
kcr shocking comments on revanth reddy
KCR VS Revanth Reddy : తెలంగాణలో ఎన్నికల సమరం మొదలైంది. ఎన్నికలకు ఇంకా నెల రోజుల సమయం మాత్రమే ఉంది. అందుకే ప్రధాన పార్టీలన్నీ ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నాయి. సీఎం కేసీఆర్ రంగంలోకి దిగి బీఆర్ఎస్ పార్టీ గెలుపు కోసం అన్ని నియోజకవర్గాల్లో బహిరంగ సభలు నిర్వహిస్తున్నారు. తాజాగా సీఎం కేసీఆర్ ఓ బహిరంగ సభలో మాట్లాడుతూ.. కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డిపై విరుచుకుపడ్డారు. విషయం అంతా మీకు తెలుసు. మీకు తెలియకుండా ఏం లేదు. ఎన్నికల్లో ఏం జరుగుతదో కూడా మీకు తెలుసు. మాకంటే ఎక్కువ మీకే తెలుసు. మీరు చూస్తున్నారు కదా. 24 ఏళ్లు అవుతోంది. నేను తెలంగాణ కోసం బయలుదేరి. 24 ఏళ్ల నాడు ఎవ్వడూ లేడు. ఎవ్వడూ ఏ చెట్టు కింద ఉన్నడో.. ఎవడు ఎక్కడో ఉన్నడో అందరికీ తెలుసు. ఇవాళ లేసినోడు.. లేవనోడు వచ్చి కేసీఆర్ నీకు దమ్మున్నదా? కొడంగల్ కు రా అని ఒకడు. నువ్వు గాంధీ బొమ్మ కాడికి రా అని ఇంకొకడు. ఇవా సవాళ్లు విసిరేది. ఇవేనా? ఇది రాజకీయం అయితదా? ఈ రాజకీయం అనుకోవచ్చునా అంటూ కేసీఆర్ ప్రశ్నించారు.
దయచేసి నేను ఒక్కటే మాట మనవి చేస్తున్నా. ఎన్నికలు వస్తుంటాయి.. పోతుంటాయి. ఎన్నికల్లో ప్రజలు గెలిచే పరిస్థితి రావాలి. ఎప్పుడైతే ప్రజలు గెలిచే పరిస్థితి వస్తుందో అప్పుడే బతుకులు బాగుపడతాయి. ఇవాళ నేను కొత్తగా మాట్లాడుతలేను.. తెలంగాణలో.. అచ్చంపేటలో. ఇంతకుముందు చాలా సార్లు వచ్చాను నేను. ఆరోజు తెలంగాణ రాకముందు ఎవడెవడో.. ఎక్కడెక్కడ ఉన్నడో.. ఎవని బూట్లు తూడ్చిండో.. ఎవడు ఏ పని మీద ఉండెనో.. ఇవాళ మాట్లాడే సిపాయిలు అందరూ ఎక్కడ ఉందురో. ఒక పక్షిలాగ నేను ఒక్కడినే ఏవిధంగా ఊరు ఊరు, వాడ వాడ తిరిగి తిరిగి యావత్ తెలంగాణను ఒక బ్రహ్మాండమైన ఉద్యమ కెరటంగా తయారు చేస్తే తెలంగాణ వచ్చి బతికిపోయినం. గడ్డకు పడ్డం. ఇప్పుడు నేను వచ్చేటప్పుడు డిండి ప్రాజెక్ట్ నుంచే వచ్చాను. అక్కడి నుంచి చాలా దూరం దుందుబి నది కనిపిస్తోంది. బాలరాజు కట్టించిన చెక్ డ్యామ్స్ కూడా కనిపిస్తున్నాయి. అంతకుముందు దుందుబిలా దుమ్ము లేసిపోయింది. వాగు ఎండి పాయెరా.. పెద్ద పేగు ఎండిపాయెరా అని గోరటి వెంకన్న పాట రాసి ఏడ్చిండు. అటువంటి జిల్లా మన పాలమూరు జిల్లా. ఎంత బాధ. పాలమూరులో గంజి కేంద్రాలు పెట్టినారు. అంబలి కేంద్రాలు పెట్టారు. గొంతులెండి 5 కిమీలు బిందెలు పట్టుకొని నీళ్లు మోసిననాడు, కరెంట్ కోసం అర్ధరాత్రి పూట పోయి పాములు, తేళ్లు కరిచి చచ్చిపోయిన ఘటనలు, బొంబయి బస్సు ఎక్కి బొంబయి పోయిన నాడు ఈ కొడుకులు ఒక్కరైనా ఉన్నడా? ఎవడైనా వచ్చిండా? రేపు ఉంటరా? అని కేసీఆర్ ప్రశ్నించారు.
