
Operation Sindoor IPL : ఆపరేషన్ సిందూర్.. ఐపీఎల్ జరుగుతుందా, విదేశీ ఆటగాళ్ల పరిస్థితి ఏంటి..?
Operation Sindoor IPL : పహల్గాంలో 26 మంది మృతికి కారణమైన ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకుంటూ, ముష్కరులను మట్టుబెట్టడమే లక్ష్యంగా ఆపరేషన్ సిందూర్ నిర్వహించింది భారత సైన్యం. దీని తర్వాత చాలా మందిలో అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. ప్రస్తుతం భారత్లో ఐపీఎల్ 2025 జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ‘ఆపరేషన్ సిందూర్’తో భారత్- పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న వేళ ఐపీఎల్ నిర్వహణపై అనుమానాలు తలెత్తుతున్నాయి.
Operation Sindoor IPL : ఆపరేషన్ సిందూర్.. ఐపీఎల్ జరుగుతుందా, విదేశీ ఆటగాళ్ల పరిస్థితి ఏంటి..?
‘ఆపరేషన్ సిందూర్’ తర్వాత భారత ప్రభుత్వం దేశంలోని పలు ఎయిర్పోర్ట్లపై ఆంక్షలు విధించింది. పాకిస్థాన్ సరిహద్దు రాష్ట్రాల్లో ఉన్న జమ్మూ, శ్రీనగర్, లేహ్, జోధ్పూర్, అమృత్సర్, భుజ్, జామ్నగర్, చండీగఢ్, రాజ్కోట్ విమానాశ్రయాలు 10వ తేదీ ఉదయం 5.30 గంటల వరకు మూసివేస్తున్నట్లు భారత ప్రభుత్వం ప్రకటించింది.అయితే భారత ప్రభుత్వ ఆంక్షలు ఐపీఎల్ షెడ్యూల్పై ప్రభావం చూపే అవకాశం ఉంది. ఐపీఎల్లో భాగంగా హిమాచల్ ప్రదేశ్లోని ధర్మశాలలో ఈనెల 8న పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు తలపడనున్నాయి.
ఇప్పటికే రెండు జట్లూ కూడా అక్కడికి చేరుకున్నాయి. దీంతో ఈ మ్యాచ్ నిర్వహణకు ఎలంటి ఇబ్బంది లేదు. కానీ ఆ తర్వాత ఇదే స్టేడియంలో మే 11న పంజాబ్ కింగ్స్, ముంబై ఇండియన్స్ జట్లు తలపడనున్నాయి. ముంబై ఇండియన్స్ ధర్మశాల చేరుకోవాలంటే ఢిల్లీ ఎయిర్పోర్ట్లో దిగి వెళ్లాల్సి ఉంటుంది. కానీ అదే జరిగితే.. సుదీర్ఘ రోడ్డు ప్రయాణం చేయాల్సి ఉంటుంది. దీంతో ఈ మ్యాచ్ను రీషెడ్యూల్ చేస్తారా? లేదా అప్పటివరకూ పరిస్థితులు చక్కబడతాయా ? అనేది తేలాల్సి ఉంది. ఐపీఎల్కు సంబంధించి భారత ప్రభుత్వం ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదని బీసీసీఐ వర్గాలు తెలిపాయి.
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
Montha Cyclone Effect | ఏపీలో ‘మొంథా’ తుఫాన్ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. వాతావరణ శాఖ హెచ్చరికలతో రాష్ట్రవ్యాప్తంగా టెన్షన్…
Dry Eyes | ఈ రోజుల్లో “కళ్ళు పొడిబారడం” (Dry Eyes) సమస్య ఎంతో సాధారణమైపోయింది. మొబైల్, ల్యాప్టాప్ లేదా…
Lemon Seeds | నిమ్మరసం తీసిన తర్వాత గింజలు చేదుగా ఉంటాయని చాలా మంది వాటిని పారేస్తారు. కానీ ఆరోగ్య…
Lemons | మూడు బాటల దగ్గర నడవకూడదు, రోడ్డుపై వేసిన నిమ్మకాయలు, మిరపకాయలు తొక్కకూడదు, పసుపు–కుంకుమ కలిపిన వస్తువులపై దాటకూడదు—ఇలాంటి…
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
Health Tips | చిన్న పిల్లల నుంచి పెద్దవారికి సీతాఫలం అనేది ప్రత్యేకమైనది. ఎండాకాలంలో మామిడి పళ్ల కోసం ప్రజలు…
This website uses cookies.