
#image_titleTotapuri Mangoes : రెండు రాష్ట్రాల మధ్య చిచ్చు పెట్టిన తోతాపురి మామిడి..!
Totapuri Mangoes : ప్రతీ వేసవి సీజన్లో కర్ణాటక రాష్ట్రం నుండి పెద్ద ఎత్తున తోతాపురి మామిడి పండ్లు ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లాకు రవాణా చేయబడుతూ ప్రాసెసింగ్ యూనిట్లలో ఉపయోగిస్తుంటాయి. అయితే ఈ సంవత్సరం చిత్తూరులో మామిడి పంట విరివిగా కాపు రావడంతో స్థానిక రైతుల ప్రయోజనాలను కాపాడేందుకు జిల్లా అధికారులు కర్ణాటక నుండి మామిడి రవాణాను నిషేధించారు. ఈ నిర్ణయం రెండు రాష్ట్రాల మధ్య అభిప్రాయ భేదాలకు దారితీసింది. కర్ణాటకలోని సరిహద్దు ప్రాంతాల్లో తోతాపురి సాగు చేసే రైతులు ఈ ఆంక్షల కారణంగా తీవ్ర ఆర్థిక నష్టాలను ఎదుర్కొంటున్నారు…
#image_titleTotapuri Mangoes : రెండు రాష్ట్రాల మధ్య చిచ్చు పెట్టిన తోతాపురి మామిడి..!
కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ఈ అంశంపై ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబుకు లేఖ రాసి, ఈ నిర్ణయాన్ని ఉపసంహరించాలంటూ విజ్ఞప్తి చేశారు. ఇదొక ఏకపక్ష నిర్ణయం అని, ఇది రైతుల జీవనోపాధిని నాశనం చేస్తుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. అంతేకాకుండా ఇది సహకార భావానికి విరుద్ధంగా ఉందని, దీని వల్ల కర్ణాటక రైతులు కూడా ఆంధ్రప్రదేశ్ కూరగాయల రవాణాను అడ్డుకునే పరిస్థితి తలెత్తొచ్చని హెచ్చరించారు. కర్ణాటక CS షాలిని రజనీష్ కూడా ఏపీ CS విజయానంద్కు లేఖ రాసి, చిత్తూరు కలెక్టర్ విధించిన నిషేధాన్ని ఎత్తివేయాలని కోరారు.
ఇదిలా ఉంటే చిత్తూరు కలెక్టర్ సుమీత్ కుమార్ మాత్రం ఈ నిషేధాన్ని సమర్థించారు. ఇతర రాష్ట్రాల నుంచి మామిడి రవాణా జరిగితే స్థానిక రైతులకు ఇంకా తక్కువ ధరలే లభిస్తాయని, దీంతో తీవ్ర నష్టాలు వాటిల్లుతాయని చెప్పారు. ప్రస్తుతం కిలో తోతాపురి ధర కేవలం రూ.4కి పడిపోయిన నేపథ్యంలో, ఏపీ ప్రభుత్వం కనీస మద్దతు ధర రూ.8గా నిర్ణయించి, అందులో రూ.4ను సబ్సిడీగా ఇవ్వాలని నిర్ణయించింది. రెండు రాష్ట్రాల మధ్య పంట ఉత్పత్తి, మార్కెట్ ధరల అంశాలపై సమగ్ర చర్చల తర్వాతే తుదినిర్ణయం తీసుకుంటామని ఏపీ సీఎస్ వెల్లడించారు.
Jr NTR : టాలీవుడ్లో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రాజెక్టుల్లో జూనియర్ ఎన్టీఆర్, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో తెరకెక్కనున్న…
Balka Suman Arrest : తెలంగాణ రాజకీయాల్లో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మాజీ ఎమ్మెల్యే, BRS నాయకుడు బాల్క…
హైదరాబాద్లోని గాంధీభవన్ ప్రాంగణంలో ఉన్న ఇందిరా భవన్లో మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గ స్థాయి కాంగ్రెస్ పార్టీ సమీక్ష సమావేశం ఘనంగా…
Union Cabinet Expansion : ప్రధానమంత్రి Narendra Modi నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత రెండో…
Peddi Movie : మెగా పవర్ స్టార్ Ram Charan నటిస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం ‘పెద్ది’ ప్రస్తుతం…
Pawan Kalyan : 2027లో జరగనున్న గోదావరి పుష్కరాలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే దృష్టి సారించింది. ముఖ్యంగా ఉప ముఖ్యమంత్రి…
OTT Movie : వేదికలపై ప్రతిరోజూ కొత్త సినిమాలు, వెబ్ సిరీస్లు విడుదలవుతున్నాయి. అయితే కొన్ని సినిమాలు మాత్రం విడుదలైన…
Ganugabanda : సమాజంలో చిన్నారుల ఆరోగ్యవంతమైన ఎదుగుదల, విద్యాభివృద్ధి లక్ష్యంగా అంగన్వాడీ కేంద్రాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని అంగన్వాడీ టీచర్…
After : తెలంగాణలోని నాగర్కర్నూల్ జిల్లాలో వెలుగులోకి వచ్చిన ఓ హత్య కేసు స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది. వివాహేతర…
Cooking Oil : మన రోజువారీ వంటల్లో వంట నూనె కీలక పాత్ర పోషిస్తుంది. కూరలు, ఫ్రైలు, స్నాక్స్, పప్పులు..…
వేసవి కాలంలో అధిక ఉష్ణోగ్రతలు, చెమటలు, నీరసం, అలసట వంటి సమస్యలు సాధారణంగా కనిపిస్తుంటాయి. ముఖ్యంగా బయట ఎక్కువ సమయం…
Free Bus : ఆంధ్రప్రదేశ్ ప్రజలకు APSRTC మరో శుభవార్త చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా వివిధ డిపోలలో త్వరలోనే 750 ఎలక్ట్రిక్…
This website uses cookies.