Categories: Newspolitics

Posani Krishna Murali : అప్పుడు ఏం పీకావ్ పవన్ కళ్యాణ్.. పోసాని కృష్ణ మురళి..!

Posani Krishna Murali : ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయ పార్టీలు ఎత్తులు పై ఎత్తులతో ప్రత్యర్థి పార్టీలతో పోటీపడుతూ ముందుకు సాగుతున్నాయి. అయితే ఈసారి జరగబోయే ఎన్నికల్లో సినీ నటులు కూడా పెద్ద ఎత్తున ప్రచారాలు చేపడుతున్నారు. ఇప్పటికే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని స్థాపించి ఇప్పుడు కూటమిలో భాగంగా ముందుకు వెళుతుంటే మరికొందరు సినీ ప్రముఖులు అధికార పార్టీ వైసీపీ తరఫున ప్రచారాలు చేపడుతున్నారు. వీరిలో మరీ ముఖ్యంగా సినీ కమెడియన్ అలీ మరియు పోసాని కృష్ణ మురళి వైసీపీ పార్టీ తరఫున పెద్ద ఎత్తున ప్రచారాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇటీవల ఇంటర్వ్యూలో పాల్గొన్న పోసాని కృష్ణ మురళి పవన్ కళ్యాణ్ గురించి ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు. దీంతో ప్రస్తుతం పోసాని కృష్ణమురళి చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాలలో తీవ్ర చర్చనియాంశంగా మారాయి.

Posani Krishna Murali : ఇన్ని రోజులు ఏం పీకినవు పవన్ కళ్యాణ్…

ఈ సందర్భంగా పోసాని కృష్ణ మురళి మాట్లాడుతూ… పవన్ కళ్యాణ్ మొదట్లో పార్టీ స్థాపించి సీఎం అవుతానని చెప్తే పాపం కుర్రాళ్ళు అందరూ నమ్మేశారు.తర్వాత ఓడిపోయాడు. మళ్లీ రెండోసారి కూడా అదే మాట చెప్పి మన ఓట్లన్నీ యూనిటీగా ఉండాలని పార్టీలో ఓట్ల చీలిక రాకూడదు అంటూ చెప్పుకొచ్చాడు. కానీ ఇప్పుడు మూడోసారి వచ్చి మనమంతా ఒకటిగా కలిసి చంద్రబాబు నాయుడుకి ఓట్లు వేయాలని చెబుతున్నాడు. అదేంటి సార్ మీరు జనసేన పార్టీని స్థాపించారు కదా…మీరు సీఎం అవుతారని గత ఎన్నికల్లో చెప్పారు కదా అంటే…నాకు సీఎం అయ్యే సీన్ లేదు చంద్రబాబు నాయుడు విజన్ ఉన్న వ్యక్తి అంటూ అతనికి డప్పు కొడుతున్నాడు. గత ఎన్నికల్లో చంద్రబాబుని ఉద్దేశించి పచ్చి బూతులు తిట్టిన పవన్ కళ్యాణ్ ఈరోజు అదే చంద్రబాబుతో పోత్తులో కలిసి ముందుకు వెళ్తున్నాడు. ఈ పవన్ కళ్యాణ్ యొక్క మైండ్ మెంటాలిటీ ప్రతి ఒక్కరు గమనించాల్సిందిగా పోసాని కృష్ణ మురళి తెలియజేశారు.

Posani Krishna Murali : అప్పుడు ఏం పీకావ్ పవన్ కళ్యాణ్.. పోసాని కృష్ణ మురళి..!

