
Ys Jagan : ఇలా అయితే సమావేశాలు చూసేదెవరూ.. జగన్ అసెంబ్లీకి రావాలంటూ స్పీకర్, మంత్రుల విజ్ఞప్తి !
Ys Jagan : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (వైఎస్ఆర్సీపీ) అధ్యక్షుడు వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి తనను సభలో ప్రతిపక్ష నాయకుడిగా గుర్తించాలని ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ అయ్యన్న పాత్రుడికి లేఖ రాసి కోరిన విషయం తెలిసిందే. ఈ విషయమై ఆయన హైకోర్టును ఆశ్రయించారు. లోక్సభ, ఢిల్లీ అసెంబ్లీ, అవిభాజ్య ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో జరిగిన పూర్వాపరాలను పరిశీలిస్తే వైఎస్సార్సీపీ నేతకు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాలన్నారు. సభ మొత్తం బలంతో పోలిస్తే వారి సంఖ్యా బలం తక్కువగా ఉన్నప్పటికీ ప్రతిపక్ష నాయకుడికి ప్రతిపక్ష నాయకుడి పదవిని ఇచ్చినట్లుగా ఆయన పేర్కొన్నారు. వైఎస్ జగన్ అసెంబ్లీ గైర్హాజరవుతున్న సంగతి తెలిసిందే. సభలో తనకు మైకు ఇవ్వరని, తనకు ప్రతిపక్ష హోదా లేకపోతే మాట్లాడే అవకాశం ఉండదని ఆయన చెబుతున్నారు.
ఇటీవల అసెంబ్లీలో ఆర్థికశాఖపై శ్వేతపత్రం విడుదల చేసి, అనంతరం చంద్రబాబు ప్రసగించారు. అయితే… సరిగ్గా అదే సమయంలో జగన్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. శ్వేతపత్రాలపై నిప్పులు కక్కారు. అసలు లెక్కలు ఇవంటూ పలు విషయాలు వెల్లడించారు.ఈ సమయంలో రెండు విషయాలనూ మీడియా ప్రసారం చేసింది. అయితే ఆ సమయంలో అసెంబ్లీ సమావేశాన్ని అందులో చంద్రబాబు నాయుడి ప్రసంగాన్ని ఆన్ లైన్ లో చూసినవారు కేవలం 50 వేల పైచులుకు మాత్రమే ఉండగా జగన్ ప్రెస్ మీట్ ని మాత్రం 7 లక్షల మందికి పైగా వీక్షించారు. దాంతో కూటమి ప్రభుత్వం పునరాలోచనలో పడిందని సమాచారం.
Ys Jagan : ఇలా అయితే సమావేశాలు చూసేదెవరూ.. జగన్ అసెంబ్లీకి రావాలంటూ స్పీకర్, మంత్రుల విజ్ఞప్తి !
కూటమి ప్రభుత్వం కొలువుదీరిన ప్రారంభంలోనే పరిస్థితి ఇలా ఉంటే.. ఇకముందు ఎలా ఉంటుందని అంతా చర్చించుకుంటున్నారు. ఇదే కంటిన్యూ అయితే ఏపీ అసెంబ్లీ సమావేశాలు చూసేవారు తగ్గిపోవడంతో పాటు, సరిగ్గా అదే సమయంలో జగన్ ప్రెస్ మీట్ లు చూసేవారి సంఖ్య విపరీతంగా పెరుగుతుండం వల్ల ప్రభుత్వంపై వ్యతిరేకత పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. దాంతో ఆలోచనలో పడ్డ ఎన్డీయే ప్రభుత్వం, కూటమి మంత్రులు జగన్ ను రిక్వెస్ట్ చేస్తున్నట్లు సమాచారం. స్పీకర్ అయ్యన్నపాత్రుడు అయితే ఓ అడుగు ముందుకేసి ఏకంగా జగన్ ని బుజ్జగించే పనిలో ఉన్నాట్లు కనిపిస్తున్నారు. ఇందులో భాగంగ పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి జగన్ అసెంబ్లీకి రావాలని అంటున్నారు. అసెంబ్లీలో మాట్లాడేందుకు అవకాశం కల్పిస్తామని మంత్రులు చెబుతుండగా.. ఆ విషయంలో తనది భాధ్యత అన్నట్లుగా స్పీకర్ భరోసా ఇస్తున్నట్లు సమాచారం.
Arava Sridhar : ఆంధ్రప్రదేశ్ Andhra pradesh రాజకీయాల్లో రైల్వే కోడూరు జనసేన Janasena MLA ఎమ్మెల్యే అరవ శ్రీధర్పై…
Credit Card : నేటి డిజిటల్ యుగంలో క్రెడిట్ కార్డు అనేది ఒక ఆర్థిక అవసరంగా మారింది. సరైన పద్ధతిలో…
RBI : ప్రకృతి విపత్తులు ఒక్కసారిగా జీవితాన్నే తలకిందులు చేస్తాయి. వరదలు, తుపాన్లు, భూకంపాలు, కొండచరియలు విరిగిపడటం వంటి సంఘటనలతో…
Telangana Ration : అక్రమ రేషన్ బియ్యం రవాణాను అడ్డుకోవడం ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధి నిజమైన పేదలకు మాత్రమే…
WhatsApp : ప్రస్తుత రోజుల్లో ప్రతి ఒక్కరి చేతిలో ఉన్న స్మార్ట్ఫోన్లో తప్పనిసరిగా ఉండే యాప్ వాట్సాప్. ఉదయం లేచిన…
Recruitment 2026: భారత ప్రభుత్వ సైన్స్ & టెక్నాలజీ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తున్న ప్రముఖ పరిశోధనా సంస్థ వాడియా ఇన్స్టిట్యూట్…
Gold Price : ప్రపంచ పరిణామాల ప్రభావంతో బంగారం ధరలు రోజురోజుకీ కొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. ఇటీవల వరకు స్థిరంగా…
Samantha : ఢిల్లీలో అట్టహాసంగా జరిగిన భారత 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలలో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత రూత్…
This website uses cookies.