Ysrcp : మరో వంద రోజుల్లో ఏపీలో శాసనసభ ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలోనే అధికార పార్టీ వైఎస్సార్ సీపీ తమ పార్టీలో మార్పులు చేర్పులు చేస్తుంది. ఎలాగైనా అధికారంలో రావాలని సిట్టింగ్ ఎమ్మెల్యేలను కూడా పక్కన పెట్టింది. మొదటి జాబితాలో 11 మందిని కొత్తగా ఇన్ ఛార్జ్ చేసింది. ఇప్పుడు తాజాగా సెకండ్ లిస్ట్ అనౌన్స్మెంట్ జరిగింది. ఇందులో 27 మందిని ఇన్ చార్జి లుగా ప్రకటించింది. ఫస్ట్ లిస్టులో కేవలం ఎమ్మెల్యే అభ్యర్థులను మాత్రమే ప్రకటిస్తే సెకండ్ లిస్టులో మాత్రం ఎంపీ టికెట్స్ కూడా అనౌన్స్ చేసింది. అనంతపురం, అరకు, హిందూపురం పార్లమెంట్ స్థానాలకు కొత్త అభ్యర్థులను రంగంలోకి దింపింది. అలాగే నలుగురు సిట్టింగ్ ఎంపీలకు ఎమ్మెల్యే టికెట్లు కేటాయించింది. రాజమండ్రి ఎంపీ మార్గాన్ని భరత్ ను రాజమండ్రి సిటీకి , అరకు ఎంపీ గొడ్డేటి మాధవిని అరకు అసెంబ్లీ స్థానానికి, కాకినాడ ఎంపీ వంగా గీతను పిఠాపురం కు, అనంతపురం ఎంపీ తలారి రంగయ్యను కళ్యాణదుర్గం ఇన్ చార్జి లుగా ప్రకటించింది.
-ఎంపీలకు ఎమ్మెల్యే సీట్లు
మార్గాన్ని భరత్ – రాజమండ్రి సిటీ (ప్రస్తుతం రాజమండ్రి ఎంపీ)
-వంగా గీత – పిఠాపురం (ప్రస్తుతం కాకినాడ ఎంపీ)
తలారి రంగయ్య – కళ్యాణదుర్గం (ప్రస్తుతం అనంతపురం ఎంపీ)
– గొడ్డేటి మాధవి – అరకు (ప్రస్తుతం అరకు ఎంపీ) అనకాపల్లి కి మనసాల భరత్ కుమార్ ను రాజాంకు తాలె రాజేష్ ను, రామచంద్ర పురానికి పిల్లి సూర్యప్రకాష్ ను పాయకరావుపేటకు కంబాల జోగులను ప్రత్తిపాడు సుబ్బారావును, పి.గన్నవరానికి విప్పర్తి వేణుగోపాల్ ను, రాజమండ్రి రూరల్ కు చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణను, జగ్గంపేటకు తోట నరసింహంను, పోలవరానికి తెల్లం రాజ్యలక్ష్మిను, తిరుపతికి భూమన అభినయ్ రెడ్డిని, కదిరికి బిఎస్ మక్బూల్ అహ్మద్ ను, ఎర్రగొండపాలెం కు తాటిపర్తి చంద్రశేఖర్ ను, ఎమ్మిగనూరుకు మాచాని వెంకటేష్ ను, విజయవాడ వెస్ట్ కు షేక్ ఆసిఫ్ ను, విజయవాడ సెంట్రల్ కు బెల్లంపల్లి శ్రీనివాసరావును, పాడేరుకు మత్య్తరాస విశ్వేశ్వర రాజును, పెనుకొండకు కె.వి ఉషాశ్రీ చరణ్ ను, చంద్రగిరికి చెవిరెడ్డి మోహిత్ రెడ్డిని, మచిలీపట్నం కు పేర్ని కృష్ణమూర్తిని, గుంటూరు ఈస్ట్ కు షేక్ నూరి ఫాతిమాను ఇన్చార్జులుగా వైసీపీ నియమించింది.
1) జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు
2) పి.గన్నవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు
3) పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబు
4) ప్రత్తిపాడు ఎమ్మెల్యే పర్వత ప్రసాద్
5) కదిరి ఎమ్మెల్యే సిద్ధారెడ్డి
6) విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు
7) అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్
8) ఎమ్మిగనూరు ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి
9) అరకు ఎమ్మెల్యే చెట్టి ఫాల్గుణ
10) పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబురావు
11) హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్.
ఈ 11 మంది టికెట్లు కోల్పోయారు. అయితే మరో అయిదు సిట్టింగ్ ఎమ్మెల్యేల స్థానాల్లో వారసులకు వైసీపీ సీట్లు ఇచ్చింది. మరి మూడో లిస్టులో ఎంతమంది సిట్టింగ్ చీటీ చెరగబోతుందో మరో రెండు మూడు రోజులలో తెలియనుంది.
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
CISF Fireman Recruitment : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్మెన్ల నియామక…
Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ…
7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్నెస్ అలవెన్స్ (డీఏ)ని ప్రభుత్వం పెంచబోతోంది. ప్రభుత్వం త్వరలో…
Balineni Srinivas Reddy : గత కొద్ది రోజులుగా బాలినేని వైసీపీని వీడనున్నట్టు అనేక ప్రచారాలు జరిగాయి. ఎట్టకేలకి అది…
Jamili Elections : దేశవ్యాప్తంగా ఒకేసారి పార్లమెంట్ , అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేలా జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్ ఆమోదం…
Naga Manikanta : బుల్లితెర ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తున్న బిగ్ బాస్ ఇప్పుడు తెలుగులో సీజన్ 8 జరుపుకుంటుంది.తాజా సీజన్లోని…
This website uses cookies.