Ys Jagan : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (వైఎస్ఆర్సీపీ) అధ్యక్షుడు వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి తనను సభలో ప్రతిపక్ష నాయకుడిగా గుర్తించాలని ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ అయ్యన్న పాత్రుడికి లేఖ రాసి కోరిన విషయం తెలిసిందే. ఈ విషయమై ఆయన హైకోర్టును ఆశ్రయించారు. లోక్సభ, ఢిల్లీ అసెంబ్లీ, అవిభాజ్య ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో జరిగిన పూర్వాపరాలను పరిశీలిస్తే వైఎస్సార్సీపీ నేతకు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాలన్నారు. సభ మొత్తం బలంతో పోలిస్తే వారి సంఖ్యా బలం తక్కువగా ఉన్నప్పటికీ ప్రతిపక్ష నాయకుడికి ప్రతిపక్ష నాయకుడి పదవిని ఇచ్చినట్లుగా ఆయన పేర్కొన్నారు. వైఎస్ జగన్ అసెంబ్లీ గైర్హాజరవుతున్న సంగతి తెలిసిందే. సభలో తనకు మైకు ఇవ్వరని, తనకు ప్రతిపక్ష హోదా లేకపోతే మాట్లాడే అవకాశం ఉండదని ఆయన చెబుతున్నారు.
ఇటీవల అసెంబ్లీలో ఆర్థికశాఖపై శ్వేతపత్రం విడుదల చేసి, అనంతరం చంద్రబాబు ప్రసగించారు. అయితే… సరిగ్గా అదే సమయంలో జగన్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. శ్వేతపత్రాలపై నిప్పులు కక్కారు. అసలు లెక్కలు ఇవంటూ పలు విషయాలు వెల్లడించారు.ఈ సమయంలో రెండు విషయాలనూ మీడియా ప్రసారం చేసింది. అయితే ఆ సమయంలో అసెంబ్లీ సమావేశాన్ని అందులో చంద్రబాబు నాయుడి ప్రసంగాన్ని ఆన్ లైన్ లో చూసినవారు కేవలం 50 వేల పైచులుకు మాత్రమే ఉండగా జగన్ ప్రెస్ మీట్ ని మాత్రం 7 లక్షల మందికి పైగా వీక్షించారు. దాంతో కూటమి ప్రభుత్వం పునరాలోచనలో పడిందని సమాచారం.
కూటమి ప్రభుత్వం కొలువుదీరిన ప్రారంభంలోనే పరిస్థితి ఇలా ఉంటే.. ఇకముందు ఎలా ఉంటుందని అంతా చర్చించుకుంటున్నారు. ఇదే కంటిన్యూ అయితే ఏపీ అసెంబ్లీ సమావేశాలు చూసేవారు తగ్గిపోవడంతో పాటు, సరిగ్గా అదే సమయంలో జగన్ ప్రెస్ మీట్ లు చూసేవారి సంఖ్య విపరీతంగా పెరుగుతుండం వల్ల ప్రభుత్వంపై వ్యతిరేకత పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. దాంతో ఆలోచనలో పడ్డ ఎన్డీయే ప్రభుత్వం, కూటమి మంత్రులు జగన్ ను రిక్వెస్ట్ చేస్తున్నట్లు సమాచారం. స్పీకర్ అయ్యన్నపాత్రుడు అయితే ఓ అడుగు ముందుకేసి ఏకంగా జగన్ ని బుజ్జగించే పనిలో ఉన్నాట్లు కనిపిస్తున్నారు. ఇందులో భాగంగ పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి జగన్ అసెంబ్లీకి రావాలని అంటున్నారు. అసెంబ్లీలో మాట్లాడేందుకు అవకాశం కల్పిస్తామని మంత్రులు చెబుతుండగా.. ఆ విషయంలో తనది భాధ్యత అన్నట్లుగా స్పీకర్ భరోసా ఇస్తున్నట్లు సమాచారం.
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
CISF Fireman Recruitment : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్మెన్ల నియామక…
Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ…
7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్నెస్ అలవెన్స్ (డీఏ)ని ప్రభుత్వం పెంచబోతోంది. ప్రభుత్వం త్వరలో…
Balineni Srinivas Reddy : గత కొద్ది రోజులుగా బాలినేని వైసీపీని వీడనున్నట్టు అనేక ప్రచారాలు జరిగాయి. ఎట్టకేలకి అది…
Jamili Elections : దేశవ్యాప్తంగా ఒకేసారి పార్లమెంట్ , అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేలా జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్ ఆమోదం…
Naga Manikanta : బుల్లితెర ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తున్న బిగ్ బాస్ ఇప్పుడు తెలుగులో సీజన్ 8 జరుపుకుంటుంది.తాజా సీజన్లోని…
This website uses cookies.