జనసేన పార్టీని స్థాపించి ఇప్పుడు ప్రచారాలకు వచ్చి నువ్వేం మాట్లాడతావు పవన్ కళ్యాణ్ . నువ్వు మొదట సీఎం అవుతామని వచ్చి ఇప్పుడు కార్యకర్తగా మరి చంద్రబాబు కాళ్ళు పట్టుకుని చంద్రబాబుకు ఓటు వేసి గెలిపించాలని కాపులందరినీ పక్కకు పెట్టి వ్యవహరిస్తున్నావు. మీ వలన కాపుల పరువు పోతుంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ లో ఉన్న చాలా మంది కాపు జాతి చిరంజీవి పవన్ కళ్యాణ్ వలన చాలా బాధపడ్డారు. వీరిద్దరి వలన కాపు వర్గాలు అవమాన పాలయ్యారని పోసాని కృష్ణ మురళి సంచలన వ్యాఖ్యలు చేశారు. దీనికంటే ముందు చిరంజీవి గారు ప్రజారాజ్యం అంటూ పెద్ద పాటిని స్థాపించారు. దీంతో వెంటనే కాపు వర్గాలు అందరూ అతనికి మద్దతుగా నిలిచారు. కానీ వాళ్లందర్నీ చిరంజీవి మోసం చేశారని ఈ సందర్భంగా పోసాని కృష్ణ మురళి సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో పోసాని కృష్ణ మురళి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయాలలో వైరల్ గా మారాయి.

Recent Posts

Chanakya Niti | చాణక్య సూత్రాలు: ఈ మూడు ఆర్థిక నియమాలు పాటిస్తే జీవితంలో డబ్బు కొరత ఉండదు!

Chanakya Niti | ఆచార్య చాణక్యుడు ..కేవలం రాజకీయ చతురుడు మాత్రమే కాదు, ఆర్థిక జ్ఞానానికి ప్రతీక. వేల సంవత్సరాల…

2 hours ago

Phone | రూ.15,000 బడ్జెట్‌లో మోటరోలా ఫోన్ కావాలా?.. ఫ్లిప్‌కార్ట్‌లో Moto G86 Power 5Gపై భారీ ఆఫర్!

Phone | కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్‌లో పవర్‌ఫుల్…

13 hours ago

Cancer Tips | ప్యాంక్రియాటిక్ క్యాన్సర్‌కు కాళ్లలో కనిపించే ప్రారంభ సంకేతాలు .. నిర్లక్ష్యం చేస్తే ప్రాణాపాయం

Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్‌, గుండెపోటు, స్ట్రోక్‌…

16 hours ago

Montha Cyclone Effect | ఏపీలో ‘మొంథా’ తుఫాన్‌ ఆందోళన .. కాకినాడ తీరంలో కల్లోలం

Montha Cyclone Effect | ఏపీలో ‘మొంథా’ తుఫాన్‌ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. వాతావరణ శాఖ హెచ్చరికలతో రాష్ట్రవ్యాప్తంగా టెన్షన్…

19 hours ago

Dry Eyes | కళ్ళు పొడిబారడం వ‌ల‌న పెరుగుతున్న సమస్య .. కారణాలు, లక్షణాలు, జాగ్రత్తలు ఇవే

Dry Eyes | ఈ రోజుల్లో “కళ్ళు పొడిబారడం” (Dry Eyes) సమస్య ఎంతో సాధారణమైపోయింది. మొబైల్, ల్యాప్‌టాప్ లేదా…

20 hours ago

Lemon Seeds | అవి పారేయకండి ..నిమ్మగింజల్లో దాగి ఉన్న ఆరోగ్య రహస్యాలు ఇవే..!

Lemon Seeds | నిమ్మరసం తీసిన తర్వాత గింజలు చేదుగా ఉంటాయని చాలా మంది వాటిని పారేస్తారు. కానీ ఆరోగ్య…

23 hours ago

Lemons | మూఢనమ్మకాల వెనుక శాస్త్రం ..మూడు బాటల దగ్గర నడవకూడదంటారా?

Lemons | మూడు బాటల దగ్గర నడవకూడదు, రోడ్డుపై వేసిన నిమ్మకాయలు, మిరపకాయలు తొక్కకూడదు, పసుపు–కుంకుమ కలిపిన వస్తువులపై దాటకూడదు—ఇలాంటి…

1 day ago

Dog | కుక్క కాటుతో 10ఏళ్ల బాలిక మృతి.. అయోమ‌యానికి గురిచేసిన నిజామాబాద్ ఘటన

Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…

2 days ago