
cm jagan mohan reddy
vizag : విశాఖపట్నం రాష్ట్రానికి కాబోయే రాజధాని అంటూ సీఎం జగన్ ప్రకటించాడు. ఎంతో వ్యతిరేకత వచ్చిన కానీ తన నిర్ణయాన్ని మార్చుకోలేదు. అది చూసి వామ్మో జగన్ గుండె సామాన్యమైనది కాదు అని అనుకున్నారు. ఎలాంటి భయం లేకుండా, బెరుకు లేకుండా పరిపాలన చేస్తున్న జగన్, తాజాగా జరుగుతున్నా మున్సిపల్ ఎన్నికల్లో మాత్రం కొంచం భయపడుతున్నట్లే కనిపిస్తున్నాడు.
vizag
విశాఖ మున్సిపల్ ఎన్నికల్లో దాదాపు 98 డివిజన్స్ లో తమ అభ్యర్థులను ప్రకటించిన వైసీపీ పార్టీ, మేయర్ అభ్యర్థి ఎవరు అనేది మాత్రం ప్రకటించలేదు. విశాఖ మేయర్ స్థానం బిసి జనరల్కు రిజర్వేషన్ ఖరారయింది. దీంతో ఆశావహులైన అభ్యర్థుల కోసం ప్రధాన పార్టీలు జల్లెడ పడితే తెలుగుదేశం పార్టీ నుంచి నలుగురు క్లీన్ చిట్ ఉన్న అభ్యర్థులు తెరపైకి వచ్చారు. వారిలో ఒకరిని ఖరారు చేస్తూ పీలా శ్రీనివాస్ పేరును ఐదు రోజుల క్రితమే పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు కార్పొరేటర్ అభ్యర్థుల జాబితాతో పాటు విడుదల చేశారు. అనంతరం శుక్రవారం చంద్రబాబు రోడ్ షోలో బహిరంగంగా ప్రకటించారు.
నీ వైసీపీ మాత్రం తమ అభ్యర్థిని ప్రకటించలేదు. దీనికి ప్రధాన కారణం టీడీపీ ప్రకటించిన అభ్యర్థి ని చెపుతున్నారు. ఎన్నికల సమయంలో అవతలి అభ్యర్థి ఎవరు అనే దానిని గమనించి మిగిలిన పార్టీలు తమ తమ అభ్యర్థిని రంగంలోకి దించుతాయి. టీడీపీ నుండి పల్ల శ్రీనివాసును ఖారారు చేయటంతో వైసీపీలో అతనికి పోటీ ఇచ్చే నేత కనిపించలేదని తెలుస్తుంది. దాదాపు 30 ఏళ్ల నుండి రాజకీయంలో ఉంటున్న పల్ల శ్రీనివాసు కు క్లిన్ చిట్ ఉంది. అలాంటి నేత వైసీపీ కి లేకపోవటం వెలితే అని చెప్పాలి.
ముఖ్యంగా పార్టీ అధికారంలో ఉండటంతో ఆశావహులు సంఖ్య కూడా ఎక్కువగానే ఉంటుంది. ముందుగానే మేయర్ అభ్యర్థి ఎవరు అనేది ప్రకటిస్తే ఆ తరువాత రెబల్స్ ఎక్కువయ్యే అవకాశం లేకపోలేదు. ఈ భయంతో కూడా వైసీపీ మేయర్ అభ్యర్థి ఎవరు అనేది ఫైనల్ చేయలేదని తెలుస్తుంది. ఉన్నత విద్యనభ్యసించిన బీసీ మహిళను ఆస్థానంలో కూర్చోబెట్టాలని అధిష్ఠానం యోచిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. మరోవైపు వంశీకృష్ణ పేరు విస్తృతంగా ప్రచారంలో ఉంది.
ప్రధానంగా 21 వ వార్డు అభ్యర్థి సిహెచ్ వంశీకృష్ణ శ్రీనివాస్, పెందుర్తి ప్రాంతానికి చెందిన శరగడం చిన అప్పలనాయుడు, గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి తనయుడు వంశీకృష్ణ పేర్లు కూడా ఈ రేసులో ఉన్నట్టు ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ఒకవేళ మహిళా నేతకే ఈ అవకాశం దక్కితే, తొమ్మిదో వార్డు నుంచి పోటీ చేస్తున్న వెంకటరత్నం స్వాతితో పాటు, 12వ వార్డు నుంచి పోటీ చేస్తున్న రోహిణి, 75వ వార్డు నుంచి పోటీ చేస్తున్న తిప్పల జ్వాల పేర్లు తెరపైకి వచ్చే అవకాశం ఉంది. విశాఖ మేయర్ సీటు వైసీపీ కైవసం చేసుకుంటే పైనా పేర్కొన్న వాళ్లలో ఎవరికో ఒకరికి మేయర్ పదవి దక్కే అవకాశం ఉంది.
Rajinikanth : సూపర్ స్టార్ Rajinikanth మరోసారి రాజకీయాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “నేను రాజకీయాల్లోకి రానని ఎప్పుడో స్పష్టంగా…
Linguda : ప్రకృతిలో లభించే కొన్ని ఆహార పదార్థాలు ఆరోగ్యానికి అద్భుత ప్రయోజనాలు అందిస్తాయని నిపుణులు చెబుతుంటారు. అలాంటి వాటిలో…
Fenugreek Seeds : మెంతులు భారతీయ వంటకాలలో విరివిగా ఉపయోగించే ముఖ్యమైన పదార్థాల్లో ఒకటి. వీటిని ఆరోగ్యానికి ఎంతో మేలు…
Bottle Gourd Juice : ప్రస్తుతం బరువు తగ్గడం, ముఖ్యంగా పొట్ట చుట్టూ పేరుకుపోయే కొవ్వును తగ్గించుకోవడం కోసం చాలామంది…
Petrol : భారత్లో పెట్రోల్ వినియోగంపై తాజాగా వెలువడిన గణాంకాలు ఆసక్తికర చర్చకు దారితీశాయి. దేశంలో ఒక్కో వ్యక్తి ప్రాతిపదికన…
PM Modi : ప్రధానమంత్రి Narendra Modi ఇటీవల చేసిన “స్మార్ట్ స్పెండింగ్” పిలుపు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. బంగారం…
Farmers Good News : కేంద్ర ప్రభుత్వం రైతులు మరియు మౌలిక సదుపాయాల అభివృద్ధిపై కీలక నిర్ణయాలు తీసుకుంది. తాజాగా…
Donald Trump : అమెరికా మాజీ అధ్యక్షుడు Donald Trump చైనా పర్యటనకు సంబంధించిన వార్తలు ప్రస్తుతం అంతర్జాతీయ రాజకీయాల్లో…
Heart Health : ప్రస్తుతం గుండె జబ్బులు ప్రపంచవ్యాప్తంగా ప్రధాన ఆరోగ్య సమస్యగా మారుతున్నాయి. వయస్సుతో సంబంధం లేకుండా యువతలో…
Working Hours : ప్రస్తుతం చాలా మంది ఉద్యోగులు రోజుకు 8 నుంచి 12 గంటల వరకు కంప్యూటర్ ముందు…
AP Rajya Sabha : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి రాజ్యసభ ఎన్నికల హడావిడి మొదలైంది. రాష్ట్రంలో ఖాళీ కానున్న రాజ్యసభ…
Anushka Shetty : దక్షిణాది సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న Anushka Shetty మరోసారి వార్తల్లో…
This website uses cookies.