Kutami : కొద్ది రోజుల క్రితం వరదలు విజయవాడని అల్లకల్లోలం చేసిన విషయం మనకు తెలిసిందే. అప్పుడు ప్రభుత్వం సాయం విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పే మాటలకు ఆచరణలో జరిగే దానికి పొంతన కుదరడం లేదు.చివరి బాధితుడి వరకు వరద సాయం అందించాల్సిందేనని ముఖ్యమంత్రి పదేపదే చెబుతున్నా అధికారులు ఎన్యుమరేషన్లో చేసిన పొరపాట్లను ఇప్పటికీ సరిదిద్దుకోలేక పరిహారం చెల్లింపులో విఫలం అవుతున్నారు. వరద సాయం అంచనాలు రూపొందించడంలో అధికారుల నిర్లక్ష్యానికి మొత్తంగా కూటమి ప్రభుత్వం మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోంది. వరద సాయం విడుదలై వారమవుతున్నా ఇప్పటికీ బాధితులకు పరిహారం జమ కాకపోవడంతో సచివాలయాల చుట్టూ తిరుగుతున్నారు.
97 శాతం మందికి నగదు బదిలీ చేసినట్లు ప్రభుత్వం చెబుతున్నా.. గ్రౌండ్ రిపోర్ట్ పూర్తి విరుద్ధంగా ఉందన్నారు. ఎన్యుమరేషన్లో అవకతవకలు జరిగినట్లు ఆధారాలతో సహా అధికారులకు సమర్పించినా ఫలితం లేదన్నారు. టీడీపీ నేతలు సచివాలయాలలో కూర్చొని అర్హులను ఎంపిక చేయటం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. 22,185 మందికి నేటికీ కనీస సాయం అందలేదని చెప్పారు. పరిపాలన వ్యవస్థ సక్రమంగా లేకపోవడం, అధికారులలో చిత్తశుద్ధి, పర్యవేక్షణ లోపించటంతో నెల రోజులు గడిచినా బాధితులు నానా ఇబ్బందులు పడుతున్నారని ధ్వజమెత్తారు. వరద హెచ్చరికలు జారీచేయటంతో పాటు బాధితులకు సాయం అందించటంలోనూ ఈ ప్రభుత్వం అట్టర్ ఫెయిల్ అయిందని ఆరోపించారు. కేంద్రానికి రూ. 7 వేల కోట్ల నివేదిక పంపి.. చివరకు అరకొర సాయంగా రూ. 600 కోట్లు విదిల్చారని మల్లాది విష్ణు నిప్పులు చెరిగారు.
బ్యాంక్ అంకౌట్ తో ఆధార్ లింక్ అవ్వకపోవడం, ఆధార్ అకౌంట్ మ్యాచ్ అవ్వకపోవడం, అకౌంట్ యాక్టివ్ గా లేకపోవడం, అకౌంట్ క్లోజ్ అవ్వడం, అకౌంట్ తప్పుగా నమోదు అవ్వడం, ఇతర వివరాలు సరిగా లేకపోవడంతో పరిహారం సొమ్ము లబ్ధిదారుల అకౌంట్లలో జమకాలేదని అధికారులు వివరించారు. ఒకప్పుడు వాలంటీర్ వ్యవస్థ ఉండడంతో ఏ విషయాన్నైన వారిని అడగడానికి ఉండేది. ఇప్పుడు ఎవరిని అడగాలో అర్ధం కావడం లేదు అని లబోదిబోమంటున్నారు. పరిపాలన వ్యవస్థ సక్రమంగా లేకపోవడం, అధికారులలో చిత్తశుద్ధి, పర్యవేక్షణ లోపించటంతో నెల రోజులు గడిచినా బాధితులు నానా ఇబ్బందులు పడుతున్నారని వైసీపీ నాయకులు ధ్వజమెత్తారు
Breakfast : మన రోజు మొదలు బాగుంటే మన రోజంతా కూడా ఎంతో మంచిగా సాగుతుంది అని అంటారు. కానీ ప్రస్తుతం…
Roja : తిరుమల లడ్డూ వ్యవహారంతో ఏపీ రాజకీయం మరింత వేడెక్కుతుంది. లడ్డూ ప్రసాదం కల్తీ జరిగిందని చంద్రబాబు వ్యాఖ్యలు…
Telangana Cabinet : తెలంగాణ లో కొత్త ప్రభుత్వం కొలువు దీరి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన…
Chandrababu : దేశవ్యాప్తంగా సంచలనం రేపిన తిరుపతి లడ్డూ వ్యవహారం ఎంత సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే తిరుమల…
IBPS RRB : ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (IBPS) RRB క్లర్క్ పరీక్షకు సంబంధించిన ప్రిలిమ్స్ స్కోర్కార్డ్ను…
UCEED 2025 : అండర్ గ్రాడ్యుయేట్ కామన్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఫర్ డిజైన్ (UCEED) 2025 దరఖాస్తు ప్రక్రియ ఈ…
Good News : తెలంగాణ ప్రభుత్వం సెప్టెంబర్ 30 కల్లా అర్హులైన రైతులందరికీ రుణమాఫీ చేస్తామని చెప్పింది. అంతేకాకుండా రూ.2…
Zodiac Signs : జ్యోతిష శాస్త్రంలో అక్టోబర్ మాసానికి ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. అయితే ఈ మాసంలో గ్రహాల గమనం…
This website uses cookies.