#image_titleTotapuri Mangoes : రెండు రాష్ట్రాల మధ్య చిచ్చు పెట్టిన తోతాపురి మామిడి..!
Totapuri Mangoes : ప్రతీ వేసవి సీజన్లో కర్ణాటక రాష్ట్రం నుండి పెద్ద ఎత్తున తోతాపురి మామిడి పండ్లు ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లాకు రవాణా చేయబడుతూ ప్రాసెసింగ్ యూనిట్లలో ఉపయోగిస్తుంటాయి. అయితే ఈ సంవత్సరం చిత్తూరులో మామిడి పంట విరివిగా కాపు రావడంతో స్థానిక రైతుల ప్రయోజనాలను కాపాడేందుకు జిల్లా అధికారులు కర్ణాటక నుండి మామిడి రవాణాను నిషేధించారు. ఈ నిర్ణయం రెండు రాష్ట్రాల మధ్య అభిప్రాయ భేదాలకు దారితీసింది. కర్ణాటకలోని సరిహద్దు ప్రాంతాల్లో తోతాపురి సాగు చేసే రైతులు ఈ ఆంక్షల కారణంగా తీవ్ర ఆర్థిక నష్టాలను ఎదుర్కొంటున్నారు…
#image_titleTotapuri Mangoes : రెండు రాష్ట్రాల మధ్య చిచ్చు పెట్టిన తోతాపురి మామిడి..!
కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ఈ అంశంపై ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబుకు లేఖ రాసి, ఈ నిర్ణయాన్ని ఉపసంహరించాలంటూ విజ్ఞప్తి చేశారు. ఇదొక ఏకపక్ష నిర్ణయం అని, ఇది రైతుల జీవనోపాధిని నాశనం చేస్తుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. అంతేకాకుండా ఇది సహకార భావానికి విరుద్ధంగా ఉందని, దీని వల్ల కర్ణాటక రైతులు కూడా ఆంధ్రప్రదేశ్ కూరగాయల రవాణాను అడ్డుకునే పరిస్థితి తలెత్తొచ్చని హెచ్చరించారు. కర్ణాటక CS షాలిని రజనీష్ కూడా ఏపీ CS విజయానంద్కు లేఖ రాసి, చిత్తూరు కలెక్టర్ విధించిన నిషేధాన్ని ఎత్తివేయాలని కోరారు.
ఇదిలా ఉంటే చిత్తూరు కలెక్టర్ సుమీత్ కుమార్ మాత్రం ఈ నిషేధాన్ని సమర్థించారు. ఇతర రాష్ట్రాల నుంచి మామిడి రవాణా జరిగితే స్థానిక రైతులకు ఇంకా తక్కువ ధరలే లభిస్తాయని, దీంతో తీవ్ర నష్టాలు వాటిల్లుతాయని చెప్పారు. ప్రస్తుతం కిలో తోతాపురి ధర కేవలం రూ.4కి పడిపోయిన నేపథ్యంలో, ఏపీ ప్రభుత్వం కనీస మద్దతు ధర రూ.8గా నిర్ణయించి, అందులో రూ.4ను సబ్సిడీగా ఇవ్వాలని నిర్ణయించింది. రెండు రాష్ట్రాల మధ్య పంట ఉత్పత్తి, మార్కెట్ ధరల అంశాలపై సమగ్ర చర్చల తర్వాతే తుదినిర్ణయం తీసుకుంటామని ఏపీ సీఎస్ వెల్లడించారు.
Vijaywada | విజయవాడలోని పవిత్ర ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రుల సందర్భంగా కనకదుర్గమ్మ దర్శనార్థం భక్తులు భారీగా తరలివస్తున్నారు. అమ్మవారు ప్రతి రోజూ…
AP Free Bus Scheme | ఆంధ్రప్రదేశ్లో ఆగస్టు 15న ప్రారంభమైన స్త్రీ శక్తి పథకం విజయవంతంగా కొనసాగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా…
Telangana IPS Transfers | తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భారీ స్థాయిలో ఐపీఎస్ అధికారుల బదిలీలు చేపట్టింది. పోలీసు వ్యవస్థతో…
Allu Family | మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ మూడో కుమారుడైన శిరీష్ ‘గౌరవం’ మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చినా…
Eye Care Tips | నేటి మారుతున్న జీవనశైలి, చెడు ఆహారపు అలవాట్ల కారణంగా ప్రజలు అధికంగా చక్కెరను తీసుకుంటున్నారు. తాజా…
Ramen noodles | జపాన్లోని ఈశాన్య యమగటా ప్రిఫెక్చర్లో జరిగిన ఒక తాజా పరిశోధన ప్రకారం, తరచుగా రామెన్ తినేవారికి మరణ…
Lungs | మారుతున్న జీవన శైలి, వాతావరణ మార్పులు, వాయు కాలుష్యం కారణంగా ఊపిరితిత్తుల వ్యాధులు భారీ స్థాయిలో పెరుగుతున్నాయని వైద్య…
Sabudana | నవరాత్రి ఉపవాసం సమయంలో చాలా మంది బంగాళాదుంప కూరలు, బుక్వీట్ పిండి రొట్టెలు, ముఖ్యంగా సబుదాన వంటకాలను విస్తృతంగా…
This website uses cookies.