
Wife : ప్రియుడి కోసం సాంబారులో విషం కలిపి భర్తను చంపిన భార్య..!
Wife : తమిళనాడులోని ధర్మపురి జిల్లాలో మానవత్వాన్ని మరిచిపోయే ఘటన చోటుచేసుకుంది. ఇద్దరు పిల్లల తల్లి తన భర్తను హత్య చేసిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. కీర్తెపట్టి గ్రామానికి చెందిన 35ఏళ్ల రసూల్ అనే వ్యక్తి ఓ ప్రైవేట్ సంస్థలో డ్రైవర్గా పని చేస్తున్నాడు. అతనికి భార్య అమ్ముబీ, కుమారుడు, కుమార్తె ఉన్నారు. కుటుంబాన్ని ఆదుకుంటూ హాయిగా జీవనం సాగిస్తున్న రసూల్ జీవితంలో పెను విషాదం మిగిలింది.
Wife : ప్రియుడి కోసం సాంబారులో విషం కలిపి భర్తను చంపిన భార్య..!
అతని భార్య అమ్ముబీకి, అదే గ్రామానికి చెందిన సెలూన్ నడిపే లోకేశ్వరన్తో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ వ్యవహారం ఎవరికీ తెలియకుండా చాటుగా కొనసాగించేవారు. కానీ రోజురోజుకూ కలిసే తాహతాహలు పెరిగిపోవడంతో ఇద్దరూ ఓ నిర్ణయానికి వచ్చారు. తమ ప్రేమ బంధానికి అడ్డుగా ఉన్న భర్తను తొలగించాలని డిసైడ్ అయ్యారు. దీంతో లోకేశ్వరన్, అమ్ముబీ కలిసి ఘోర పథకం రచించారు.
లోకేశ్వరన్ తీసుకొచ్చిన విషాన్ని మొదటగా దానిమ్మ రసంలో కలిపి భర్తకు ఇవ్వాలని అమ్ముబీ ప్రయత్నించింది. కానీ రసూల్ దానిని తాగలేకపోయాడు. వెంటనే ఆమె అది పారబోసి, భోజన సమయంలో సాంబారులో కలిపి అన్నంతో పెట్టింది. భర్త ఆ అన్నాన్ని తిని పడుకున్నాడు. ఆ రాత్రే వాంతులు మొదలై రసూల్ అస్వస్థతకు గురయ్యాడు. కుటుంబ సభ్యులు వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించినా, అక్కడ చికిత్స పొందుతూ రసూల్ మరణించాడు.
వైద్యులు రసూల్ శరీరంలో పురుగుమందు ఆనవాళ్లు గుర్తించడంతో పోలీసులు రంగంలోకి దిగారు. విచారణలో మొదట భార్యా పిల్లల్ని ప్రశ్నించగా, అమ్ముబీ తీరుపై అనుమానం వచ్చింది. సెల్ఫోన్ పరిశీలనలో ఆమె, లోకేశ్వరన్ మధ్య జరిగిన వాట్సాప్ చాట్ పోలీసులు కనిపెట్టారు. అందులో “దానిమ్మ రసంలో కలిపాను తాగలేదు, అందుకే అన్నంలో కలిపాను” అనే ఉండడం హత్యను బహిర్గతం చేసింది. దీంతో ఇద్దరినీ పోలీసులు అరెస్ట్ చేసి విచారణ కొనసాగిస్తున్నారు. ఈ దారుణ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
Bank Holidays : జనవరి 27న దేశవ్యాప్తంగా ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో లావాదేవీలకు అంతరాయం ఏర్పడింది. ఈరోజు కూడా బ్యాంకులు…
Vizianagaram: మానవత్వ విలువలు రోజురోజుకు క్షీణిస్తున్నాయనే వాదనకు విజయనగరం జిల్లాలో చోటుచేసుకున్న ఈ దారుణ ఘటన సాక్ష్యంగా నిలుస్తోంది. కేవలం…
Samantha : సినిమా రంగంలో నటీమణులు పెళ్లి తర్వాత తమ ఇంటి పేరును మార్చుకోవడం ఒక ఆనవాయితీగా వస్తోంది. గతంలో…
Roja : చిత్తూరు జిల్లా నగరిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్వహించిన పర్యటనపై వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి ఆర్కే…
Cijayasai Reddy Padayatra : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అత్యంత సన్నిహితంగా మెలిగిన జగన్ - విజయసాయి రెడ్డి ద్వయం మధ్య…
Samantha : సమంత వ్యక్తిగతంగానే కాదు సినిమాల పరంగా కూడా నిత్యం వార్తల్లో నిలుస్తూ వస్తుంటుంది. నాగచైతన్యతో విడాకుల తర్వాత…
Chiranjeevi : ‘ మన శంకరవరప్రసాద్ గారు ’ మూవీ సక్సెస్ మీట్లో మెగాస్టార్ చిరంజీవి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం…
Today Gold Rate on Jan 29th 2026 : బంగారం ధరల పెరుగుదల ప్రస్తుతం సామాన్యులకు పెను భారంగా…
This website uses cookies.