ఎన్నికలు రాగానే ఆగమాగం పిచ్చి పిచ్చి కావద్దు. ఎవ్వరు పడితే వాడు వత్తడు. ఏది పడితే అది చెబుతారు. నేను చెప్పే మాటలు మీరందరూ వినాలి. మీకు దండం పెట్టి చెబుతున్నా. తెలంగాణను కాపాడుకోవాలి కాబట్టి నా వంతు పని నేను చేసిన. ఒక పోరాటం నేను చేసినా. ఇప్పుడు మీరు చేయాలి పోరాటం. తెలంగాణ కోసం నేను వెళ్లిన నాడు.. ఎవ్వడికి కూడా నమ్మకం లేదు. ఎక్కడ వత్తది తెలంగాణ. వీడు ఒకడు మోపయిండు అన్నరు. పిడికెడు మందిమి.. పోరాటంలో నిజాయితి ఉంది కాబట్టి.. దమ్ము ఉంది కాబట్టి.. ధైర్యం ఉంది కాబట్టి.. పోతు పోతు తెలంగాణ ఒక ఉప్పెనలా, సముద్రంలా తయారైతే విధి లేక ఇచ్చారు.. అంటూ కేసీఆర్ చెప్పుకొచ్చారు.
Mobile Recharge : మొబైల్ రీఛార్జ్ ప్లాన్ల విషయంలో సామాన్యులకు ఊరటనిచ్చేలా భారీ మార్పులు రాబోతున్నాయి. ఇప్పటివరకు టెలికాం సంస్థలు…
Central Govt Employees DA Hike : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు Central Government Employees, పెన్షనర్లకు ఇది నిజంగా…
AP and Telangana Weather Report : తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం విచిత్రమైన వాతావరణం నెలకొంది. ఉదయం పూట సూర్యుడు…
Farmer : సాధారణంగా ఏదైనా ప్రభుత్వ ప్రాజెక్టు కోసం భూములు సేకరిస్తే.. రైతులు ఆందోళన చెందుతారు. ప్రభుత్వం ఇచ్చే పరిహారం…
Gold Silver Rate 31st March 2026 : బంగారం కొనుగోలు చేయాలని భావిస్తున్న పసిడి ప్రియులకు మళ్లీ సడెన్…
Karthika Deepam 2 March 31st 2026 Episode : స్టార్ మా ఛానెల్లో అత్యంత విజయవంతంగా, ప్రేక్షకుల ఆదరణ…
Pineapple Juice : వేసవి తాపం నుండి ఉపశమనం పొందడానికి పైనాపిల్ రసం ఒక అద్భుతమైన పానీయం అని చెప్పవచ్చు.…
Potatoes : వేసవి కాలంలో బంగాళదుంపలు తినవచ్చా లేదా అనే సందేహం చాలా మందిలో ఉంటుంది. సాధారణంగా బంగాళదుంపను ఒక…
Tea With Biscuits : చాలామందికి ఉదయం లేదా సాయంత్రం వేళల్లో వేడివేడి టీతో పాటు బిస్కెట్లు తినడం ఒక…
Ys Jagan : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక్కసారిగా ఢిల్లీ పర్యటనలు సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ అయ్యాయి. మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ…
INDIAN ARMY : భారతదేశ రక్షణ రంగం భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని రూపొందించిన పది ఏళ్ల భారీ ప్రణాళిక మన దేశ…
Revanth Reddy : తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం ఒక ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. అదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పనితీరు మరియు…
This website uses cookies.