Home » News » No Sleep Operation Sindoor Military Strike
News

PM Modi : నిద్ర‌లేని రాత్రి గ‌డిపిన ప్ర‌ధాని మోది.. ఆప‌రేష‌న్‌కి తాను వ‌స్తాన‌ని అన్నాడా..!

Authored By
Ramalingaiah Tandu
The Telugu News | Published on: May 7, 2025, 8:00 pm
Advertisement

PM Modi : ప‌హ‌ల్గాం ఉగ్ర‌దాడి త‌ర్వాత ప్ర‌తి ఒక్క భార‌తీయుడి ర‌క్తం మ‌రిగింది. పాకిస్తాన్‌ పై ప్రతీకారం తీర్చుకోవాల‌ని భార‌తీయులు డిమాండ్ చేశారు. అయితే మంగ‌ళ‌వారం రాత్రి 1.02 నిమిషాల‌కు ఆప‌రేష‌న్ ప్రారంభ‌మైంది. 25 నిమిషాల‌లోనే మిష‌న్ పూర్తి చేశారు. అయితే మిష‌న్ జ‌రుగుతున్న స‌మ‌యంలో మోడీ చేశార‌న్న‌ది ఇప్పుడు అంద‌రి మ‌దిలో మెదులుతుంది.

Advertisement

PM Modi : నిద్ర‌లేని రాత్రి గ‌డిపిన ప్ర‌ధాని మోది.. ఆప‌రేష‌న్‌కి తాను వ‌స్తాన‌ని అన్నాడా..!

PM Modi : మోదీనా, మ‌జాకానా..

మంగ‌ళ‌వారం రాత్రి మాత్రం మోడీ కునుకు తీయ‌లేదు. పైగా.. ర‌క్ష‌ణ శాఖ ఉన్న‌తాధికారుల‌తో ప‌దే ప‌దే ఫోన్లు చేశారు. ఒకానొక ద‌శ‌లో అర్ధ‌రాత్రి 1.02 నిమిషాల‌కు ఆప‌రేష‌న్ ప్రారంభ‌మైన త‌ర్వాత‌.. స్వ‌యంగా తాను కూడా వ‌స్తాన‌ని ఆయ‌న పేర్కొన్న‌ట్టు తెలిసింది. ఇది త‌న మ‌న‌సులోని అభిలాష అని.. అలా కుద‌ర‌ద‌ని త‌న‌కు కూడా తెలుసున‌ని చెప్పారు.

Advertisement

ఆర్మీ అధికారులు ప్ర‌త్యేకంగా షూట్ చేసిన వీడియోను తానే తొలుత వీక్షించారు. బాహ్య ప్ర‌పంచానికి 1.44 త‌ర్వాత స‌మాచారాన్ని విడుద‌ల చేశారు. వీడియోల‌ను తెల్ల‌వారు జామున 2.10 గంట‌ల‌కు విడుద‌ల చేశారు. సో.. మొత్తానికి ప‌క్కాగా మోడీ నిద్ర‌లేని రాత్రిని గ‌డ‌ప‌డంతోపాటు.. స‌రిహద్దుల‌కు వెళ్లి ఉగ్ర‌మూక‌ల‌పై దాడిని ప్ర‌త్య‌క్షంగా వీక్షించాల‌ని అనుకున్న విష‌యాన్ని అధికారులు కూడా ధ్రువీక‌రిస్తున్నారు.సాధార‌ణంగా మోదీ త్రి 9.30-10 మ‌ధ్య నిద్ర‌కు ఉప‌క్ర‌మిస్తారు. తెల్ల‌వారు జామున 4.30కు లేచి.. ధాన్యం, యోగా వంటివి చేసుకుంటారు. వ్య‌క్తిగ‌త కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటారు.

Ramalingaiah Tandu

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి