Categories: ExclusiveNewspolitics

మేం సంపాదించేది మా బిడ్డలకు ఒక్కపూట తిండి పెట్టలేక‌పోతున్నాం.. పూట భోజనానికి రూ. 1500 కావాలి..!

Advertisement
Published by
Advertisement

పాకిస్తాన్ ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. బట్టల మిల్లులో పనిచేస్తున్న అసిఫ్ మాసి కుటుంబం దైనందిన జీవితం దుర్భరంగా మారింది. రేపు పొద్దున్న ఇంత అన్నం దొరికేందుకు దారి చూపమని దేవుడిని ప్రార్థిస్తూ ఉంటా అని మాసీ చెప్పారు. పాకిస్తాన్లో మొత్తం బట్టల మిల్లు మూడోవంతు అంటే సుమారు 1600 మిల్లులు మూతపడ్డాయి. దీనివలన ఏడు లక్షల మంది కార్మికుల ఉద్యోగాలు పోయాయి. ఇలాంటి లక్షల మందిలో 45 ఏళ్ల మాసీ కూడా ఒకరు. గ్లోబల్ ఫ్యాషన్ బ్రాండ్స్ కు బట్టలు సరఫరా చేసే ఒక ఫ్యాక్టరీలో చేస్తున్నారు. ఇప్పుడు ఈ ఫ్యాక్టరీ మూత పడింది. దీంతో ఆయన చిన్న చిన్న పనులు చేస్తూ ఆటో రిక్షా నడుపుతున్నారు. లాహోర్ లోని పారిశ్రామిక వాడలోని సింగిల్ రూమ్ అపార్ట్మెంట్లో మాసి కుటుంబం జీవిస్తున్నారు. పాకిస్థాన్ లో పెరుగుతున్న జీవన వ్యయాలు తమని తమ ఐదుగురు పిల్లలను ఎంత ప్రభావితం చేస్తాయో ఆయన తెలిపారు.

Advertisement

మాసీ ఆయన భార్య ఎక్కువసేపు పనిచేసే తమ ముగ్గురు కుమార్తెలు, ఇద్దరు కుమారులు పోషిస్తున్నారు. ఒక పూట గడవడం కష్టంగా ఉండడంతో పిల్లలు బడికి కూడా వెళ్లడం లేదు. ప్రతిరోజు 500 పాకిస్తానీ రూపాయలతో ఎలాగో నెట్టికొచ్చేవారు కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. ప్రస్తుతం ఒక పూట భోజనం కోసం 1500 పాకిస్తానీ రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తుందని మాసీ చెప్పారు. పాకిస్తాన్ ఆర్థిక సంక్షోభ తాకిడితో రోజు గడవని స్థితిలో లక్షలాదిమంది ఉన్నారు. పాకిస్తాన్లో ఇంధన ధరలు భారీగా పెరిగాయి. పెట్రోల్, కరెంటు చార్జీలు కూడా విపరీతంగా పెరగడంతో చాలామంది నిరసన వ్యక్తం చేశారు కూడా. పాకిస్తాన్ ఆర్థిక మంత్రి శంషాద్ అక్తర్ ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కడానికి మరిన్ని నిధులు కోరినట్లు బ్లూమ్ బర్గ్ నివేదిక తెలిపింది.

Advertisement

గ్యాస్ ధరలను అమాంతం పెంచినవి తగ్గించక పోతే పరిశ్రమలను మూసివేస్తామని కరాచీలోను పారిశ్రామికవేత్తలు ఇప్పటికే ప్రభుత్వాన్ని హెచ్చరించారు. దేశంలో నిత్యవసరాలు ఇంధన ధరలు పెరగడంతో సామాన్య ప్రజలు అదనపు ఆదాయం సంపాదించుకోవాల్సి వచ్చింది. అంతర్జాతీయ ద్రవ్య నిధి షరతుల కారణంగా సబ్సిడీలను ప్రభుత్వం దశలవారీగా తగ్గించడంతో సామాన్యులు కష్టాలు పెరిగాయి. ఇటీవల కాలంలో గోధుమపిండి, బియ్యం ధరలు రెండింతలు అయ్యాయి. ఇది ఆర్థిక వినాశనంగా పాకిస్తాన్ మాజీ ఆర్థిక మంత్రి యుక్త ఇస్మాయిల్ అభివర్ణించారు. ఉక్రెయిన్ యుద్ధం, కరోనా మహమ్మారి తరువాత ప్రపంచవ్యాప్తంగా ఇంధన ధరలు పెరిగాయి. దీనికి తోడు పాకిస్తాన్ లో తలెత్తిన ఆర్థిక సమస్యల కారణంగా 1600 బట్టల మిల్లులు మూతపడ్డాయి. గతేడాది విరుచుకుపడ్డ వరదల కారణంగా 1700 మంది పైగా ప్రజలు మరణించారు. వ్యవసాయ భూములు భారీగా ముంపుకు గురయ్యాయి.

పాకిస్తాన్లోని విభిన్నమైన భౌగోళికతో యువత ఎక్కువగా ఉండడంతో పెట్టుబడిదారులకు ఈ దేశం ఆకట్టుకునేలా ఉంది. ప్రత్యేకించి కార్మికులు భారీ ఎత్తున అవసరమయ్యే వస్త్రాలు, ఆటోమొబైల్ రంగాలకు పాకిస్తాన్ కేంద్రంగా ఉంది. రుణాలు చెల్లించాల్సి ఉండగా దిగుమతి బిల్లులు భారీగా పెరిగిపోతుండడంతో పాకిస్తాన్ వద్ద ఉన్న విదేశీ నిల్వలు 300 కోట్ల డాలర్ల కంటే దిగువకు పడిపోయాయి. పాకిస్తాన్ మిత్ర దేశాలైన చైనా, సౌదీ అరేబియా, యూఏఈ కూడా పాకిస్తాన్ విదేశీ నిల్వలు పోకుండా ఉండేందుకు చేస్తున్నారు. చైనా పాకిస్తాన్ కి ఆర్థిక వ్యవస్థలో బిలియన్ డాలర్ల పెట్టుబడులను కురిపించింది. చైనా అతి పెద్ద విదేశీ పెట్టుబడి తో పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థకు సహాయపడుతుందని భావిస్తున్నారు. చైనా పెట్టుబడి ఆశాజనకంగానే ఉంది కానీ ఆ నిధుల ద్వారా మౌలిక సదుపాయాలను నిర్మిస్తున్నామని దీంతో చైనా కు రుణాలను తిరిగి చెల్లిస్తామని అంటున్నారు. చైనా లాంటి ఉక్కు సోదరుడి మద్దతుతో పాటు ఫిబ్రవరిలో అధికారంలోకి వచ్చే ప్రభుత్వానికి పాకిస్తాన్ ఆర్థిక బాధ్యత ఉంటుంది.

Advertisement

Recent Posts

Jr NTR : ఎన్టీఆర్ కెరీర్‌లోనే అతిపెద్ద ప్రాజెక్ట్?.. త్రివిక్రమ్ మూవీపై పెరుగుతున్న అంచనాలు..!

Jr NTR : టాలీవుడ్‌లో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రాజెక్టుల్లో జూనియర్ ఎన్టీఆర్, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న…

6 hours ago

Balka Suman Arrest : బాల్క సుమన్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. అసలు కారణమేంటి..?

