kcr shocking comments on revanth reddy
KCR VS Revanth Reddy : తెలంగాణలో ఎన్నికల సమరం మొదలైంది. ఎన్నికలకు ఇంకా నెల రోజుల సమయం మాత్రమే ఉంది. అందుకే ప్రధాన పార్టీలన్నీ ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నాయి. సీఎం కేసీఆర్ రంగంలోకి దిగి బీఆర్ఎస్ పార్టీ గెలుపు కోసం అన్ని నియోజకవర్గాల్లో బహిరంగ సభలు నిర్వహిస్తున్నారు. తాజాగా సీఎం కేసీఆర్ ఓ బహిరంగ సభలో మాట్లాడుతూ.. కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డిపై విరుచుకుపడ్డారు. విషయం అంతా మీకు తెలుసు. మీకు తెలియకుండా ఏం లేదు. ఎన్నికల్లో ఏం జరుగుతదో కూడా మీకు తెలుసు. మాకంటే ఎక్కువ మీకే తెలుసు. మీరు చూస్తున్నారు కదా. 24 ఏళ్లు అవుతోంది. నేను తెలంగాణ కోసం బయలుదేరి. 24 ఏళ్ల నాడు ఎవ్వడూ లేడు. ఎవ్వడూ ఏ చెట్టు కింద ఉన్నడో.. ఎవడు ఎక్కడో ఉన్నడో అందరికీ తెలుసు. ఇవాళ లేసినోడు.. లేవనోడు వచ్చి కేసీఆర్ నీకు దమ్మున్నదా? కొడంగల్ కు రా అని ఒకడు. నువ్వు గాంధీ బొమ్మ కాడికి రా అని ఇంకొకడు. ఇవా సవాళ్లు విసిరేది. ఇవేనా? ఇది రాజకీయం అయితదా? ఈ రాజకీయం అనుకోవచ్చునా అంటూ కేసీఆర్ ప్రశ్నించారు.
దయచేసి నేను ఒక్కటే మాట మనవి చేస్తున్నా. ఎన్నికలు వస్తుంటాయి.. పోతుంటాయి. ఎన్నికల్లో ప్రజలు గెలిచే పరిస్థితి రావాలి. ఎప్పుడైతే ప్రజలు గెలిచే పరిస్థితి వస్తుందో అప్పుడే బతుకులు బాగుపడతాయి. ఇవాళ నేను కొత్తగా మాట్లాడుతలేను.. తెలంగాణలో.. అచ్చంపేటలో. ఇంతకుముందు చాలా సార్లు వచ్చాను నేను. ఆరోజు తెలంగాణ రాకముందు ఎవడెవడో.. ఎక్కడెక్కడ ఉన్నడో.. ఎవని బూట్లు తూడ్చిండో.. ఎవడు ఏ పని మీద ఉండెనో.. ఇవాళ మాట్లాడే సిపాయిలు అందరూ ఎక్కడ ఉందురో. ఒక పక్షిలాగ నేను ఒక్కడినే ఏవిధంగా ఊరు ఊరు, వాడ వాడ తిరిగి తిరిగి యావత్ తెలంగాణను ఒక బ్రహ్మాండమైన ఉద్యమ కెరటంగా తయారు చేస్తే తెలంగాణ వచ్చి బతికిపోయినం. గడ్డకు పడ్డం. ఇప్పుడు నేను వచ్చేటప్పుడు డిండి ప్రాజెక్ట్ నుంచే వచ్చాను. అక్కడి నుంచి చాలా దూరం దుందుబి నది కనిపిస్తోంది. బాలరాజు కట్టించిన చెక్ డ్యామ్స్ కూడా కనిపిస్తున్నాయి. అంతకుముందు దుందుబిలా దుమ్ము లేసిపోయింది. వాగు ఎండి పాయెరా.. పెద్ద పేగు ఎండిపాయెరా అని గోరటి వెంకన్న పాట రాసి ఏడ్చిండు. అటువంటి జిల్లా మన పాలమూరు జిల్లా. ఎంత బాధ. పాలమూరులో గంజి కేంద్రాలు పెట్టినారు. అంబలి కేంద్రాలు పెట్టారు. గొంతులెండి 5 కిమీలు బిందెలు పట్టుకొని నీళ్లు మోసిననాడు, కరెంట్ కోసం అర్ధరాత్రి పూట పోయి పాములు, తేళ్లు కరిచి చచ్చిపోయిన ఘటనలు, బొంబయి బస్సు ఎక్కి బొంబయి పోయిన నాడు ఈ కొడుకులు ఒక్కరైనా ఉన్నడా? ఎవడైనా వచ్చిండా? రేపు ఉంటరా? అని కేసీఆర్ ప్రశ్నించారు.
ఎన్నికలు రాగానే ఆగమాగం పిచ్చి పిచ్చి కావద్దు. ఎవ్వరు పడితే వాడు వత్తడు. ఏది పడితే అది చెబుతారు. నేను చెప్పే మాటలు మీరందరూ వినాలి. మీకు దండం పెట్టి చెబుతున్నా. తెలంగాణను కాపాడుకోవాలి కాబట్టి నా వంతు పని నేను చేసిన. ఒక పోరాటం నేను చేసినా. ఇప్పుడు మీరు చేయాలి పోరాటం. తెలంగాణ కోసం నేను వెళ్లిన నాడు.. ఎవ్వడికి కూడా నమ్మకం లేదు. ఎక్కడ వత్తది తెలంగాణ. వీడు ఒకడు మోపయిండు అన్నరు. పిడికెడు మందిమి.. పోరాటంలో నిజాయితి ఉంది కాబట్టి.. దమ్ము ఉంది కాబట్టి.. ధైర్యం ఉంది కాబట్టి.. పోతు పోతు తెలంగాణ ఒక ఉప్పెనలా, సముద్రంలా తయారైతే విధి లేక ఇచ్చారు.. అంటూ కేసీఆర్ చెప్పుకొచ్చారు.
Health Tips | బొప్పాయి మంచి పోషకాలతో నిండి ఉండే పండు. ఇందులో విటమిన్లు ఎ, సి, ఇ ఎక్కువగా…
Banana peel Face Pack | మెరిసే చర్మం ఎవరికైనా ఇష్టమే! అందుకే మార్కెట్లో లభించే విభిన్నమైన బ్యూటీ క్రీములకు ఎంతో…
September | సెప్టెంబర్లో శుక్రుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించనున్న నేపథ్యంలో, కొన్ని రాశుల వారికి అదృష్టదాయక సమయం ప్రారంభం కాబోతుంది. ముఖ్యంగా…
Flipkart Jobs: పండుగ సీజన్ దగ్గరపడుతుండటంతో ఈ-కామర్స్ రంగంలో జోరు పెరిగింది. ముఖ్యంగా ఫ్లిప్కార్ట్ తన బిగ్ బిలియన్ డేస్…
Free AI Course : ఇప్పటి కాలంలో విద్య కేవలం పుస్తకాలకే పరిమితం కాకుండా, టెక్నాలజీపై ఆధారపడుతోంది. ముఖ్యంగా ఆర్టిఫిషియల్…
Good News from the Central Government for the Common Man : దేశంలో పండుగల సీజన్ సమీపిస్తున్న…
Wheat Distribution in Ration Card Holders : ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం పేదల సంక్షేమంపై దృష్టి సారించి, కొత్త…
CPI Narayana Controversial Comments On Pawan Kalyan : సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ మరోసారి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ…
This website uses cookies.