revanth reddy super counter to minister harish rao
Revanth Reddy : రేవంత్ రెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో ఆయనే పెద్ద దిక్కు అని చెప్పుకోవాలి. రేవంత్ రెడ్డి టీపీసీసీ చీఫ్ కాకముందు కాంగ్రెస్ పరిస్థితి ఎలా ఉండేదో అందరికీ తెలుసు. ఇప్పుడు పార్టీ పరిస్థితి ఎలా ఉందో కూడా అందరికీ తెలుసు. కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం తెలంగాణలో పుంజుకుంటోంది. అందులోనూ కర్ణాటకలో పార్టీ గెలవడం చాలా ప్లస్ అయింది. అందుకే కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం రేవంత్ రెడ్డి అహర్నిశలు పని చేస్తున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ గెలుపు కోసం రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో ప్రయత్నాలు చేయడమే కాదు.. బీఆర్ఎస్ను ఎక్కడికక్కడ కట్టడి చేయడానికి తెగ ప్రయత్నాలు చేస్తున్నారు. అందుకే ఎన్నికల ముందు రైతు బంధు విడుదల చేయకుండా.. రైతు బంధు పథకం ఆపాలని కేంద్ర ఎన్నికల సంఘానికి ఏఐసీసీ లేఖ రాసినట్టు తెలుస్తోంది. దానిపై బీఆర్ఎస్ నేతలు భగ్గుమంటున్నారు. మీరు ఇవ్వడం చేతగాదు.. ఇచ్చే వాళ్లను ఆపుతున్నారు.. రైతులను ఆదుకోవడం తప్పా? రైతులను ఆదుకుంటుంటే.. మీకు ఎందుకు నొప్పి అవుతోంది అంటూ కాంగ్రెస్ నేతలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు.
రైతాంగానికి ఇచ్చే సాయం వృథా ఖర్చు తప్పితే ఇంకేం కాదు అని కాంగ్రెస్ నేతలు అంటున్నారని మంత్రి హరీశ్ రావు మండిపడ్డారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతు బంధును తీసేస్తారని తెలిసిపోతోందని హరీశ్ రావు దుయ్యబట్టారు. రైతుల జోలికి వస్తే డిపాజిట్లు కూడా దక్కవు.. అని కాంగ్రెస్ నేతలను హెచ్చరించారు. రైతు బంధు పథకం కేవలం ఓట్ల కోసం తెచ్చింది కాదు. కరోనా సమయంలో ఎమ్మెల్యేలు, అధికార జీతాల్లో కోతలు పెట్టి మరీ రైతు బంధు ఇచ్చాం. రైతులంతా బీఆర్ఎస్ వెంట ఉన్నారన్న కోపంతోనే రైతు బంధు ఆపాలని కాంగ్రెస్ చూస్తోందని, దీంతో పాటు ఇతర సంక్షేమ పథకాలను ఆడ్డుకుంటారేమోనన్న అనుమానం కలుగుతోందన్నారు. కాంగ్రెస్ పార్టీకి కర్రు కాల్చి వాత పెట్టాలని హరీశ్ రావు పిలుపునిచ్చారు. హరీశ్ రావు తప్పుడు ప్రచారం చేస్తున్నారని తెలంగాణ కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు.
రైతు బంధు ఆపమని కాంగ్రెస్ కోరలేదు. పథకాలకు సంబంధించిన నగదును నవంబర్ 2 లోపు విడుదల చేయాలని మాత్రమే కోరామని.. రేవంత్ రెడ్డి చెప్పారు. మా పార్టీ డిమాండ్ పై బీఆర్ఎస్ గోబెల్స్ ప్రచారం చేస్తోంది. కాంగ్రెస్ పేరు చెప్పి ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తోంది. కేసీఆర్ మాయమాటలు నమ్మే పరిస్థితుల్లో తెలంగాణ ప్రజలు లేరు. కాంగ్రెస్ పై తమ్ముడు ప్రచారం చేస్తున్న అధికార పార్టీ నేతలకు దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చారు. మేము ఒక పక్కన పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల సంఘాన్ని కోరితే ఒక విష ప్రచారాన్ని బీఆర్ఎస్ మొదలుపెట్టింది అని రేవంత్ రెడ్డి మండిపడ్డారు.
Ys Sharmila : ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మరోసారి మాజీ సీఎం జగన్, చంద్రబాబు సర్కార్ పై…
Vakkati Srihari : తెలంగాణ క్రీడలు, యువజన, మత్స్య మరియు పశుసంవర్థక శాఖల మంత్రి వాకిటి శ్రీహరి నారాయణపేట జిల్లా…
Chandra Mohan సినీ పరిశ్రమలో సుమారు 900కి పైగా చిత్రాల్లో నటించిన ప్రముఖ నటుడు చంద్రమోహన్ తెలుగు ప్రేక్షకులకు ఎంతో…
Red Amaranath : ప్రతిసారి డాక్టర్స్ ఆకుకూరలను తింటే మంచిది అని చెబుతూ ఉంటారు. ఆకు కూరలు తింటే ఆరోగ్య…
BRS : గత పదకొండేళ్లుగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు అత్యంత సన్నిహితుడిగా ఉన్న ఓ మాజీ ఎమ్మెల్యే ఇప్పుడు రాజకీయంగా…
Gas Stove : ఆధారంగా అప్పట్లో గ్యాస్ పొయ్యిలనేవి లేవు.కావున, ప్రమాదాలు కూడా తక్కువే. కానీ ఇప్పుడు గ్యాస్ స్టవ్లు…
Anganwadi Posts : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరుద్యోగులకు త్వరలోనే శుభవార్త చెప్పనుంది. 4,687 అంగన్వాడీ పోస్టులను భర్తీ చేయనుంది. ఈ…
Green Tea : సాధారణంగా ప్రతి ఒక్కరూ ఉదయం లేవగానే టీ తాగండి ఏ పని చేయరు. టీ తాగకుండా…
This website uses cookies.