Pawan kalyan : ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికల సమీపిస్తున్న వేళ రాజకీయాలు హోరాహోరీగా సాగుతున్నాయి. ఇక ఈ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార పార్టీ వైసీపీ ఒంటరి పోరాటం చేస్తుంటే…జనసేన బీజేపీ టీడీపీ కూటమిగా ఏర్పడి ముందుకు వెళుతున్నాయి. అయితే ఎన్నికల డేట్ దగ్గర పడుతుండటంతో నామినేషన్ ప్రక్రియను ఇటీవల ప్రారంభించడం జరిగింది. దీనిలో భాగంగానే ఇటీవల జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురంలో నామినేషన్ వేయడం జరిగింది. నామినేషన్ అనంతరం మీడియా ముందుకు వచ్చిన పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ…. తెలుగు ప్రజలందరికీ ప్రత్యేక నమస్కారాలు తెలియజేశారు.
గత ఐదు సంవత్సరాలుగా నీచపు పరిపాలన చేస్తున్న జగన్ ప్రభుత్వాన్ని, గద్దె దించే సమయం వచ్చిందని దానిలో భాగంగానే ఇటీవల పిఠాపురం నియోజకవర్గంలో నామినేషన్ వేయడం జరిగిందని పవన్ కళ్యాణ్ తెలిపారు. ఇక ఈ నామినేషన్ కు వచ్చే దారి మధ్యలో దాదాపు 60 నుంచి 70 వేలమంది ప్రజల ఆశీర్వచనాలతో ఇక్కడికి వచ్చినట్లుగా ఆయన తెలిపారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికలు ఆంధ్ర రాష్ట్రానికే కాదు 2047 వచ్చే తరానికి ఎంతో కీలకమైనవని ఆయన అన్నారు. ఈ కీలకమైన ఎన్నికల్లో జనసేన టీడీపీ బీజేపీ కూటమిగా ఏర్పడి ముందుకు వెళ్తా ఉన్నాయి. జనసేన పార్టీ కూడా చాలా బలం పుంజుకుని రాష్ట్ర ప్రయోజనాల కోసం తగ్గి త్యాగాలు చేసి వచ్చిందని తెలిపారు. చాలా నియోజకవర్గాలలో జనసేన అభ్యర్థులు వారి సీట్లను మిస్ చేసుకున్నారు. అలా త్యాగాలు చేసిన వారిలో ముఖ్యమైన బలమైన నాయకులు వర్మ గారు. వర్మ గారు నాకోసం తన సీట్ ను త్యాగం చేశారని వారికి మనస్ఫూర్తిగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.
జనసేన పార్టీ నాయకులు వ్యక్తిగత ప్రయోజనాలను దాటి త్యాగాలు చేస్తున్నారని వారందరూ కూడా భవిష్యత్తులో ఉన్నత స్థానాలకు చేరుకుంటారని ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ తెలిపారు. ఇక వచ్చే ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి టీడీపీ జనసేన బీజేపీ అఖండ విజయం సాధిస్తుందని దానికి నిదర్శనమే ఇప్పుడు నామినేషన్ వేసే ప్రక్రియ అంటూ చెప్పుకొచ్చారు. అలాగే మాకు అండగా నిలబడిన మీడియా మిత్రులు అందరికీ మేము ఖచ్చితంగా అండగా ఉంటామని మీ కష్టాలలో పాలుపంచుకుంటామని ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు.
Diabetes : ప్రస్తుత కాలంలో మధుమేహం అనేది సాధారణ సమస్యగా మారింది. అయితే వృద్ధులు మాత్రమే కాదు యువత కూడా దీని…
Shani Dev : సెప్టెంబర్ చివరి వారంలో అత్యంత శక్తివంతమైన శేష మహాపురుష యోగం ఏర్పడుతుంది. అయితే ఈ యోగం…
TS ITI Admission 2024 : డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్, తెలంగాణ TS ITI 2024 రిజిస్ట్రేషన్…
Breakfast : మనం తీసుకునే ఆహారమే మన శరీరాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే మనం తీసుకునే అల్పాహారం.…
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
CISF Fireman Recruitment : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్మెన్ల నియామక…
Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ…
This website uses cookies.