Balka Suman Arrest : తెలంగాణ రాజకీయాల్లో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మాజీ ఎమ్మెల్యే, BRS నాయకుడు బాల్క…

7 hours ago

Parameshwar Reddy : ఉప్పల్‌లో కాంగ్రెస్ బలోపేతమే మా లక్ష్యం : మందుముల పరమేశ్వర్ రెడ్డి

హైదరాబాద్‌లోని గాంధీభవన్ ప్రాంగణంలో ఉన్న ఇందిరా భవన్‌లో మల్కాజ్‌గిరి పార్లమెంట్ నియోజకవర్గ స్థాయి కాంగ్రెస్ పార్టీ సమీక్ష సమావేశం ఘనంగా…

8 hours ago

Union Cabinet Expansion : మోదీ 3.0లో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ?.. కొత్త వారికి చాన్స్ ఉందా..?

Union Cabinet Expansion : ప్రధానమంత్రి Narendra Modi నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత రెండో…

9 hours ago

Peddi Movie : భారీ అంచనాల మధ్య ‘పెద్ది’కి కొత్త సమస్యలు.. ఏమవుతుందో?

Peddi Movie : మెగా పవర్ స్టార్ Ram Charan నటిస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం ‘పెద్ది’ ప్రస్తుతం…

10 hours ago

Pawan Kalyan : మాస్టర్ ప్లాన్.. ఏడాది ముందే రంగంలోకి దిగిన పవన్ కల్యాణ్..!

Pawan Kalyan : 2027లో జరగనున్న గోదావరి పుష్కరాలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే దృష్టి సారించింది. ముఖ్యంగా ఉప ముఖ్యమంత్రి…

11 hours ago

OTT Movie : ప్రేమ, సస్పెన్స్, ట్విస్టులతో అదిరిపోయిన సినిమా.. OTTలో వైరల్ అవుతున్న థ్రిల్లర్ మూవీ..!

OTT Movie : వేదికలపై ప్రతిరోజూ కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు విడుదలవుతున్నాయి. అయితే కొన్ని సినిమాలు మాత్రం విడుదలైన…

11 hours ago

Ganugabanda : గానుగబండ.. పిల్లల భవిష్యత్తుకు అంగన్వాడీలే పునాది.. తల్లిదండ్రులకు టీచర్ల పిలుపు

Ganugabanda : సమాజంలో చిన్నారుల ఆరోగ్యవంతమైన ఎదుగుదల, విద్యాభివృద్ధి లక్ష్యంగా అంగన్వాడీ కేంద్రాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని అంగన్వాడీ టీచర్…

11 hours ago

After : భర్తను చంపి ప్రియుడితో జీవితం.. చివరకు అదే ప్రియుడి చేతిలో మహిళ హత్య

After  : తెలంగాణలోని నాగర్‌కర్నూల్ జిల్లాలో వెలుగులోకి వచ్చిన ఓ హత్య కేసు స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది. వివాహేతర…

12 hours ago

Cooking Oil : వంట నూనె కూడా ఎక్స్‌పైరీ అవుతుందా? చెడిపోయిందో లేదో ఇలా గుర్తించండి

Cooking Oil  : మన రోజువారీ వంటల్లో వంట నూనె కీలక పాత్ర పోషిస్తుంది. కూరలు, ఫ్రైలు, స్నాక్స్, పప్పులు..…

15 hours ago

Jeera Water : వేసవిలో పురుషులకు వరం.. జీలకర్ర నీళ్లు తాగితే కలిగే అద్భుత ప్రయోజనాలు

వేసవి కాలంలో అధిక ఉష్ణోగ్రతలు, చెమటలు, నీరసం, అలసట వంటి సమస్యలు సాధారణంగా కనిపిస్తుంటాయి. ముఖ్యంగా బయట ఎక్కువ సమయం…

16 hours ago

Free Bus : ఉచిత బస్సు ప్రయాణీకులకు మరో గుడ్‌న్యూస్‌..!

Free Bus : ఆంధ్రప్రదేశ్ ప్రజలకు APSRTC మరో శుభవార్త చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా వివిధ డిపోలలో త్వరలోనే 750 ఎలక్ట్రిక్…

1 day ago