Komatireddy Rajagopal Reddy : కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తెలుసు కదా. ఆయన ఇటీవలే బీజేపీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి మునుగోడులో ఎమ్మెల్యేగా గెలిచిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆ తర్వాత తన నియోజకవర్గంలో అభివృద్ధి జరగడం లేదని.. అధికార బీఆర్ఎస్ పార్టీ నిధులు కేటాయించడం లేదని.. కాంగ్రెస్ లో కూడా హైకమాండ్ అస్సలు పట్టించుకోవడం లేదని.. తన ఎమ్మెల్యే పదవికి, కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. వెంటనే అక్కడ ఉపఎన్నిక రావడంతో బీజేపీ నుంచి రాజగోపాల్ రెడ్డికి టికెట్ లభించింది. కానీ.. ఆ ఉపఎన్నికల్లో ఓడిపోయారు. ఆ తర్వాత 2023 ఎన్నికల ముందు అంటే ఇప్పుడు మళ్లీ కాంగ్రెస్ పార్టీలో చేరారు. బీజేపీ నుంచి తనకు స్పష్టమైన టికెట్ హామీ రాకపోవడంతో పాటు కాంగ్రెస్ పార్టీకి గాలి వీస్తుండటంతో కాంగ్రెస్ పార్టీలో చేరారు. దీంతో కాంగ్రెస్ హైకమాండ్.. రాజగోపాల్ రెడ్డికి మళ్లీ మునుగోడు నుంచే టికెట్ ప్రకటించింది.
దీంతో మునుగోడు నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారాన్ని రాజగోపాల్ రెడ్డి ప్రారంభించారు. గత కొన్ని రోజుల నుంచి మునుగోడులోనే మకాం వేశారు. నియోజకవర్గ స్థాయి నేతలు కూడా మునుగోడులోనే ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ తరుపున రోజూ నియోజకవర్గం అంతా తిరుగుతూ ప్రచారం చేస్తున్నారు రాజగోపాల్ రెడ్డి. ఇవాళ కూడా ప్రచారంలో మునిగిపోయారు. అయితే.. తాజాగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో పాల్గొన్న రాజగోపాల్ రెడ్డి నామినేషన్ వేయడమే మరిచిపోయారు. నామినేషన్లకు చివరి తేదీ నవంబర్ 10 వరకే. అంటే రేపే చివరి తేదీ. రేపటి లోగా నామినేషన్స్ వేయాల్సి ఉంది. అందుకే ఇవాళ నామినేషన్స్ వేస్తే ఏదైనా తప్పులు ఉన్నా రేపు చూసుకోవచ్చు. అయితే.. ర్యాలీ హడావుడిలో పడి రాజగోపాల్ రెడ్డి నామినేషన్స్ వేసే విషయమే మరిచిపోయారు. ఆఖరి నిమిషంలో నామినేషన్ గురించి గుర్తుకు రావడంతో వెంటనే నామినేషన్ వేసే ఎన్నికల సంఘం ఆఫీసుకు పరిగెత్తుకుంటూ వెళ్లారు.
రాజగోపాల్ రెడ్డి నామినేషన్ కోసం ఆఫీసుకు పరిగెత్తుతుంటే ఆయన వెనుక బాడీగార్డ్స్, కాంగ్రెస్ నాయకులు కూడా పరిగెత్తారు. దానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియోను చూసిన నెటిజన్లు తెగ నవ్వుకుంటున్నారు. వార్నీ.. నామినేషన్ విషయమే మరిచితివా? ఇంకా నయం.. రేపే లాస్ట్ డేట్ అనే విషయం కూడా మరిచిపోయి ఉంటారు సారు.. అంటూ ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు.
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
CISF Fireman Recruitment : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్మెన్ల నియామక…
Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ…
7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్నెస్ అలవెన్స్ (డీఏ)ని ప్రభుత్వం పెంచబోతోంది. ప్రభుత్వం త్వరలో…
Balineni Srinivas Reddy : గత కొద్ది రోజులుగా బాలినేని వైసీపీని వీడనున్నట్టు అనేక ప్రచారాలు జరిగాయి. ఎట్టకేలకి అది…
Jamili Elections : దేశవ్యాప్తంగా ఒకేసారి పార్లమెంట్ , అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేలా జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్ ఆమోదం…
Naga Manikanta : బుల్లితెర ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తున్న బిగ్ బాస్ ఇప్పుడు తెలుగులో సీజన్ 8 జరుపుకుంటుంది.తాజా సీజన్లోని…
This website uses cookies.