
Posani Krishna Murali : అప్పుడు ఏం పీకావ్ పవన్ కళ్యాణ్.. పోసాని కృష్ణ మురళి..!
Posani Krishna Murali : ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయ పార్టీలు ఎత్తులు పై ఎత్తులతో ప్రత్యర్థి పార్టీలతో పోటీపడుతూ ముందుకు సాగుతున్నాయి. అయితే ఈసారి జరగబోయే ఎన్నికల్లో సినీ నటులు కూడా పెద్ద ఎత్తున ప్రచారాలు చేపడుతున్నారు. ఇప్పటికే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని స్థాపించి ఇప్పుడు కూటమిలో భాగంగా ముందుకు వెళుతుంటే మరికొందరు సినీ ప్రముఖులు అధికార పార్టీ వైసీపీ తరఫున ప్రచారాలు చేపడుతున్నారు. వీరిలో మరీ ముఖ్యంగా సినీ కమెడియన్ అలీ మరియు పోసాని కృష్ణ మురళి వైసీపీ పార్టీ తరఫున పెద్ద ఎత్తున ప్రచారాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇటీవల ఇంటర్వ్యూలో పాల్గొన్న పోసాని కృష్ణ మురళి పవన్ కళ్యాణ్ గురించి ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు. దీంతో ప్రస్తుతం పోసాని కృష్ణమురళి చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాలలో తీవ్ర చర్చనియాంశంగా మారాయి.
ఈ సందర్భంగా పోసాని కృష్ణ మురళి మాట్లాడుతూ… పవన్ కళ్యాణ్ మొదట్లో పార్టీ స్థాపించి సీఎం అవుతానని చెప్తే పాపం కుర్రాళ్ళు అందరూ నమ్మేశారు.తర్వాత ఓడిపోయాడు. మళ్లీ రెండోసారి కూడా అదే మాట చెప్పి మన ఓట్లన్నీ యూనిటీగా ఉండాలని పార్టీలో ఓట్ల చీలిక రాకూడదు అంటూ చెప్పుకొచ్చాడు. కానీ ఇప్పుడు మూడోసారి వచ్చి మనమంతా ఒకటిగా కలిసి చంద్రబాబు నాయుడుకి ఓట్లు వేయాలని చెబుతున్నాడు. అదేంటి సార్ మీరు జనసేన పార్టీని స్థాపించారు కదా…మీరు సీఎం అవుతారని గత ఎన్నికల్లో చెప్పారు కదా అంటే…నాకు సీఎం అయ్యే సీన్ లేదు చంద్రబాబు నాయుడు విజన్ ఉన్న వ్యక్తి అంటూ అతనికి డప్పు కొడుతున్నాడు. గత ఎన్నికల్లో చంద్రబాబుని ఉద్దేశించి పచ్చి బూతులు తిట్టిన పవన్ కళ్యాణ్ ఈరోజు అదే చంద్రబాబుతో పోత్తులో కలిసి ముందుకు వెళ్తున్నాడు. ఈ పవన్ కళ్యాణ్ యొక్క మైండ్ మెంటాలిటీ ప్రతి ఒక్కరు గమనించాల్సిందిగా పోసాని కృష్ణ మురళి తెలియజేశారు.
Posani Krishna Murali : అప్పుడు ఏం పీకావ్ పవన్ కళ్యాణ్.. పోసాని కృష్ణ మురళి..!
జనసేన పార్టీని స్థాపించి ఇప్పుడు ప్రచారాలకు వచ్చి నువ్వేం మాట్లాడతావు పవన్ కళ్యాణ్ . నువ్వు మొదట సీఎం అవుతామని వచ్చి ఇప్పుడు కార్యకర్తగా మరి చంద్రబాబు కాళ్ళు పట్టుకుని చంద్రబాబుకు ఓటు వేసి గెలిపించాలని కాపులందరినీ పక్కకు పెట్టి వ్యవహరిస్తున్నావు. మీ వలన కాపుల పరువు పోతుంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ లో ఉన్న చాలా మంది కాపు జాతి చిరంజీవి పవన్ కళ్యాణ్ వలన చాలా బాధపడ్డారు. వీరిద్దరి వలన కాపు వర్గాలు అవమాన పాలయ్యారని పోసాని కృష్ణ మురళి సంచలన వ్యాఖ్యలు చేశారు. దీనికంటే ముందు చిరంజీవి గారు ప్రజారాజ్యం అంటూ పెద్ద పాటిని స్థాపించారు. దీంతో వెంటనే కాపు వర్గాలు అందరూ అతనికి మద్దతుగా నిలిచారు. కానీ వాళ్లందర్నీ చిరంజీవి మోసం చేశారని ఈ సందర్భంగా పోసాని కృష్ణ మురళి సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో పోసాని కృష్ణ మురళి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయాలలో వైరల్ గా మారాయి.
AP Housing Scheme 2026 : సొంతంగా ఒక ఇల్లు నిర్మించుకోవాలనేది ప్రతి పేద, మధ్యతరగతి కుటుంబం యొక్క దశాబ్దాల…
Husband Wife : నేటి సమాజంలో మనుషుల ప్రాణాలకు విలువే లేకుండా పోతోంది. చిన్నపాటి మనస్పర్థలు, అనవసరపు అనుమానాలు నిండు…
Mamata Banerjee : పశ్చిమ బెంగాల్ రాజకీయాలు మరోసారి తీవ్ర ఉత్కంఠకు దారితీశాయి. నిన్న వెలువడిన ఎన్నికల ఫలితాలు, ఓట్ల…
IPL 2026 SRH : సన్రైజర్స్ హైదరాబాద్ అభిమానులారా.. ఆరెంజ్ ఆర్మీ మద్దతుదారులారా.. సిద్ధంగా ఉండండి! మీ గుండెల్లో ఆశలు…
Curd : భానుడి భగభగలకు అల్లాడిపోతున్న తరుణంలో, శరీరానికి చల్లదనాన్ని ఇచ్చే పెరుగు, మజ్జిగ లేదా లస్సీలను ప్రతి ఒక్కరూ…
Watermelon : ఎండకాలం వచ్చిందంటే చాలు.. దాహార్తిని తీర్చుకోవడానికి మనందరికీ గుర్తొచ్చే మొదటి పండు పుచ్చకాయ. ఎర్రటి రంగుతో, తియ్యని…
Vomiting : చాలామందికి ప్రయాణం అంటే ఒక అందమైన అనుభూతి. కానీ, కొంతమందికి మాత్రం అది ఒక పీడకలగా మారుతుంది.…
Vijay TVK : తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు దేశ రాజకీయాల్లో కొత్త చరిత్రను లిఖించాయి. నటుడు విజయ్ స్థాపించిన…
PM Kisan : భారతదేశంలో వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడానికి, రైతులకు పెట్టుబడి సాయం అందించడానికి కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పీఎం…
Soaked Fennel Seeds : నేటి ఆధునిక జీవనశైలిలో ఉరుకుల పరుగుల జీవితం, పని ఒత్తిడి కారణంగా మన ఆహారపు…
Vijay TVK : తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. రాజకీయ అరంగేట్రం చేసిన అతి తక్కువ కాలంలోనే…
Vijay Pawan Kalyan : తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో దళపతి విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కజగం (TVK)…
This website uses cookies.