
#image_title
Nara Lokesh : ఏపీలో ప్రస్తుతం చంద్రబాబు అరెస్ట్ పైనే చర్చ నడుస్తున్న విషయం తెలిసిందే. ఈనేపథ్యంలో చంద్రబాబుకు మద్దతు ఇచ్చే వాళ్లు చాలా తక్కువయ్యారు. అందరూ చంద్రబాబును అరెస్ట్ చేయాల్సిందే అని బద్దలు కొట్టారు కానీ.. టీడీపీకి అండగా పవన్ కళ్యాణ్ వచ్చారు. పవన్ కళ్యాణ్.. చంద్రబాబు అరెస్ట్ ను ఖండించారు. అంతే కాదు.. టీడీపీకి అండగా ఉంటానని, జనసేన పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. అంతే కాదు.. రాజమండ్రి జైలులో చంద్రబాబును చూడటానికి వెళ్లిన పవన్ కళ్యాణ్.. వచ్చే ఎన్నికల్లో జనసేన, టీడీపీ రెండు పార్టీలు కలిసే పోటీ చేస్తాయని ప్రకటించారు. దీంతో టీడీపీ నేతల్లో కాస్తో కూస్తో ఉత్సాహం వచ్చినంత పని అయింది. ఎందుకంటే.. ఇప్పటికే తమ అధినేత చంద్రబాబు జైలులో ఉండటంతో నారా లోకేష్ ఒక్కరి మీదనే పార్టీ నిర్వహణ బాధ్యత పడటంతో పార్టీని ఆయన ఒక్కరే ఎలా ముందుకు తీసుకెళ్తారో అని అందరూ టెన్షన్ పడ్డారు. కానీ.. చంద్రబాబు లేకపోయినా.. పార్టీకి అండగా ఉంటానని చెప్పడమే కాదు.. టీడీపీకి అండగా పవన్ కళ్యాణ్ నిలబడ్డారు.
ఈసందర్భంగా నారా లోకేష్ మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ 2014 లో టీడీపీ, బీజేపీకి మద్దతు ఇచ్చారు. అప్పుడు 2014 లో ప్రభుత్వం ఏర్పడింది అని చెప్పారు. అలాగే.. ఇప్పుడు కూడా మళ్లీ వచ్చే ఎన్నికలకు జనసేన పార్టీ టీడీపీకి మద్దతు ఇవ్వడానికి ముందుకు వచ్చారని స్పష్టం చేశారు. గత నాలుగున్నర సంవత్సరాలుగా ఆంధ్ర రాష్ట్రంలో సామాజిక అన్యాయం జరుగుతోంది. బీసీ, ఎస్సీ, ఎస్టీలు, మైనార్టీల పైన పెద్ద ఎత్తున దాడులు జరుగుతున్నాయి. బీసీలను తీసుకుంటే పవన్ ఇప్పుడే చెప్పినట్టు అమర్ నాథ్ గౌడ్ అనే కుర్రాడు.. తన అక్కను వేధించవద్దు అన్నందుకు వైసీపీ నేత కొడుకు అతడిని చంపేశాడు. ఆ అబ్బాయి ఇప్పుడు బెయిల్ మీద బయట తిరుగుతుంటే అతడికి ఊరేగింపు చేస్తున్నారు అని నారా లోకేష్ మండిపడ్డారు. బీసీకి రావాల్సిన అనేక సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో వాళ్లకు రావాల్సిన రిజర్వేషన్లను 10 శాతం కట్ చేసింది ఈ ప్రభుత్వం. ఇక మా దళిత సోదరులకు రావాల్సిన 27 సంక్షేమ కార్యక్రమాలను ఈ ప్రభుత్వం రద్దు చేసింది. మైనార్టీ సోదరులను కూడా వదిలిపెట్టలేదు. ప్రభుత్వం వేధింపుల వల్ల చాలామంది ఆత్మహత్య చేసుకున్నారు అని నారా లోకేష్ మండిపడ్డారు..
