
tamilnadu govt announces 4 percent da hike
7th Pay Commission : దసరా, దీపావళి పండుగలు వచ్చాయంటే చాలు.. కొన్ని కంపెనీలు తమ ఉద్యోగులకు జీతాలు పెంచుతాయి. బోనస్ లు ప్రకటిస్తాయి. స్వీట్ల డబ్బాలు పంచుతాయి. ఇలా.. కంపెనీ లాభాలకు అనుగుణంగా ఆ కంపెనీలో పని చేసే ఉద్యోగులకు బోనస్ లను అందిస్తుంటాయి. దీపావళి అనేది అందరూ ఎంతో సంతోషంగా జరుపుకునే పండుగ కావడంతో ఆ పండుగ నాడు తమ ఉద్యోగులు సంతోషంగా ఉండాలనే ఉద్దేశంతో బోనస్ లను ప్రకటిస్తుంటాయి. ప్రభుత్వ ఉద్యోగులకు కూడా దీపావళి దమాకా ప్రకటిస్తూ ఉంటారు. తాజాగా తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం.. ఆ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్ర ఉద్యోగులకు 4 శాతం డీఏ పెంచుతున్నట్టు ప్రకటించింది. ఇప్పటికే తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు 42 శాతంగా డీఏ ఉంది. దాన్ని 42 శాతం నుంచి 46 శాతానికి చేసింది. దీపావళి సందర్భంగా 4 శాతం డీఏను పెంచడంతో ఆ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు భారీగా పెరగనున్నాయి.
పెరిగిన డీఏ కూడా జులై 1 నుంచి అమలు కావడంతో జులై నుంచి అక్టోబర్ నెల వరకు ఉన్న బకాయిలను కూడా ప్రభుత్వం అక్టోబర్ జీతంలో కలిసి దీపావళి సందర్భంగా వేయనుంది. ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు డీఏ పెంపు వల్ల భారీగా లబ్ధి చేకూరనుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చినట్టుగానే తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు రెండు సార్లు డీఏ పెంచుతుంది. జులైలో పెరగాల్సిన డీఏను దీపావళి కానుకగా ఇప్పుడు పెంచారు. డీఏను 4 శాతం పెంచుతున్నామని సీఎం ఎంకే స్టాలిన్ ప్రకటించడంతో ప్రభుత్వ ఉద్యోగులు సంబురాలు చేసుకుంటున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 16 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు ఉన్నారు. ప్రతి సంవత్సరం డీఏ పెంపు వల్ల రాష్ట్ర ప్రభుత్వ ఖజానాపై రూ.2546 కోట్ల అదనపు భారం పడుతుంది.
దసరా సందర్భంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గత వారమే కేంద్రం 4 శాతం డీఏ పెంచింది. వాళ్లకు కూడా 42 శాతంగా ఉన్న డీఏ 46 శాతానికి పెరిగింది. పెంచిన డీఏను జులై 1 నుంచి అమలులోకి తీసుకొచ్చారు. ఇక.. దసరా సందర్భంగా రైల్వే శాఖ కూడా తమ ఉద్యోగులకు 78 రోజుల బోనస్ ను ప్రకటించింది.
Bottle Gourd Juice : ప్రస్తుతం బరువు తగ్గడం, ముఖ్యంగా పొట్ట చుట్టూ పేరుకుపోయే కొవ్వును తగ్గించుకోవడం కోసం చాలామంది…
Petrol : భారత్లో పెట్రోల్ వినియోగంపై తాజాగా వెలువడిన గణాంకాలు ఆసక్తికర చర్చకు దారితీశాయి. దేశంలో ఒక్కో వ్యక్తి ప్రాతిపదికన…
PM Modi : ప్రధానమంత్రి Narendra Modi ఇటీవల చేసిన “స్మార్ట్ స్పెండింగ్” పిలుపు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. బంగారం…
Farmers Good News : కేంద్ర ప్రభుత్వం రైతులు మరియు మౌలిక సదుపాయాల అభివృద్ధిపై కీలక నిర్ణయాలు తీసుకుంది. తాజాగా…
Donald Trump : అమెరికా మాజీ అధ్యక్షుడు Donald Trump చైనా పర్యటనకు సంబంధించిన వార్తలు ప్రస్తుతం అంతర్జాతీయ రాజకీయాల్లో…
Heart Health : ప్రస్తుతం గుండె జబ్బులు ప్రపంచవ్యాప్తంగా ప్రధాన ఆరోగ్య సమస్యగా మారుతున్నాయి. వయస్సుతో సంబంధం లేకుండా యువతలో…
Working Hours : ప్రస్తుతం చాలా మంది ఉద్యోగులు రోజుకు 8 నుంచి 12 గంటల వరకు కంప్యూటర్ ముందు…
AP Rajya Sabha : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి రాజ్యసభ ఎన్నికల హడావిడి మొదలైంది. రాష్ట్రంలో ఖాళీ కానున్న రాజ్యసభ…
Anushka Shetty : దక్షిణాది సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న Anushka Shetty మరోసారి వార్తల్లో…
Vijay and Trisha Marriage : తమిళ సినీ పరిశ్రమలో గత కొన్ని నెలలుగా హీరో Vijay, హీరోయిన్ Trisha…
Hair : జుట్టు రాలిపోవడం ప్రస్తుతం చాలామందిని వేధిస్తున్న ప్రధాన సమస్యల్లో ఒకటి. ఒత్తిడి, కాలుష్యం, పోషకాహార లోపం, హార్మోన్ల…
Rice Water : ఇటీవల కాలంలో జుట్టు సంరక్షణ కోసం సహజ పద్ధతులపై ఆసక్తి పెరుగుతోంది. ముఖ్యంగా బియ్యం నీటిని…
This website uses cookies.