Home » Exclusive » Silent Wave In Ap Which Party Is Sinking
Exclusive

AP : ఏపీలో సైలెంట్ వేవ్.. ఏ పార్టీని ముంచుతుందో..?

Authored By
Ramu Tandu Ramalingaiah
The Telugu News | Published on: May 14, 2024, 6:00 pm
Advertisement

AP : ఏపీలో ఎవరూ ఊహించని పరిణామాలు జరిగాయి. గత నెల రోజులుగా ఎవరెన్ని చెప్పాలో అన్నీ చెప్పేశారు. ఎవరెంత ప్రచారం చేసుకోవాల.. ప్రత్యర్థులపై ఎన్ని విమర్శలు, చేయాలో, ఎన్ని ఆరోపణలు చేయాలో అన్నీ చేసేశారు. అందరి మాటలు ప్రజలు విన్నారు. అందరు ఇచ్చిన హామీలను తెలుసుకున్నారు. కానీ ప్రజలు మాత్రం సెలెంట్ గానే ఉన్నారు. చివరకు మే 13న ఎవరికి ఓటేయాలో వారికి వేసేశారు. అయితే పోలింగ్ డే రోజున పార్టీల అంచనాలు మొత్తం తలకిందులు అయిపోయాయి. ఎందుకంటే అసలు ఓటరు బయటకు రాడేమో అని అంతా అనుకున్నారు.

Advertisement

AP : అన్ని పార్టీలు సైలెంట్..

కానీ మండుటెండలో సైతం ఓటర్లు బయటకు వచ్చారు. ఓటేసి తీరాల్సిందే అన్న రీతిలో వారంతా ఓట్లేశారు. పార్టీల హామీలు, సంక్షేమ పథకాలు ఓటర్లను బయటకు తీసుకురావేమో అని అంతా అనుకున్నారు. కానీ అదే పార్టీల అంచనాలను తలకిందులు చేసి ఓటర్లు సైలెంట్ గా వచ్చి భారీగా ఓట్లేశారు. ఒక రకంగా ఏపీలో సైలెంట్ వేవ్ కనిపించింది. దాంతో అన్ని పార్టీలు సైలెంట్ అయిపోయాయి. ప్రజల నాడిని పసిగట్టే పనిలో పార్టీలు, రాజకీయ నిపుణులు పడ్డారు. ఎవరికి ఓటేస్తారో కూడా తెలియదని అంతా సైలెంట్ అయిపోయారు. అయితే ఈ సారి కాస్త పోలింగ్ పెరిగింది.

కాగా పోలింగ్ పెరిగితే గత ఎన్నికల్లో ఏం జరిగిందనేది ఇప్పుడు అంచనా వేస్తున్నారు. గతంలో పోలింగ్ పెరిగితే అది ప్రతిపక్షాలను గెలిపించింది. దాంతో ఈ సారి టీడీపీ కూటమి పెరిగిన ఓటింగ్ తమకే కలిసి వస్తుందని చెబుతోంది. 2014 ఎన్నికల సీన్ రిపీట్ అవుతుందని అంటున్నారు. కానీ వైసీపీ మాత్రం ఆ సైలెంట్ వేవ్ తమకే పడిందని చెబుతోంది. జగన్ ను రెండోసారి సీఎం చేస్తారని అంటోంది. కాస్త మెజార్టీ తగ్గినా సరే 2009లో వైఎస్ రాజశేఖర్ రెడ్డిని రెండోసారి సీఎం చేసిన విధానంలో భాగంగా ఈ సారి జగన్ కూడా రెండో సారి బొటా బొటి మెజార్టీతో సీఎం అవుతారని అంటోంది.

Advertisement

AP : ఏపీలో సైలెంట్ వేవ్.. ఏ పార్టీని ముంచుతుందో..?

ఇలా ఏ పార్టీ వారి వాదనలను చెబుతోంది. కానీ ఓటరు ఎటు ఓటేశారనేది మాత్రం అందరికీ అనుమానంగానే ఉంది. ఎటు ఓటేశారో తెలియకపోతే మాత్రం అందరిలోనూ టెన్షన్ తగ్గదు.

Ramu Tandu Ramalingaiah

Author Bio Info : Author Bio Info : Ramu Tandu Ramalingaiah is experienced in Media field. He worked in various Telugu media houses for about 15+ years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Editor of thetelugunews.com | Contact Details : ramu@thetelugunews.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి