Wife : ప్రియుడి కోసం సాంబారులో విషం కలిపి భర్తను చంపిన భార్య..!
Wife : తమిళనాడులోని ధర్మపురి జిల్లాలో మానవత్వాన్ని మరిచిపోయే ఘటన చోటుచేసుకుంది. ఇద్దరు పిల్లల తల్లి తన భర్తను హత్య చేసిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. కీర్తెపట్టి గ్రామానికి చెందిన 35ఏళ్ల రసూల్ అనే వ్యక్తి ఓ ప్రైవేట్ సంస్థలో డ్రైవర్గా పని చేస్తున్నాడు. అతనికి భార్య అమ్ముబీ, కుమారుడు, కుమార్తె ఉన్నారు. కుటుంబాన్ని ఆదుకుంటూ హాయిగా జీవనం సాగిస్తున్న రసూల్ జీవితంలో పెను విషాదం మిగిలింది.
Wife : ప్రియుడి కోసం సాంబారులో విషం కలిపి భర్తను చంపిన భార్య..!
అతని భార్య అమ్ముబీకి, అదే గ్రామానికి చెందిన సెలూన్ నడిపే లోకేశ్వరన్తో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ వ్యవహారం ఎవరికీ తెలియకుండా చాటుగా కొనసాగించేవారు. కానీ రోజురోజుకూ కలిసే తాహతాహలు పెరిగిపోవడంతో ఇద్దరూ ఓ నిర్ణయానికి వచ్చారు. తమ ప్రేమ బంధానికి అడ్డుగా ఉన్న భర్తను తొలగించాలని డిసైడ్ అయ్యారు. దీంతో లోకేశ్వరన్, అమ్ముబీ కలిసి ఘోర పథకం రచించారు.
లోకేశ్వరన్ తీసుకొచ్చిన విషాన్ని మొదటగా దానిమ్మ రసంలో కలిపి భర్తకు ఇవ్వాలని అమ్ముబీ ప్రయత్నించింది. కానీ రసూల్ దానిని తాగలేకపోయాడు. వెంటనే ఆమె అది పారబోసి, భోజన సమయంలో సాంబారులో కలిపి అన్నంతో పెట్టింది. భర్త ఆ అన్నాన్ని తిని పడుకున్నాడు. ఆ రాత్రే వాంతులు మొదలై రసూల్ అస్వస్థతకు గురయ్యాడు. కుటుంబ సభ్యులు వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించినా, అక్కడ చికిత్స పొందుతూ రసూల్ మరణించాడు.
వైద్యులు రసూల్ శరీరంలో పురుగుమందు ఆనవాళ్లు గుర్తించడంతో పోలీసులు రంగంలోకి దిగారు. విచారణలో మొదట భార్యా పిల్లల్ని ప్రశ్నించగా, అమ్ముబీ తీరుపై అనుమానం వచ్చింది. సెల్ఫోన్ పరిశీలనలో ఆమె, లోకేశ్వరన్ మధ్య జరిగిన వాట్సాప్ చాట్ పోలీసులు కనిపెట్టారు. అందులో “దానిమ్మ రసంలో కలిపాను తాగలేదు, అందుకే అన్నంలో కలిపాను” అనే ఉండడం హత్యను బహిర్గతం చేసింది. దీంతో ఇద్దరినీ పోలీసులు అరెస్ట్ చేసి విచారణ కొనసాగిస్తున్నారు. ఈ దారుణ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
Brahmanandam : పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కిన ‘హరిహర వీరమల్లు’ hari hara veera mallu Movie Review ప్రీ…
Hari Hara Veera Mallu : హరిహర వీరమల్లు ప్రీ రిలీజ్ ఈవెంట్లో పవన్ కళ్యాణ్ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు…
Anand : జగపతి బాబు Jagapathi babu, సౌందర్య, మహేశ్వరి నటించిన ‘ప్రియరాగాలు’ సినిమాలో సౌందర్య కుమారుడిగా ఆకట్టుకున్న ఆ…
Magnesium Oil : కొంతమందికి పడుకోగానే నిద్ర పట్టదు. అలాగే కీళ్ల నొప్పులతో బాధపడతారు. ఇంకా మలబద్ధక సమస్యలతో ఇబ్బంది…
Blue Tea : ప్రకృతి ఇచ్చే మొక్కల్లో ఎన్నో ఆయుర్వేద గుణాలు ఉన్నాయి. కొన్ని పండ్లు,ఆకులు ఆయుర్వేద మూలికల్లో ఉపయోగిస్తే,పుష్పాలను…
Vastu Tips : చాలామంది ఇళ్లల్లో పెరట్లో బొప్పాయి చెట్లను పెంచుకోవడం చేస్తూనే ఉంటాం. కొందరి అవంతటికవే బొప్పాయి చెట్లు…
Harish Rao : ఒకప్పుడు తెలంగాణలో ఎకరం భూమి అమ్మితే ఆంధ్రాలో పది ఎకరాలు వచ్చేవి ..కానీ ఇప్పుడు ఏపీలో…
Gutta Sukhender Reddy : తెలంగాణ Telangana శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి రాజకీయ నాయకుల మాటల…
This website uses cookies.