#image_titleTotapuri Mangoes : రెండు రాష్ట్రాల మధ్య చిచ్చు పెట్టిన తోతాపురి మామిడి..!
Totapuri Mangoes : ప్రతీ వేసవి సీజన్లో కర్ణాటక రాష్ట్రం నుండి పెద్ద ఎత్తున తోతాపురి మామిడి పండ్లు ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లాకు రవాణా చేయబడుతూ ప్రాసెసింగ్ యూనిట్లలో ఉపయోగిస్తుంటాయి. అయితే ఈ సంవత్సరం చిత్తూరులో మామిడి పంట విరివిగా కాపు రావడంతో స్థానిక రైతుల ప్రయోజనాలను కాపాడేందుకు జిల్లా అధికారులు కర్ణాటక నుండి మామిడి రవాణాను నిషేధించారు. ఈ నిర్ణయం రెండు రాష్ట్రాల మధ్య అభిప్రాయ భేదాలకు దారితీసింది. కర్ణాటకలోని సరిహద్దు ప్రాంతాల్లో తోతాపురి సాగు చేసే రైతులు ఈ ఆంక్షల కారణంగా తీవ్ర ఆర్థిక నష్టాలను ఎదుర్కొంటున్నారు…
#image_titleTotapuri Mangoes : రెండు రాష్ట్రాల మధ్య చిచ్చు పెట్టిన తోతాపురి మామిడి..!
కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ఈ అంశంపై ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబుకు లేఖ రాసి, ఈ నిర్ణయాన్ని ఉపసంహరించాలంటూ విజ్ఞప్తి చేశారు. ఇదొక ఏకపక్ష నిర్ణయం అని, ఇది రైతుల జీవనోపాధిని నాశనం చేస్తుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. అంతేకాకుండా ఇది సహకార భావానికి విరుద్ధంగా ఉందని, దీని వల్ల కర్ణాటక రైతులు కూడా ఆంధ్రప్రదేశ్ కూరగాయల రవాణాను అడ్డుకునే పరిస్థితి తలెత్తొచ్చని హెచ్చరించారు. కర్ణాటక CS షాలిని రజనీష్ కూడా ఏపీ CS విజయానంద్కు లేఖ రాసి, చిత్తూరు కలెక్టర్ విధించిన నిషేధాన్ని ఎత్తివేయాలని కోరారు.
ఇదిలా ఉంటే చిత్తూరు కలెక్టర్ సుమీత్ కుమార్ మాత్రం ఈ నిషేధాన్ని సమర్థించారు. ఇతర రాష్ట్రాల నుంచి మామిడి రవాణా జరిగితే స్థానిక రైతులకు ఇంకా తక్కువ ధరలే లభిస్తాయని, దీంతో తీవ్ర నష్టాలు వాటిల్లుతాయని చెప్పారు. ప్రస్తుతం కిలో తోతాపురి ధర కేవలం రూ.4కి పడిపోయిన నేపథ్యంలో, ఏపీ ప్రభుత్వం కనీస మద్దతు ధర రూ.8గా నిర్ణయించి, అందులో రూ.4ను సబ్సిడీగా ఇవ్వాలని నిర్ణయించింది. రెండు రాష్ట్రాల మధ్య పంట ఉత్పత్తి, మార్కెట్ ధరల అంశాలపై సమగ్ర చర్చల తర్వాతే తుదినిర్ణయం తీసుకుంటామని ఏపీ సీఎస్ వెల్లడించారు.
Perni Nani : మాజీ మంత్రి పేర్ని నాని మరియు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర మధ్య రాజకీయ దాడులు…
Niharika Konidela : మెగా డాటర్ నిహారిక యాంకర్గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఆ తర్వాత నటిగా మారింది. ఒక మనస్సు,…
Air India Crash : అహ్మదాబాద్ విమాన ప్రమాదం దేశాన్ని కుదిపేసిన సంగతి తెలిసిందే. ఎయిరిండియా విమానం గురువారం మధ్యాహ్నం…
CM Revanth Reddy : హైదరాబాద్ Hyderabad నగరంలో మహిళల ఆర్థికాభివృద్ధికి దోహదపడే విధంగా రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ…
Air India Flight : థాయ్లాండ్లోని ఫుకెట్ నుంచి ఢిల్లీకి వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానానికి (AI-379) శుక్రవారం బాంబు…
Bhagwat Geeta : తాజాగా జరిగిన ప్రమాదం లో అన్నీ కాలి బూడిద అవ్వడం చూశాం. ఈ ప్రమాదంలో మనుషులు…
S Name Astrology : సంఖ్యాయ శాస్త్రంలో ప్రతి ఒక అక్షరానికి ప్రత్యేక శక్తి, లక్షణాలు ఉంటాయి. మొదటి అక్షరం…
Ahmedabad Plane Crash : ఎయిర్ ఇండియా బోయింగ్ 787 డ్రీమ్లైనర్ 11 సంవత్సరాల పురాతన విమానం కాగా, అహ్మదాబాద్…
This website uses cookies.