ప్రభుత్వ చేతకానితనం వల్ల సాగునీటి ప్రాజెక్టులను గాలికి వదిలేశారు. రైతాంగం తీవ్రంగా నష్టపోతోంది. రైతుల ఆత్మహత్యల్లో భారతదేశంలోనే ఆంధ్ర రాష్ట్రం మూడో స్థానంలో ఉంది. కౌలు రైతుల్లో రెండో స్థానంలో ఉంది. కరెంట్ బిల్లులు, పెట్రోలు ధరలు, డీజిల్ ధరలు, చెత్త పన్ను, ఆర్టీసీ ధరలు, ఇంటి పన్ను అన్నీ పెంచేసి పెద్ద ఎత్తున ప్రజలపైన భారం మోపింది ఈ ప్రభుత్వం. నాలుగున్నర సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు ఆంధ్ర రాష్ట్రానికి ఒక్క పరిశ్రమ రాలేదు. 2,30,000 ప్రభుత్వ పోస్టులను భర్తీ చేస్తా అని ఎన్నికల ముందు హామీ ఇచ్చిన జగన్.. ఒక్క పోస్ట్ భర్తీ చేయలేదు. ప్రజా సమస్యలపై పోరాడిన వాళ్లపై కేసులు పెడుతున్నారు. వేధిస్తున్నారు. ఈ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తొలి రోజు నుంచి ప్రభుత్వాన్ని ప్రశ్నించే ప్రతి ఒక్కరిని వేధిస్తున్నారు అంటూ నారా లోకేశ్ మండిపడ్డారు.
Trump Modi Putin : ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ఇరాన్ అమెరికా యుద్ధ వాతావరణాన్ని గమనిస్తే దీని వెనుక రష్యా…
India : ప్రపంచవ్యాప్తంగా ఇంధన సరఫరా వ్యవస్థలు ఒడిదుడుకులకు లోనవుతున్న తరుణంలో భారతదేశం తన శక్తి అవసరాల కోసం ఒక…
Trisha - Vijay : తమిళ రాజకీయాల్లో ప్రస్తుతం దళపతి విజయ్ పేరు మారుమోగిపోతోంది. తన సొంత పార్టీ తమిళగ…
CM Revanth Reddy : తెలంగాణ ప్రజల ఆరోగ్యం విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకుంటున్న నిర్ణయాలు నిజంగా అభినందనీయం.…
Mobile Recharge : మొబైల్ రీఛార్జ్ ప్లాన్ల విషయంలో సామాన్యులకు ఊరటనిచ్చేలా భారీ మార్పులు రాబోతున్నాయి. ఇప్పటివరకు టెలికాం సంస్థలు…
Central Govt Employees DA Hike : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు Central Government Employees, పెన్షనర్లకు ఇది నిజంగా…
AP and Telangana Weather Report : తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం విచిత్రమైన వాతావరణం నెలకొంది. ఉదయం పూట సూర్యుడు…
Farmer : సాధారణంగా ఏదైనా ప్రభుత్వ ప్రాజెక్టు కోసం భూములు సేకరిస్తే.. రైతులు ఆందోళన చెందుతారు. ప్రభుత్వం ఇచ్చే పరిహారం…
Gold Silver Rate 31st March 2026 : బంగారం కొనుగోలు చేయాలని భావిస్తున్న పసిడి ప్రియులకు మళ్లీ సడెన్…
Karthika Deepam 2 March 31st 2026 Episode : స్టార్ మా ఛానెల్లో అత్యంత విజయవంతంగా, ప్రేక్షకుల ఆదరణ…
Pineapple Juice : వేసవి తాపం నుండి ఉపశమనం పొందడానికి పైనాపిల్ రసం ఒక అద్భుతమైన పానీయం అని చెప్పవచ్చు.…
Potatoes : వేసవి కాలంలో బంగాళదుంపలు తినవచ్చా లేదా అనే సందేహం చాలా మందిలో ఉంటుంది. సాధారణంగా బంగాళదుంపను ఒక…
This website uses cookies.