cm jagan mohan reddy
vizag : విశాఖపట్నం రాష్ట్రానికి కాబోయే రాజధాని అంటూ సీఎం జగన్ ప్రకటించాడు. ఎంతో వ్యతిరేకత వచ్చిన కానీ తన నిర్ణయాన్ని మార్చుకోలేదు. అది చూసి వామ్మో జగన్ గుండె సామాన్యమైనది కాదు అని అనుకున్నారు. ఎలాంటి భయం లేకుండా, బెరుకు లేకుండా పరిపాలన చేస్తున్న జగన్, తాజాగా జరుగుతున్నా మున్సిపల్ ఎన్నికల్లో మాత్రం కొంచం భయపడుతున్నట్లే కనిపిస్తున్నాడు.
vizag
విశాఖ మున్సిపల్ ఎన్నికల్లో దాదాపు 98 డివిజన్స్ లో తమ అభ్యర్థులను ప్రకటించిన వైసీపీ పార్టీ, మేయర్ అభ్యర్థి ఎవరు అనేది మాత్రం ప్రకటించలేదు. విశాఖ మేయర్ స్థానం బిసి జనరల్కు రిజర్వేషన్ ఖరారయింది. దీంతో ఆశావహులైన అభ్యర్థుల కోసం ప్రధాన పార్టీలు జల్లెడ పడితే తెలుగుదేశం పార్టీ నుంచి నలుగురు క్లీన్ చిట్ ఉన్న అభ్యర్థులు తెరపైకి వచ్చారు. వారిలో ఒకరిని ఖరారు చేస్తూ పీలా శ్రీనివాస్ పేరును ఐదు రోజుల క్రితమే పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు కార్పొరేటర్ అభ్యర్థుల జాబితాతో పాటు విడుదల చేశారు. అనంతరం శుక్రవారం చంద్రబాబు రోడ్ షోలో బహిరంగంగా ప్రకటించారు.
నీ వైసీపీ మాత్రం తమ అభ్యర్థిని ప్రకటించలేదు. దీనికి ప్రధాన కారణం టీడీపీ ప్రకటించిన అభ్యర్థి ని చెపుతున్నారు. ఎన్నికల సమయంలో అవతలి అభ్యర్థి ఎవరు అనే దానిని గమనించి మిగిలిన పార్టీలు తమ తమ అభ్యర్థిని రంగంలోకి దించుతాయి. టీడీపీ నుండి పల్ల శ్రీనివాసును ఖారారు చేయటంతో వైసీపీలో అతనికి పోటీ ఇచ్చే నేత కనిపించలేదని తెలుస్తుంది. దాదాపు 30 ఏళ్ల నుండి రాజకీయంలో ఉంటున్న పల్ల శ్రీనివాసు కు క్లిన్ చిట్ ఉంది. అలాంటి నేత వైసీపీ కి లేకపోవటం వెలితే అని చెప్పాలి.
ముఖ్యంగా పార్టీ అధికారంలో ఉండటంతో ఆశావహులు సంఖ్య కూడా ఎక్కువగానే ఉంటుంది. ముందుగానే మేయర్ అభ్యర్థి ఎవరు అనేది ప్రకటిస్తే ఆ తరువాత రెబల్స్ ఎక్కువయ్యే అవకాశం లేకపోలేదు. ఈ భయంతో కూడా వైసీపీ మేయర్ అభ్యర్థి ఎవరు అనేది ఫైనల్ చేయలేదని తెలుస్తుంది. ఉన్నత విద్యనభ్యసించిన బీసీ మహిళను ఆస్థానంలో కూర్చోబెట్టాలని అధిష్ఠానం యోచిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. మరోవైపు వంశీకృష్ణ పేరు విస్తృతంగా ప్రచారంలో ఉంది.
ప్రధానంగా 21 వ వార్డు అభ్యర్థి సిహెచ్ వంశీకృష్ణ శ్రీనివాస్, పెందుర్తి ప్రాంతానికి చెందిన శరగడం చిన అప్పలనాయుడు, గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి తనయుడు వంశీకృష్ణ పేర్లు కూడా ఈ రేసులో ఉన్నట్టు ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ఒకవేళ మహిళా నేతకే ఈ అవకాశం దక్కితే, తొమ్మిదో వార్డు నుంచి పోటీ చేస్తున్న వెంకటరత్నం స్వాతితో పాటు, 12వ వార్డు నుంచి పోటీ చేస్తున్న రోహిణి, 75వ వార్డు నుంచి పోటీ చేస్తున్న తిప్పల జ్వాల పేర్లు తెరపైకి వచ్చే అవకాశం ఉంది. విశాఖ మేయర్ సీటు వైసీపీ కైవసం చేసుకుంటే పైనా పేర్కొన్న వాళ్లలో ఎవరికో ఒకరికి మేయర్ పదవి దక్కే అవకాశం ఉంది.
Nagababu : మెగా ఫ్యామిలీ సభ్యుడు, నటుడు, ఎమ్మెల్సీ నాగబాబు తాజాగా తన కుటుంబ విషయాలపై స్పందించారు. ముఖ్యంగా తన…
Bike : ఇటీవల రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతుండడం మనం చూస్తూ ఉన్నాం. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం కీలక…
Pawan Kalyn : టాలీవుడ్ కా పవర్ స్టార్ అలానే ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సినిమాలతో…
Vijay Devarakonda : రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ. మనసులో ఏం దాచుకోకుండా, ఉన్నది ఉన్నట్లు మాట్లాడుతారు. వేదికలపై ప్రసంగించేటప్పుడు…
Wife : కర్నూలు జిల్లా పిన్నాపురంలో దారుణ సంఘటన చోటు చేసుకుంది. తెలంగాణకు చెందిన ప్రైవేట్ సర్వేయర్ తేజేశ్వర్ అనే యువకుడిని,…
Rappa Politics : ఆంధ్రప్రదేశ్లో రాజకీయ సంచలనం రేపిన ‘రప్ప రప్ప’ నినాదం ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లోనూ ఊపేసింది. ఏపీలో…
Laya : అందం.. అభినయంతో ఒకప్పుడు తెలుగు చిత్రపరిశ్రమలో అగ్రకథానాయికగా ఓ వెలుగు వెలిగింది హీరోయిన్ లయ. స్వయంవరం సినిమాతో…
Chandrababu : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ప్రభుత్వం సామాజిక భద్రతా పింఛన్లను రికార్డు స్థాయిలో పెంచడం ద్వారా మళ్లీ…
This website uses cookies.