
Minister Roja : తెలంగాణలో తరిమి కొడితే ఆంధ్రాకి వచ్చింది.. వైఎస్ షర్మిలపై రోజా కామెంట్స్..!
Minister Roja : ఏపీ రాజకీయాలలో వైయస్ షర్మిల కేంద్రంగా మారారు. ఏపీ కాంగ్రెస్ పీసీసీ అధ్యక్షురాలుగా బాధ్యతలు స్వీకరించిన వైఎస్ షర్మిల వైయస్ జగన్ పై, చంద్రబాబు నాయుడు పై తీవ్ర ఆరోపణలు చేస్తూ వస్తున్నారు. తన అన్న వైయస్ జగన్మోహన్ రెడ్డి పై కూడా వైయస్ షర్మిల దూకుడుగా వ్యవహరిస్తున్నారు. వైఎస్ఆర్ సీపీ నాయకులు వైయస్ షర్మిల చేస్తున్న వ్యాఖ్యలను తిప్పి కొడుతున్నారు. ఇక తాజాగా మంత్రి రోజా వైయస్ షర్మిలపై స్పందించారు. విజయవాడలో జరిగిన ఒక కార్యక్రమంలో రోజా మాట్లాడుతూ.. ఎవరో వచ్చి ఏదో చెబితే నమ్మడానికి జనం పిచ్చోళ్ళు కాదన్నారు. తమతో ఉంటున్నది ఎవరో, తమ సమస్యల కోసం పోరాడింది ఎవరో, అధికారంలోకి వచ్చాక పరిష్కరించింది ఎవరో ప్రజలకు తెలుసని, ఇచ్చిన హామీలు నెరవేర్చింది వైయస్ జగన్మోహన్ రెడ్డి అని రోజా పేర్కొన్నారు. ఇక్కడే పుట్టి, ఇక్కడే పెరిగి, ఇక్కడే ఓటు, ఇక్కడే ఇల్లు కట్టుకొని, ప్రజల మధ్య ఉంటున్న ప్రజానాయకుడు జగనన్న అని ఆమె కొనియాడారు.
రాజన్న రాజ్యం తెస్తానని పావురాల గుట్టలో జగనన్న తన తండ్రికి ప్రామిస్ చేశారని, ఎన్ని కష్టాలు ఎదురైనా కేసులు పెట్టి జైల్లో పెట్టిన ఏరోజు తగ్గలేదని, ఏ పార్టీతోను పొత్తు పెట్టుకోలేదని, ఏ పార్టీలో విలీనం చేయలేదని, అది నాయకుడి లక్షణం అని వైఎస్ జగన్మోహన్ రెడ్డిని రోజా కొనియాడారు. పక్క రాష్ట్రంలో పార్టీ పెట్టి అక్కడ ప్రజలు ఛీ కొడితే ఇక్కడికి వచ్చి కాంగ్రెస్ లో చేరి మాట్లాడితే ప్రజలు నమ్మరు అని వైయస్ షర్మిలపై రోజా ఘాటు వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ కు ఏపీలో ఓటు అడిగే అర్హత లేదని, బాగున్న రాష్ట్రాన్ని ముక్కలుగా చేసినది కాంగ్రెస్ పార్టీ అని, రెండుసార్లు కాంగ్రెస్ అధికారంలోకి తెచ్చిన వైయస్సార్ పేరును ఆయన చనిపోయాక ఎఫ్ఐఆర్లో పెట్టి అవమానించిన పార్టీ కాంగ్రెస్ అని, వైయస్సార్ లేని సమయం చూసి ఆయన కుటుంబాన్ని కాంగ్రెస్ రోడ్డుకి ఈడ్చిందని, ఆ పార్టీలోకి వచ్చి ఎవరు విమర్శలు చేసిన జీరోలే అవుతారని, సామాన్య కార్యకర్తలు కూడా తన కుటుంబ సభ్యుడిగా చూసే వ్యక్తి సీఎం వైఎస్ జగన్ అని రోజా అన్నారు.
ఇష్టానుసారంగా మాట్లాడే నోర్లకు 2024 సమాధానం చెబుతుందని మంత్రి రోజా పేర్కొన్నారు. దీంతో మంత్రి రోజా చేసిన వ్యాఖ్యలకు వైయస్ షర్మిల ఎలా స్పందిస్తారో మరి. వైయస్ షర్మిల కూడా మరీ దూకుడుతనంగా వ్యవహరిస్తున్నారు. ఆమె చేసే అతివలన వైయస్ జగన్ కి మేలు జరుగుతుందని భావిస్తున్నారు. ప్రతిపక్షాలన్నీ కుమ్మక్కై వైయస్ జగన్ పై వార్ ని ప్రకటించాయి. ఇక ప్రజలు ఎవరికి పట్టం కడతారో కానీ అధికార ప్రతిపక్ష పార్టీలు ఒకరిపై ఒకరు విమర్శలు చేస్తూ పోతున్నారు.
Yamadonga : తెలుగు సినీ పరిశ్రమలో దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కించిన అత్యంత విజయవంతమైన చిత్రాల్లో ‘యమదొంగ’ ఒకటి. యంగ్…
Police Jobs : తెలంగాణలో పోలీసు ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వేలాది మంది నిరుద్యోగ యువతకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త…
Anasuya Jabardasth : తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు స్టార్ యాంకర్గా, వెండితెరపై ప్రతిభావంతమైన నటిగా గుర్తింపు పొందిన అనసూయ భరద్వాజ్…
Team India or Gujarat Titans : భారత క్రికెట్ జట్టు ఆఫ్ఘనిస్తాన్తో ఆడుతున్న ఏకైక టెస్ట్ మ్యాచ్ ప్రారంభమైన…
School Holidays : తెలంగాణ రాష్ట్రంలోని విద్యార్థులకు సంతోషకరమైన వార్త అందింది. ఇప్పటికే వేసవి సెలవులను ఆస్వాదిస్తున్న విద్యార్థులకు ప్రభుత్వం…
Thotakura Vajresh Yadav : మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో అభివృద్ధి కార్యక్రమాలకు మరింత ఊతమివ్వనున్న కీలక కార్యక్రమం ఆదివారం జరగనుంది. మల్కాజిగిరి…
Bandi Ramesh : కూకట్పల్లి నియోజకవర్గ పరిధిలోని బాలాజీ నగర్ డివిజన్లో ఉన్న ఓల్డ్ బాలాజీ నగర్ హౌసింగ్ బోర్డ్…
Talari Ambrose in Peddi : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన ‘పెద్ది’ సినిమా విడుదలైన…
Redmi Turbo 5 : భారత స్మార్ట్ఫోన్ మార్కెట్లో మరో ఆసక్తికరమైన లాంచ్కు రంగం సిద్ధమైంది. బడ్జెట్ ధరలో ప్రీమియం…
Modi Cabinet TDP : దేశ రాజకీయాల్లో మరో కీలక పరిణామానికి రంగం సిద్ధమవుతోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన…
Telangana Students : తెలంగాణ రాష్ట్రంలోని లక్షలాది మంది విద్యార్థులకు సంబంధించిన ఫీజు రీయింబర్స్మెంట్ పథకంలో ప్రభుత్వం కీలక మార్పులకు…
Peddi Movie Day 2 Box Office Collections : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన భారీ…
This website uses cookies.