
YS Jagan : ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ రైతులకు వై.యస్ జగన్ శుభవార్త..!
YS Jagan : ఆంధ్ర రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ జగన్ ప్రభుత్వం రైతులకు శుభవార్త తీసుకువచ్చింది. ఈసారి ఎలక్షన్స్ లో మళ్లీ విజయం సాధించి అధికారం నిలబెట్టుకోవాలనే ఆతృతతో జగన్ సర్కార్ అన్ని వర్గాల నుండి ప్రజల మద్దతు కోసం ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఒకవైపు సంక్షేమ పథకాలతో పాటు మరోవైపు వివిధ రకాల కార్యక్రమాలను చేపడుతూ కీలక నిర్ణయాలు తీసుకుంటూ జగన్ సర్కార్ ముందుకు దూసుకుపోతున్నారు.
ఈ నేపథ్యంలోనే ఇటీవల వై.యస్ జగన్ మోహన్ రెడ్డి రైతు సంక్షేమంపై దృష్టి సారించారు. అయితే ఇప్పటికే ఏపీలోని రైతులకు మూడో విడత రైతు భరోసాను అందించిన వైయస్ జగన్ ఇప్పుడు 2023 24 సంవత్సరంలో మిచాన్ తుఫాన్ తో తీవ్ర వర్షాల కారణంగా , తీవ్ర వర్షాభావ పరిస్థితుల కారణంగా , ఖరీఫ్ మరియు రబీ పంటలను నష్టపోయిన రైతాంగానికి నష్టపరిహారం ఇవ్వనున్నారు.
అదేవిధంగా ఇటీవల ఆంధ్ర రాష్ట్రంలో రైతన్నలు పండించిన పంటలకు గిట్టుబాటు ధర విషయంపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. మొక్కజొన్నలు హైబ్రిడ్ రకం జొన్నలకు గిట్టుబాటు ధరలను ప్రకటిస్తూ జగన్ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అంతేకాక ఈ కొనుగోల్లను మే 15 వరకు జరపాలని నిర్ణయించింది. అంతేకాక మొక్కజొన్నకు కనీసం మద్దతు ధర క్వింటాకు 2090 రూపాయలను చెల్లించాలని పేర్కొంది. ఇక దీనిపై వ్యవసాయ మార్కెట్ శాఖ స్పెషల్ సిఎస్ మార్గదర్శకాలను కూడా జారీ చేయడంతో మార్క్ ఫెడ్ కూడా రంగంలోకి దిగింది.
ఇది ఇలా ఉండగా మరోవైపు హైబ్రిడ్ రకం జొన్నలకు సంబంధించి మద్దతు ధర కంటే తక్కువగా మార్కెట్ ధర ఉండటంతో దీనికి కూడా గిట్టుబాటు ధర ఇచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే రైతులకు రైతు భరోసా కల్పించడం కోసం మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద హైబ్రిడ్ రకం జొన్నలను కొనుగోలు చేయాలని జగన్ సర్కార్ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.
Tea With Biscuits : చాలామందికి ఉదయం లేదా సాయంత్రం వేళల్లో వేడివేడి టీతో పాటు బిస్కెట్లు తినడం ఒక…
Ys Jagan : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక్కసారిగా ఢిల్లీ పర్యటనలు సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ అయ్యాయి. మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ…
INDIAN ARMY : భారతదేశ రక్షణ రంగం భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని రూపొందించిన పది ఏళ్ల భారీ ప్రణాళిక మన దేశ…
Revanth Reddy : తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం ఒక ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. అదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పనితీరు మరియు…
Modi Decisions : దేశంలో స్వచ్ఛంద సంస్థల పేరుతో విదేశాల నుండి వచ్చే నిధుల వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు…
Visakhapatnam Murder Case ప్రశాంతతకు మారుపేరైన విశాఖపట్నం Visakhapatnam నగరంలో నెత్తురోడింది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ శ్రద్ధా వాకర్…
YS Jagan Arrest: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గత కొద్ది రోజులుగా జగన్ అరెస్ట్ అంశం మళ్ళీ తెరపైకి వచ్చింది. రాష్ట్రంలో…
Hydroponics Farming : వ్యవసాయం అనగానే ఎకరాల కొద్దీ భూమి, దానికి తగ్గట్లు మట్టి, ట్రాక్టర్లు, ఎరువులు.. ఇవే మనకు…
Director Raghavendra Rao : తెలుగు చలనచిత్ర పరిశ్రమలో శతాధిక చిత్రాల దర్శకుడిగా వెలుగొందుతున్న కె. రాఘవేంద్రరావు, తాజాగా ఒక…
New Changes : భారతదేశంలో కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం కానున్న నేపథ్యంలో ఏప్రిల్ 1, 2026 నుంచి పలు…
Gold Silver Rate 30 March 2026 : భారతీయులకు బంగారం అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని…
Karthika Deepam 2 March 30th 2026 Episode : స్టార్ మా ఛానెల్లో ప్రసారం అవుతూ, తెలుగు బుల్లితెర…
This website uses cookies.