
#image_title
Nara Lokesh : ఏపీలో ప్రస్తుతం ఎక్కడ చూసినా చంద్రబాబు అరెస్ట్ గురించే చర్చ నడుస్తోంది. చంద్రబాబు అరెస్ట్ అక్రమమని.. కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే సీఎం జగన్ అరెస్ట్ చేయించారని.. నారా లోకేష్ ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా మరోసారి సీఎం జగన్ పై నారా లోకేశ్ రెచ్చిపోయారు. సైకో జగన్ అంటూ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. గత నాలుగున్నర సంవత్సరాలుగా ఈ సైకో జగన్ ఏదైతే అవకూడదని అనుకున్నాడో అదే జరిగింది. అదే.. టీడీపీ, జనసేన పొత్తు. చంద్రబాబును అరెస్ట్ చేసిన మొదటి వారంలోనే ములాకత్ లో చంద్రబాబును కలవాలని ఆనాడు పవన్ కళ్యాణ్ కోరారు. చంద్రబాబును బాలయ్య బాబుతో కలిసి నేను, పవన్ కళ్యాణ్ మన నాయకుడిని కలిశాం. సరిగ్గా 5 నిమిషాల్లో ప్రజల గురించి మనం పోరాడాలి. ప్రజలకు అండగా ఉండాలి. కలిసి పోరాడుదాం అని ఈ ఇద్దరు నాయకులు నిర్ణయం తీసుకొని అక్కడ పొత్తు ప్రకటించారన్నారు నారా లోకేష్.
టీడీపీ, జనసేన మధ్య విభేదాలు సృష్టించేందుకు వైసీపీ నాయకులు, 5 రూపాయల పేటీఎం బ్యాచులు ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేసి గొడవలు సృష్టించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అందుకే.. ఇక్కడున్న కార్యకర్తలకి, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న టీడీపీ నాయకులందరినీ అప్రమత్తంగా ఉండాలని నేను కోరుతున్నాను. ఇప్పటికే జేఏసీ ఏర్పాటు చేసుకున్నాం. ఎల్లుండి మీటింగ్ పెడుతున్నాం. ఆ మీటింగ్ లో ఉమ్మడి కార్యచరణ కూడా ప్రకటిస్తామని ఈ సభా ముఖంగా మీ అందరికీ చెబుతున్నాను. రాష్ట్రాన్ని నాశనం చేసిన జగన్ కు వ్యతిరేకంగా టీడీపీ, జనసేన ఈ రెండు కలిసి పోరాడుతాయి. రైతులను వేధిస్తున్న వైసీపీ ప్రభుత్వం వ్యతిరేకంగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కలిసి పోరాడుతారు. జగన్ పాలనలో దళితులకు, బీసీలకు, మైనార్టీలపై జరుగుతున్న అన్యాయం తెలుసుకొని వీరిద్దరూ కలిసి ముందుకెళ్తారని ఈ సభాముఖంగా మీకు తెలియజేసుకుంటున్నాను అని నారా లోకేష్ అన్నారు.
#image_title
చంద్రబాబుపైన, పవన్ పైన ఈ ఐదు రూపాయల పేటీఎం బ్యాచ్ ఏకంగా వ్యక్తిగత ఆరోపణలు కూడా చేస్తున్నది. మైసీపీ నేతలకు చెబుతున్నా. సైకో జగన్ కు చెబుతున్నా. ఒక్కసారి మీ కుటుంబంలో ఏం జరుగుతుందో బయటపెడితే మీరు మీ మొహం ఎక్కడ పెడతారో ఒక్కసారి ఆలోచించి మరీ చెప్పండి. బాబు గారు మాకు పదే పదే చెప్పారు. వ్యక్తిగతంగా వెళ్లొద్దు. ఏదైనా రాజకీయంగా వెళ్లాలి. రాజకీయంగా పోరాడుదాం అని. ఆయన ఇచ్చిన నినాదంతోనే ఈరోజు మేము సమన్వయం పాటిస్తున్నామని వైసీపీ నాయకులకు, కార్యకర్తలకు నేను హెచ్చరిక జారీ చేస్తున్నా. రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయి. కృష్ణా జలాలలో వాటాలు మనం కోల్పోయాం. వర్షాలు లేక పంటలు ఈరోజు మొత్తం ఎండిపోతున్నాయి. ప్రాజెక్టులన్నీ ఖాళీ అయిపోయాయి. పంటలను కాపాడాల్సిన సైకో జగన్.. ఏకంగా ప్రజల్లోకి వెళ్లకుండా మన కార్యకర్తలపైన, మన నాయకులపైన ఇప్పటికే అనేక దాడులు చేస్తున్నారు. ఇసుక మొత్తం ఒక తమ్ముడికి అప్పగించారు. ఇప్పుడు మద్యం ఇంకో తమ్ముడికి అప్పగిస్తున్నాడు.. అంటూ లోకేష్ ఫైర్ అయ్యారు.
Tirumala Laddu : లియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారి ప్రసాదంగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన శ్రీవారి లడ్డూ…
Peddi Movie Review : ఆర్ఆర్ఆర్’ వంటి గ్లోబల్ బ్లాక్బస్టర్ తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ Ram…
Ram Charan Peddi : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన భారీ పాన్ ఇండియా చిత్రం ‘పెద్ది’…
Peddi Movie ": మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ Ram Charan నటించిన పాన్ ఇండియా చిత్రం ‘పెద్ది’…
Peddi Movie Part 2 : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ Ram Charan హీరోగా, బుచ్చిబాబు సానా…
Peddi Movie Review Live Updates : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ Ram Charan నటించిన భారీ…
Telangana Land Registration : తెలంగాణలో భూములు, ప్లాట్లు, అపార్ట్మెంట్ల కొనుగోలు చేయాలనుకునే వారికి రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన…
Peddi Movie : రామ్ చరణ్ Ram Charan హీరోగా బుచ్చిబాబు సానా Buchi Babu Sana దర్శకత్వంలో రూపొందిన…
Rain : తెలంగాణ రాష్ట్రంలో ఎండల తీవ్రత క్రమంగా తగ్గుముఖం పడుతుండగా, ఇప్పుడు భారీ వర్షాలు, ఉరుములు, మెరుపులతో కూడిన…
Kodali Nani : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎప్పుడూ తనదైన శైలిలో గుర్తింపు పొందిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSRసీపీ) సీనియర్…
Missing Son Case : ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లా ఆదోని మండలంలో చోటుచేసుకున్న ఓ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపుతోంది.…
Peddi Movie Bookmyshow : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ Ram Charan హీరోగా తెరకెక్కుతున్న భారీ పాన్…
This website uses cookies.