ కూటమి సమీకరణాలు వేగంగా మారుతున్న వేళ తెలుగు దేశం పార్టీకి మరో…
Bhuma Mounika : టాలీవుడ్ నటుడు Manchu Manoj తాజాగా చేసిన వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీశాయి.…
తెలంగాణ ప్రభుత్వం కొత్త పెన్షన్ల మంజూరుపై కీలక అడుగులు వేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది ఎదురుచూస్తున్న కొత్త పెన్షన్ పథకాల…
Heatwave : దేశవ్యాప్తంగా ఎండల తీవ్రత రోజు రోజుకు పెరుగుతోంది. ముఖ్యంగా ఉత్తర భారతదేశంతో పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో…
వేసవి కాలం మొదలైతే శరీరాన్ని చల్లగా ఉంచే ఆహారాలు, పానీయాలపై అందరి దృష్టి పడుతుంది. అధిక ఉష్ణోగ్రతల వల్ల డీహైడ్రేషన్,…
Personality Fruit Test : ప్రతి వ్యక్తికి ఒక ప్రత్యేకమైన ఇష్టమైన పండు ఉంటుంది. కొందరికి మామిడి అంటే ప్రాణం,…
Summer Breakfast : వేసవి కాలంలో తేలికగా జీర్ణమయ్యే, ఆరోగ్యానికి మేలు చేసే అల్పాహారం తీసుకోవడం చాలా ముఖ్యం. అలాంటి…
Andhra Pradesh : ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లాలో చోటుచేసుకున్న ఓ ఘటన ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. వివాహితను ప్రేమ…
హైదరాబాద్ ప్రజలకు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) మరో గుడ్ న్యూస్ చెప్పింది. ఇకపై చిన్న చిన్న మున్సిపల్…
Husbands Wife : ప్రేమ అంటే కేవలం కలిసి జీవించడం మాత్రమే కాదు.. మరణం తర్వాత కూడా ఆ బంధాన్ని…
This website uses cookies.